-
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను ఆయన సోమవారం రాత్రి వేర్వేరుగా కలుసుకుని పలు అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందచేశారు. నిధులిచ్చి ఆదుకోండి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. విశాఖ అభివృద్ధికి భోగాపురం కీలకం.. అనంతరం పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను కలుసుకుని విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం చూపుతున్న ప్రత్యేక చొరవను సీఎం జగన్ అభినందించారు. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా (పక్కనే తూర్పు నౌకాదళ కేంద్రం ఉండడం) విశాఖలో విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేనందున భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎంతో కీలకమన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత వ్యవధి మూడేళ్లలో పూర్తి చేసేలా సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జ్యోతిరాదిత్యను కలిసిన సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేడు గడ్కరీ, ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ! ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
Andhra Pradesh: వర్షాలు తగ్గటమే ఆలస్యం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ‘రోడ్ మ్యాప్’తో దూసుకెళ్తుండగా... ప్రతిపక్ష టీడీపీ, జనసేన రాజకీయ ఉనికి కోసం ‘రాంగ్ రూట్’లో ప్రయాణిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్కన ఇప్పటికే రోడ్ల పునరుద్ధరణ, కొత్త రహదారుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టిన తరువాత కూడా ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, శ్రమదానాల పేరుతో తమ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా బురద జల్లేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి బాటలో నిబ్బరంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇక ఇతర అంశాలేవీ లేకపోవడంతో ఆందోళనల పేరుతో ప్రజల్ని మోసగించేందుకు విపక్షాలు దుష్ప్రచారానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభించి వరుసగా పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికలు, అంతకుముందు తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో దిక్కుతోచని విపక్షాలు ‘రోడ్డు’న పడినట్లు వెల్లడవుతోంది. చంద్రబాబు నాయకత్వం పట్ల టీడీపీ శ్రేణులే సందేహంలో పడగా... జనసేనను ఓ రాజకీయ పార్టీగా కూడా ప్రజలు గుర్తించకపోవడంతో ఇలాంటి ఎత్తుగడలకు దారి తీసినట్లు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్నెళ్ల క్రితమే రోడ్ల పునరుద్ధరణ, కొత్త రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించిందని, టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. స్పష్టంగా రోడ్ మ్యాప్ సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించిన సమీక్షలో రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన రోడ్ మ్యాప్ నిర్దేశించారు. వర్షాలు తగ్గగానే వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. నిధుల సేకరణకు కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తగిన ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది వేసవి నాటికి రోడ్ల పునరుద్ధరణతోపాటు కొత్త రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది. విపక్షాలు ఎన్ని డ్రామాలాడినా వచ్చే వేసవి నాటికి రాష్ట్రంలో రోడ్లన్నీ తళతళలాడతాయి. తీరైన రోడ్లపై హాయైన ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా రోడ్లను గాలికి వదిలేసి చివరి రెండేళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా అలక్ష్యం వహించారు. అంతేకాదు.. రోడ్ల కోసం బ్యాంకు నుంచి తెచ్చిన రూ.3 వేల కోట్ల రుణాలను ‘పసుపు–కుంకుమ’ పేరుతో వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. మే నెలలోనే ప్రణాళిక.. జూన్లో టెండర్లు రూ.2,205 కోట్లతో రహదారుల పునరుద్ధరణ, రూ.6,400 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మే నెలలోనే ప్రణాళిక ఖరారు చేయడంతో ప్రభుత్వం జూన్లో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. నిధుల సమీకరణ యత్నాలను విజయవంతంగా పూర్తి చేసి వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభించి వచ్చే వేసవి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇబ్బందులున్నా వెనకడుగు లేదు.. రోడ్లు, సముద్ర మార్గం, ఎయిర్ కనెక్టివిటీలను