breaking news
cutdown
-
300 ఏళ్ల నాటి మహావృక్షం..హఠాత్తుగా..
కొన్ని వృక్షాలకు ఎంతో చరిత్ర, నేపథ్యం జ్ఞాపకాలు ముడివేసి ఉంటాయి. అవి కొన్ని గాథాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయి. అలాంటివి కనుమరుగైతే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అంతా నేపథ్యం కలిగిన వాటిని మనం ఏవిధంగానూ రీ క్రియేట్ చేయలేం. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెట్టు హఠాత్తుగా కనుమరుగైపోయింది. యూకేలోని నార్తంబర్ ల్యాండ్లో ఈ ప్రసిద్ధ చెట్టు ఉంది. ఏమైందో ఏమో సెప్టెంబర్ 28న తెల్లవారుజామున ఎవరో నరికేశారు. ఏం బుద్ది పుట్టి ఇలా చేశారో గానీ ఒక్కసారిగా ఈ విషయం యూకే అంతటా దావానంలా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న యూకే అధికారులు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దర్వాప్తులో 60 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉందని తేలడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫోరెన్సిక్ అధికారులు ఆ చెట్టు అవశేషాలు, కొలతలు, నమునాలు తీసుకున్నారు. ఆ విచారణలో ఈ చెట్టు 300 ఏళ్ల నాటిదని తేలింది. ప్రకృతిలో చాలా సహజంగా పెరిగిందని చెబుతున్నారు అధికారులు. హాలివుడ్లో కెవిన్ కాస్ట్నర్, ప్రిన్స్ ఆప్ థీవ్స్ నటించిన 1991నాటి ప్రముఖ చిత్రం రాబిన్ హుడ్లో ఈ చెట్టు అందర్నీ ఆకర్షించింది. ఈ చెట్టు ఎంతోమంది కళాకారులకు, రచయితలకు, ఫోటోగ్రాఫర్లకు గొప్ప ప్రేరణ ఇచ్చిన మొక్కగా పేరుగాంచింది. ఈ చెట్టుతో చాలామందికి ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మేరకు వుడ్ల్యాండ్ ట్రస్ట్లోని ఎస్టేట్ మేనేజర్ మార్క్ ఫెదర్ మాట్లాడుతూ..మిగిలిన కాండం నుంచి ఒక చిన్న చెట్టుగా అభివృద్ధి చెందడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అంటే.. మనం కోల్పోయిన చెట్టులా అవ్వడానికి దాదాపు 150 నుంచి 200 ఏళ్లు పడుతుంది. ఈ చెట్టుని సైకామోర్ గ్యాప్ ట్రీ లేదా రాబిన్ హుడ్ ట్రీగా పిలుస్తారు. ఇది ఇంగ్లండ్లోని నార్తంబర్ల్యాండ్లోని క్రాగ్ లాఫ్ సమీపంలో హాడ్రియన్ వద్ద ఉంది. అంతేగాదు ఈ చెట్టు 2016 ఇంగ్లండ్ ట్రీ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇది యూకే ఐకానిక్ చెట్టుగా కూడా ప్రసిద్ది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్అంబానీ కూతురు మాత్రం కాదు!) -
‘వరి’ తగ్గించుకోవడమే మేలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో గజ్వేల్ ఏడీఏ శ్రావణ్కుమార్ గజ్వేల్: గజ్వేల్ వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, కొండపాక మండలాల్లో ఖరీఫ్ ఆశాజనకంగా ఉందని ఏడీఏ శ్రావణ్కుమార్ చెబుతున్నారు. ఆరుతడి పంటలకు ఇక ఢోకా లేదని తెలిపారు. భారీ వర్షాల్లేని కారణంగా చెరువులు, కుంటలు ఇతర జలాశయాల్లో నీరు చేరకపోవడం వల్ల భూగర్భజలమట్టం పెరిగే పరిస్థితి లేదని ఈ నేపథ్యంలో...బోరుబావుల సేద్యం కొంత ఇబ్బంది మారిందంటున్నారు. ‘వరి’ సాగును తగ్గించుకోవాలని సలహా ఇస్తున్నారు. తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గజ్వేల్ ఏడీఏను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు మీ కోసం... సాక్షి: గజ్వేల్ సబ్డివిజన్లో ఈసారి ఎన్ని హెక్టార్ల సాగు వస్తుందని భావించారు...? ఎంత సాగైంది..? ఏడీఏ: సబ్డివిజన్ పరిధిలోని గజ్వేల్ మండలంలో 12392 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 11285 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. కొండపాక మండలంలో 10368 హెక్టార్లకు 7506, తూప్రాన్ మండలంలో 6500 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 5676 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. సాక్షి: మొక్కజొన్న, పత్తి పంటల సాగు విస్తీర్ణం ఎంత...? ఏడీఏ: గజ్వేల్ మండలంలో మొక్కజొన్న 6744, పత్తి 3130 హెక్టార్లు, కొండపాక మండలంలో మొక్కజొన్న 3380, పత్తి 1941 హెక్టార్లు, తూప్రాన్లో మొక్కజొన్న 1770, పత్తి 30 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. సాక్షి: వర్షపాతం నమోదు వివరాలు తెల్పండి..? ఏడీఏ: జూన్ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. జూలై మాత్రం తక్కువగా ఉంది. అయినా పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మూడు మండలాల్లో పంటలు బాగానే వున్నాయి. సాక్షి: జూలై 15తో విత్తనాలు వేసే గడువు ముగిసిందని మీరంటున్నారు. ఇప్పటివరకు విత్తనాల వేయని వారి పరిస్థితి...? ఏడీఏ: ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు ఆగస్టు 15వరకు కంది, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు వేసుకోవచ్చు. సాక్షి: వరి సాగు పరిస్థితి...? ఏడీఏ: సబ్డివిజన్లో ఇప్పటివరకు వరి నాట్లు పెద్దగా ఊపందుకోలేదు. సబ్డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 900 హెక్టార్లకు సాగు మించలేదు. చాలా చోట్ల నారుమడి దశలో ఉన్నాయి. అక్కడక్కడా బోరుబావుల సాయంతో నాట్లు వేస్తున్నారు. భారీ వర్షాలు కురవడంలేదు, వరి నాట్లకు దూరంగా ఉండటమే మంచిది. సాక్షి: పంటల బీమా పరిస్థితి ఏమిటి...? ఏడీఏ: ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రైతుల రుణమాఫీ పథకంతోనే వర్తిస్తుంది.