breaking news
Defence Food Research Laboratory
-
మసాల దోశ, బిర్యానీ ఏ పాపం చేశాయి?
న్యూఢిల్లీ: మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్యాన్ను నింగిలోకి పంపేందుకు ఇస్రో ఒక బృందాన్ని సిద్ధం చేసింది. ఎనిమిదిమందితో కూడిన ఈ బృందం రష్యాలో శిక్షణ పొందగా వీరిలో నలుగురిని ఎంపిక చేసినట్లు ఇస్రో చైర్మెన్ శివన్ తెలిపారు. అయితే వారి సమాచారాన్ని ఇప్పటిదాకా బయటకు రాలేదు. తాజా ఇస్రో అధికారులు అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకు ఎలాంటి ఫుడ్ ఉండాలో నిర్ణయించారు. వీరికి పూర్తిగా స్వదేశీ ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు. ఆ ఆహార పదార్థాల లిస్టులో ఇడ్లీ, మూంగ్ దాల్, హల్వా, వెజ్ పులావ్, ఎగ్ రోల్స్ను డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ లాబొరేటరి తయారు చేసింది. దీంతో పాటు ఫుడ్ హీటర్స్ను వ్యోమగాములకు అందుబాటులో ఉంచనున్నారు. అంతరిక్షంలో తేలియాడే వ్యోమగాముల కోసం తాగేందుకు ప్రత్యేకమైన కంటెయినర్లు తయారు చేశారు. వాటర్, జ్యూస్లను తీసుకువెళ్లేందుకు స్పెషల్ ప్యాకెట్లను డీఆర్డీవో తయారు చేసింది. వచ్చే ఏడాది చివర్లో లేదా 2022లో గగన్ యాన్ ప్రాజెక్ట్ ను చేపట్టడానికి ఇస్రో రెడీ అవుతుంది. అయితే ఈ ఫుడ్ మెనూపై సోషల్ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. కొందరు నెటిజన్లు ఫన్నీగా అన్నీ ఉన్నాయి.. మరి 'మసాల దోశ, బిర్యానీ ఏ పాపం చేశాయి?' వాటిని మెనూలో ఎందుకు చేర్చలేదు' అని ఓ నెటిజన్ ఇస్రోకి ట్వీట్ చేశాడు. 'రసగుల లేదా.. ఇది చాలా చీప్ మెనూ' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 'పోహా కహా హై' అని మరో నెటిజన్ అడిగాడు. 'నో సాబుదాన వడా ఫర్ ఫాస్టింగ్ ఆస్ట్రోనాట్స్' అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా నెటిజన్లు రకరకాలుగా సరదా కామెంట్స్తో ఇస్రోని ప్రశ్నిస్తున్నారు. Why not Masala dosa and Biriyani ? https://t.co/AL2eXzi1SD — Naveenkumar (@NaveenTwtz1) January 7, 2020 No Sabudana wada for fasting astronauts? https://t.co/wbYSLGcYSP — मोर (@13MMGM) January 7, 2020 -
వాయుసేన పైలెట్లకు ద్రవాహారం!
సాక్షి, బెంగళూరు: అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాల పైలట్లు ఎక్కువసేపు ఆకాశంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు వారిని నిర్జలీకరణం (డీహైడ్రేషన్ ) తదితర సమస్యలు వేధిస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు వారికి ద్రవరూపంలో ఉండే ఆహారాన్ని ఇవ్వడానికి మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(డీఎఫ్ఆర్ఎల్) కృషి చేస్తోంది. ఇప్పటికే ద్రవరూప ఆహారాన్ని తయారు చేసిన సంస్థ.. దాన్ని పరీక్షిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఆహారం భారత వాయుసేనకు చెందిన విమానాల కాక్పీట్లలో చేరే అవకాశం ఉంది. డీఎఫ్ఆర్ఎల్ ప్రయోగాత్మకంగా తయారు చేసిన ద్రవరూప ఆహార పదార్థాలను బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా–17లో ప్రదర్శనకు ఉంచారు. ద్రవరూప ఆహారం తీసుకున్న వారికి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆకలి వేయదు. మూత్రం కూడా ఉత్పత్తి కాదు. ఈ పద్ధతిలో చపాతి, చిప్స్, వెజ్ పలావ్, దాల్ కిచిడీల వంటి 110 రకాల ఆహార పదార్థాలను ద్రవ రూపంలోకి మార్చి పైలట్లకు అందజేస్తారు. ద్రవరూపంలోకి మార్చి ప్యాకింగ్ చేశాక మూడేళ్ల పాటు ఇవి నిల్వ ఉంటాయి. పరీక్షలు తుదిదశలో ఉన్నందున సానుకూల ఫలితాలొచ్చాక, సాంకేతికతను కోరుతున్న 400 కంపెనీలకు అందించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. విపత్తుల సమయంలో సైనికులు తీసుకెళ్లే లగేజీ బరువును తగ్గించడంలో భాగంగా తినగలిగిన చెంచాలు, గరిటెలు, పళ్లేలను డీఎఫ్ఆర్ఎల్ తయారు చేసింది. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి వీటిని రూపొందించింది. ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన రక్షణ మంత్రి పరీకర్ వైమానిక రంగ నిపుణులకు ఈ తినే ప్లేట్లలోనే ఆహారాన్ని వడ్డించారు.