చుక్కానిగా చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృఢ సంకల్పం. ప్రధానంగా 2014 – 19 వరకు టీడీపీ హయాంలో రోడ్ల నిర్వహణను విస్మరించడం, అధికారంలో ఉన్న చివరి రెండేళ్ల పాటు పూర్తిగా గాలికొదిలేయడంతో పరిస్థితి జఠిలంగా మారిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో రహదారులకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 2020లో కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021 ప్రారంభంలో కూడా కోవిడ్ రెండోవేవ్తో దేశం తీవ్రంగా సతమతమైంది. కోవిడ్ ప్రభావంతో ఆదాయం క్షీణించి రాష్ట్రం నిధులు సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినా రోడ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ వెనుకంజ వేయలేదు. ఆర్నెళ్ల క్రితమే ఈ ఏడాది మే నెలలోనే ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి రోడ్ల పునరుద్ధరణ, కొత్త రహదారుల నిర్మాణంపై ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రోడ్ల పునరుద్ధరణ, రూ.6,400 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణ ప్రణాళికలను ఆమోదించారు. ఈ క్రమంలో ఆర్ అండ్ బీ శాఖ జూన్లోనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టింది. నిధుల సేకరణకు సీఎం ప్రత్యేక చొరవ ప్రణాళిక మాత్రమే కాదు... రోడ్ల నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. కౌంటర్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సమ్మతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.2 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అంగీకరించింది. ఇక మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి కొత్త రహదారుల కోసం రూ.6,400 కోట్ల రుణం అందచేసేలా ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా రోడ్ల నిర్మాణానికే వెచ్చించేందుకు ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ తెరవాలని నిర్ణయించడం గమనార్హం. ఆ ఖాతా నుంచి నేరుగా కాంట్రాక్టు సంస్థలకు బిల్లులు చెల్లిస్తారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరగదని కాంట్రాక్టు సంస్థలకు పూర్తి భరోసా కలుగుతుంది. ఇలా నిధుల సమస్య తీరిపోవడంతో సెప్టెంబర్ 6వతేదీన ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా రహదారుల అంశంపై సీఎం వైఎస్ జగన్ చర్చించారు. వర్షాలు తగ్గగానే వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. 8,212 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బిడ్లు రాష్ట్రంలో గుంతలు పడ్డ రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. మొత్తం 8,212 కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణకు 1,140 పనులను గుర్తించింది. అందుకోసం రూ.2,205 కోట్లతో ప్రణాళికను ఆమోదించి జూన్లోనే టెండర్ల ప్రక్రియ చేపట్టింది. వాటిలో ఇప్పటికే దాదాపు రూ.597.13 కోట్ల విలువైన 322 పనులకు బిడ్లు దాఖలు చేశారు. మిగిలిన రూ.1,607.87 కోట్ల పనులకు బిడ్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నెలరోజుల్లో అన్ని పనులకు టెండర్లు ఖరారు చేసి నవంబరులో పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బి శాఖ భావిస్తోంది. వచ్చే ఏడాది మే నాటికి పనులు పూర్తి చేస్తారు. రూ.6,400 కోట్లతో 2,500 కి.మీ. కొత్త రోడ్లు 2010 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ప్రధానంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రోడ్ల నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ సమస్య పరిష్కరించి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు వసతి కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అందుకోసం ఏకంగా రూ.6,400 కోట్లతో 2,500 కి.మీ. మేర కొత్త రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. మేర రోడ్లు నిర్మిస్తారు. దీనికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో మొత్తం 124 పనులకు టెండర్లు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.85.43 కోట్ల ప్రజాధనాన్ని కూడా ఆదా చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులను వేగవంతం చేస్తారు. ఇక రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,256 కి.మీ. మేర కొత్త రోడ్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) పూర్తి కావచ్చింది. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. డిసెంబరులో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తారు. రూ.3 వేల కోట్ల రుణం.. ‘పసుపు –కుంకుమ’ పాలు టీడీపీ హయాంలో 2018లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. ఫలితంగా చాలా చోట్ల రహదారులు అధ్వాన్నంగా మారాయి. చివరి రెండేళ్ల పాటు రాష్ట్రంలోని రోడ్లను గత సర్కారు పట్టించుకోకపోవడంతో దారుణంగా తయారయ్యాయి. నిర్వహణపై బాబు సర్కారు మొద్దునిద్ర చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు రోడ్ల మరమ్మతుల అంశాన్ని గాలికొదిలేసింది. నిధులు కేటాయింపుల్లో హడావుడి చేసి విడుదల చేసే విషయంలో మాత్రం ముఖం చాటేసింది. ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులు సరిగా చేపట్టకపోవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. రోడ్లన్నీ గుంతలమయంగా మారి వాటిపై ప్రయాణం అంటేనే బెంబేలెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది. -
ఏపీ అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, అమరావతి/సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం విజయవాడ వచ్చిన ఆయన ఓ ప్రైవేటు హాల్లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. నీటి విషయంలో ఏపీకి అన్యాయం జరగనిచ్చేది లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే కేంద్రం జోక్యం చేసుకుంటోందని, ఉభయ రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతోనే నీటి అజమాయిషీ బాధ్యతను మోదీ ప్రభుత్వం తీసుకుందన్నారు. కృష్ణా జలాల సమస్యపై ఇద్దరు సీఎంలు సామరస్యంగా చర్చించుకోవాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను వెలంపల్లి అందించారు. కిషన్రెడ్డి సతీమణికి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ పట్టు వస్త్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీమ్లో దుర్గగుడిని చేర్చాలని కేంద్ర మంత్రికి వెలంపల్లి, వాణీమోహన్లు విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో 126 పర్యాటక కేంద్రాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులున్నారు. ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయ్.. తిరుపతి తుడా/తిరుమల(చిత్తూరు జిల్లా): కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తితో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని కేంద్రం మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితో కలిసి స్విమ్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తిచేసేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. పిల్లలతో సహా 130 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. అనంతరం కపిలతీర్థం సమీపంలోని ప్రకృతి ఉద్యాన వనంలోని అమరజవాన్ స్థూపం వద్ద నివాళి అర్పించారు. అమర సైనికుల సతీమణులకు, యుద్ధంలో పోరాటం చేసిన కెప్టెన్లకు భారత మాజీ సైనికుల సంఘం, వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. -
Andhra Pradesh: సంక్షేమానికి దీటుగా అభివృద్ధి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారనడానికి జీడీపీ గణాంకాలే నిదర్శనమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. 2020–21లో దేశ జీడీపీ (ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా) 2.97 శాతం క్షీణిస్తే మన రాష్ట్రంలో 1.58 శాతం వృద్ధి నమోదైందని గుర్తు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా మంగళవారం ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడారు. నవరత్నాల పథకాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటమే కాకుండా పాజిటివ్ వృద్ధి రేటు నమోదు చేసిందని చెప్పారు. 24 నెలల కాలంలో 18 నెలలుగా కోవిడ్తో పోరాడుతున్నప్పటికీ పెట్టుబడుల ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చడంలో తెలంగాణ, తమిళనాడు కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాలే దీనికి నిదర్శనమని, 2019 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రాజెక్టులు వాస్తవ రూపంలోకి వచ్చాయని వివరించారు. 2019లో రూ.34,696 కోట్లు, 2020లో రూ.9,840 కోట్లు, 2021(జనవరి, ఫిబ్రవరి)లో రూ.1,039 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని మేకపాటి తెలిపారు. చేతల ప్రభుత్వం.. గత సర్కారు మాదిరిగా ఒప్పందాలు అంటూ హడావుడి, ప్రచారాలు లేకుండా నేరుగా పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. గోల్డ్ ప్లస్ గ్లాస్ సెంచూరీ ఫ్లై, నీల్ కమల్ లాంటి ఫరి్నచర్ కంపెనీలు, జపాన్కు చెందిన భారీ టైర్ల తయారీ సంస్థ ఏటీజీ ఇలా పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని, వీటి ద్వారా 1,30,565 మందికి ఉపాధి లభించిందన్నారు. ఇందులో 65 భారీ, మెగా ప్రాజెక్టులు కాగా 13,885 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. రూ.1,32,784 కోట్ల విలువైన 67 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, వీటి ద్వారా 1,56,616 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇవికాకుండా రూ.1,43,906 కోట్ల విలువైన 67 ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపారు. ఇవి కార్యరూపం దాల్చడం ద్వారా 1,56,169 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. దేశ వాణిజ్య ఎగుమతుల్లో 16.8 బిలియన్ డాలర్లతో రాష్ట్రం 5.8 శాతం వాటాను కలిగి ఉందని, దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చడం ద్వారా 33.7 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సానుకూల వాతావరణం సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్లో తక్కువ పెట్టుబడితో, నష్టభయం లేని వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు మేకపాటి తెలిపారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక పార్కులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్టులు, ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నిక్డిక్ట్ నిధులతో కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ, వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఈఎంసీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.7,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.1,110 కోట్లు ఇచ్చామని, ఈ ఏడాది టెక్స్టైల్ రంగానికి చెందిన కంపెనీలకు ఆగస్టులో రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పేరుతో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం, ఐటీ శాఖ కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట
గుంటూరు ఎడ్యుకేషన్: గత పాలకుల కబంధ హస్తాలు, కులాల కుంపట్లతో దిగజారిన ప్రవాస భారతీయుల ప్రతిష్ట పునరుద్ధరణ, ఏపీ అభివృద్ధికి స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణలో ప్రధాన భూమిక పోషించి రాష్ట్రాభివృద్ధిలో సీఎం వైఎస్ జగన్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాషింగ్టన్ డీసీకి చెందిన ఎన్నారై వల్లూరి రమేష్రెడ్డి తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్డులోని అవర్ స్టేట్ అవర్ లీడర్, వైఎస్సార్ ఇంటెలెక్చు్యవల్ ఫో రం సంయుక్త ఆధ్వర్యంలో ‘సుపరిపాలన ప్రస్థానంలో రెండేళ్లు–సవాళ్లు–సాఫల్యాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర’ అంశంపై ఎన్నారైలతో సోమవారం ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. అమెరికా నుంచి వల్లూరి రమేష్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఅభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. వ్యాపార భాగస్వామ్యాలతో ఎన్నారైలు రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఫ్రాన్స్కు చెందిన జి.రాహుల్ సూచించారు. పచ్చ మీడియా పోకడలను తిప్పికొట్టాలి మరో ఎన్నారై బొమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో వైఎస్ జగన్ సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎన్నారైలతో పాటు విదేశీ ప్రతినిధులు సైతం గమనిస్తున్నారని చెప్పారు. అలాగే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతున్న పచ్చ మీడియా పిచ్చిపోకడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా విభాగానికి ఎన్నారైల తోడ్పాటు అవసరమని రామిరెడ్డి చెప్పారు. ఏపీ ఎన్నారై రీజనల్ కో–ఆరి్డనేటర్ కూచిబొట్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ఏపీఎన్ఆర్టీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల కల్పనలో ఎన్నారైలు భాగస్వాములవుతారని హామీ ఇచ్చారు. ఎన్నారైలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి గుంటూరుకు చెందిన వెంకట్ ఇక్కుర్తి మాట్లాడుతూ.. కాల్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు, పరిశోధనలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నారైలు కీలక భూమిక నిర్వర్తించాలని సూచించారు. నాలెడ్జ్, కల్చరల్ ఎక్సే్ఛంజ్ను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో కీలకమైన శాస్త్ర, సాంకేతిక జ్ఞానాన్ని అందించాలన్నారు. సమావేశంలో ఏఎన్యూ ప్రొఫెసర్ మధుబాబు, డాక్టర్ వైఎస్ థామస్రెడ్డి, కాపిరెడ్డి కృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement