-
యూత్ను ఆకట్టుకునేలా జావా బైక్స్
చెకోస్లోవేకియా బైక్ బ్రాండ్ జావా మళ్లీ భారతమార్కెట్లలో హల్చల్ చేయనుంది. నవంబరు 15న ఈ జావా మోటార్సైకిళ్లు భారతీయ యూత్ను ఆకట్టుకునేందుగా సరికొత్తగా ముస్తాబై దూసుకురానున్నాయి. ఈ సందర్భంగా అప్కమింగ్ బైక్ డెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సీసీ బైక్కు పోటీగా జావా 300 బైక్ను కంపెనీ లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 293 సీసీ సింగిల్ సిలిండర్, 27బీహెచ్పీ, గరిష్టంగా 28ఎన్ఎం టార్క్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 18 అంగుళాల ఎంఆర్ఆఫ్ టైర్లు, డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్తో రానుంది. అయితే ఏబీఎస్ (ఆటోమేటిక్ బ్రేకి సిస్టం) ను అమర్చిందీ లేనిదీ స్పష్టతలేదు. ఇక ధర విషయానికి వస్తే రూ.1.5 - రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూం) ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా1929లో తయారైన ఈ జావా మోటారు సైకిల్కు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ అతా ఇంతా కాదు. రాయల్ ఎన్ఫీల్డ్కు సమానంగా క్రేజ్ను సంపాదించుకుంది. అయితే 1990ల తర్వాత మార్కెట్లో కనుమరుగైనా బైక్ లవర్స్ గుండెల్లో మాత్రం పదిలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మహీంద్ర గ్రూపు ఈ ఐకానిక్ జావా బ్రాండ్ను తిరిగి లాంచ్ చేస్తోంది. -
తప్పుడు ప్రకటనలకు ఇక చెక్
విజయనగరం మున్సిపాలిటీ : గట్టిగా గాలి వీచినా.. జోరు వర్షం కురిసి నా... ఎండలు మండినా.. వానలు కురవడం ఆలస్యమైనా.. విద్యుత్ సరఫరాలో కోతలే.. కోత లు. ఇదేమని అడిగితే అవసరానికి తగ్గ విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు.. గట్టిగా అడిగితే మాకేం తెలియదు కోతలన్నీ పై నుంచే... ఇదీ విద్యుత్ యంత్రాంగం నుంచి ఎదరవుతున్న సమాధానం. ఇక ఇటువంటి సమాధానాలకు చెక్ పడనుంది. అక్టోబర్ 2 నుంచి గృహ, పారిశ్రామిక రంగానికి వారి అవసరాల కోసం 24 గంటల విద్యుత్, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా అంది స్తామని సర్కారు ప్రకటించిం ది. ఇందుకు వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇకపై విద్యుత్ కోతలపై మాకేం తెలియదన్న సమాధానానికి చెల్లు చీటి పడనుంది. సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా శాఖపై నెట్టేసే పరిస్థితికి తెరపడనుంది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో విద్యుత్ సర్వీసులు 5లక్షల 70వేల వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటికి అక్టోబర్ 2 నుంచి 24 గంటల విద్యుత్ అందించాలన్నది సర్కా రు లక్ష్యం. జిల్లాలోని సుమారు 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల పాటు సరఫరా అం దించాలన్నది ఉద్దేశం. ఈ హమీ సమర్థ అమలుకు సంబంధించి న కసరత్తు చురుగ్గా సాగుతోంది. తప్పుడు వివరాల నమోదు ఇక చెల్లదు.. ఇది వరకు సాంకేతిక లోపా లు, మరమ్మత్తుల పేరిట ఎడాపెడా కోతలు విధించే వారు. ఉన్నతాధికారుల కు వివరణ ఇచ్చుకోవాలన్న నెపంతో వీటిలో కొన్నిం టిని మాత్రమే ఉప కేంద్రం వద్దనున్న రిజిస్టర్లో నమోదు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. సిబ్బంది సేవల్లో లోపాల వల్ల విద్యుత్ సరఫరా నిలిపితే అందుకు గల కారణం కచ్చితంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉప కేంద్రాల్లో ప్రత్యేక మీటర్లతో పాటు సిమ్ కార్డులున్న మోడెంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయటం ద్వారా ఎంత సమయం సరఫరా ఉంది. ఎంత సమయం సరఫరా నిలిచిపోయిందన్న సమాచారం ఉపకేంద్రాల వారీగా కంప్యూటర్ ముందు కూర్చుంటే తెలిసిపోతుంది. కార్పొరేషన్ కార్యాల యంలో ఉన్న సర్వర్కు మోడెం కనె క్ట్ కావడం ద్వారా రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ అనుసంధానమై ఉంటుంది. విద్యుత్ సరఫరా ఉన్న సమయం పచ్చగా, విద్యుత్ లేని సమయం ఎర్రటి చారతో నిమిషాలు, సెక్షన్ ల తో సహా కంప్యూటర్లో చూపుతుంది. కింద స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు, ముఖ్యమంత్రి కూడా ఆన్లైన్లో గ్రామంలో విద్యుత్ సరఫరా 24 గంటలు ఇచ్చారా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు. జిల్లాలో 83 సబ్స్టేషన్ల పరిధిలో... ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 83 సబ్స్టేషన్లు ఉండగా.. అందులో 299 ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గృహావసర విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందులో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 54 ఫీడర్లు ఉండగా వాటి ద్వారా వినియోగదారులకు అందించే సేవలను ఇప్పటికే ఆన్లైన్కు అనుసంధానం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరో 245 ఫీడర్లకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్నారు. దాదాపు అన్ని ఫీడర్లకు ఈ ప్రక్రియను పూర్తి చేయగా.. చిన్నపాటి లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నారు. లోపాలను అధిగమించడమే ధ్యేయం గృహ, వ్యవసాయ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా విద్యుత్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి రెండు సర్వీసులకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విద్యుత్ లోపాలు అధిగమించే క్రమంలో మోడెం విధానం అమలు చేస్తున్నాం. జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశాం. పలు ప్రాంతాల్లో చిన్నపాటి సాంకేతిక ఆటంకాలు ఉన్నాయి వాటిని కూడా సరి చేస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే అంతా పారదర్శకంగా సాగుతోంది. - సి.శ్రీనివాసమూర్తి, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement