breaking news
dengue feaver
-
హైదరాబాద్: విజృంభిస్తున్న డెంగ్యూ.. ఫీవర్ ఆస్పత్రికి రోగుల క్యూ
-
డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి మృతి
సాక్షి, హైదరాబాద్ : డెంగ్యూ జ్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. -
‘డెంగీ’పై ఆందోళన వద్దు
పెదపళ్ల (ఆలమూరు) : డెంగీ, సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందవద్దని డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య పేర్కొన్నారు. పెదపళ్ల పీహెచ్సీని శనివారం ఆయన సందర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ డెంగీలో తొలిదశను డీఎన్ఎస్, రెండో దశను డీహెచ్ఎస్, మూడో దశను డీఎస్ఎస్గా భావిస్తామని చెప్పారు. తొలి రెండు దశలు అంత ప్రమాదకరమైనవి కావని, సమీప వైద్య కేంద్రాల్లో వీటికి చికిత్స చేస్తారని తెలిపారు. డెంగీ వ్యాధి నిర్థారణ అందుబాటులో ఉన్నందున మూడో దశకు చేరే రోగిని గుర్తించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సను చేయించుకోవాలని వివరించారు. జిల్లాలోని సుమారు 125 పీహెచ్సీల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్టు వెల్లడించారు. పీహెచ్సీల్లో సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ టి.రమేష్ కిషోర్, వైద్యాధికారి ఆర్.సుదర్శన్బాబు ఉన్నారు.