-
ఎస్బీఐ పరిస్థితి భేష్
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ నాణ్యత బాగుందని చైర్మన్ దినేశ్ ఖారా గురువారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో అంచనాలకు మించి జరుగుతున్న రికవరీ– బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ లో ప్రతికూలతలను పరిమిత స్థాయిలోనే కట్టడి చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అయితే కోవిడ్–19కు సంబంధించి రుణ పునర్ వ్యవస్థీకరణ సంబంధ అంశాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించలేదు. త్వరలో ప్రకటించనున్న బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలే దీనికి కారణమని పేర్కొన్నారు. భారత్ బ్యాంకింగ్పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని, ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్పై ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం– 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుందని తెలిపింది. తీవ్ర స్థాయిల్లో పీఎస్బీల ఎన్పీఏలు 17.6 శాతం పెరిగే అవకాశమూ లేకపోలేదని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంక్ రుణ నాణ్యతపై ఖరా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూస్తే... ► ఎకానమీకి సంబంధించి ