breaking news
Devendra fadnavis government
-
ట్రాఫిక్ బంధనం నుంచి బయటపడేలా అదిరిపోయే ప్లాన్!
జనాభా అవసరాలకు అనుగుణంగా సొంత వాహనాలు పెరిగే కొద్దీ.. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే.. ముంబై వీధుల్లో ఆ గందరగోళం ఇక పాతాళంలోకి కరిగిపోనుంది. భూమి క్రింద మరో కొత్త లోకం తెరుచుకోబోతోంది. అవును..ముంబై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న ప్రణాళికను ప్రకటించారు. “పాతాళ్ లోక్”(Paatal Lok) పేరుతో భూగర్భ టన్నెల్ నెట్వర్క్ను నిర్మించి నగర రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఈ టన్నెల్లు పైభాగంలోని రహదారులకు సమాంతరంగా ఉంటూ.. మెట్రో మార్గాలతో కలుపుతూ.. ముంబైకి కొత్త రవాణా రూపకల్పనను అందించబోతునున్నట్లు తెలిపారాయన. ఎలా సహాయపడుతుందంటే.. ముంబైలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం.. పాతాళ్ లోక్ ముఖ్య ఉద్దేశం. భూమి క్రింద రోడ్లకు సమాంతరంగా పెద్ద టన్నెల్ వ్యవస్థ నిర్మిస్తారు. ఇది భూమి క్రింద సమాంతర రహదారి వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే పైభాగంలోని ప్రధాన రహదారులకు “షాడో నెట్వర్క్”లా ఉంటుందన్నమాట. డీకన్జెషన్తో పైభాగంలోని రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి.. ట్రాఫిక్ సాఫీగా కదులుతుంది. తద్వారా ప్రయాణికులకు ‘గంటల తరబడి’ అనే నరకయాతన తప్పనుంది. అలాగే.. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారాలు, లాజిస్టిక్స్ వేగవంతం కానుంది. అదే సమయంలో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.ముంబై నగరం కోసం ఫడ్నవీస్ సర్కార్ అమలు చేయబోతున్న ప్రణాళికలో.. బోరివలి–గోరేగావ్ మధ్య సమాంతర రహదారి, వర్లీ–శివడి కనెక్టర్ (తదుపరి సంవత్సరం పూర్తి), బాంద్రా–BKC టన్నెల్ ( దీని ద్వారా ఎయిర్పోర్ట్ యాక్సెస్ మెరుగుపరుస్తుంది). దక్షిణ ముంబై నుంచి భయందర్ వరకు విస్తరించే కోస్టల్ రోడ్ కూడా ఈ ప్రణాళికలో భాగం. అలాగే.. ఈ టన్నెల్ ప్రాజెక్ట్కి తోడ్పాటుగా మెట్రో విస్తరణ కూడా జరగనుంది. -
మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
-
మహారాష్ట్ర సర్కారులోకి శివసేన
మంత్రులుగా పది మంది ప్రమాణం బీజేపీ తరఫున మరో పది మంది మంత్రుల ప్రమాణం 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-సేన ప్రభుత్వం సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ముందు నుంచి బీజేపీ-శివసేన పార్టీల మధ్య జరిగిన నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకున్న రెండు పార్టీలు తిరిగి ఒక్కటయ్యాయి. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో శివసేన భాగస్వామిగా చేరింది. శివసేన తరఫు నుంచి ఐదుగురు కేబినెట్ మంత్రులుగా, మరో ఐదుగురు సహాయ హోదాతో మొత్తం పది మందికి మంత్రులుగా అవకాశం లభించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-శివసేన నేతృత్వంలోని కాషాయ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయింది. మరో విశేషం ఏమిటంటే ప్రతిపక్ష హోదాలోని పార్టీ ప్రభుత్వంలో చేరడం, అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల సమయంలో కావడం గమనార్హం. మహారాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ, శివసేన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సమక్షంలో ఆ రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్రావు మొత్తం 20 మందితో మంత్రులుగా ప్రమాణం చేయిం చారు. ఇందులో కేబినెట్ మంత్రులుగా బీజేపీ తరఫున గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, చంద్రశేఖర్ బావన్కులే, బబన్రావ్ లోణికార్, రాజ్కుమార్ బడోలేతో పాటు శివసేన తరఫున దివాకర్ రావుతే, సుభాష్ దేశాయ్, రాందాస్ కదం, ఏక్నాథ్ షిండే, దీపక్ సావంత్ ప్రమాణం చేశారు. సహాయ మంత్రులుగా బీజేపీ తరఫున రామ్ షిండే, విజయ్కుమార్ దేశ్ముఖ్, అంబరీష్ రాజే ఆత్రాం, రంజిత్ పాటిల్, ప్రవీణ్ పోటే, శివసేన తరఫున సంజయ్ రాఠోడ్, దాదాజీ భుసే, విజయ్ శివ్తారే, దీపక్ కేసర్కర్, రవీంద్ర వాయ్కర్ ప్రమాణం చేశారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ, శివసేన మినహా మిత్రపక్షాలైన ఆర్పీఐ, శివ్సంగ్రామ్ పార్టీలకు అవకాశమివ్వలేదు. దీంతో వారు కొంత అసంతృప్తికి గురైనట్లు గుర్తించిన ఫడ్నవిస్.. త్వరలో జరిగే రెండో విడత విస్తరణలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.


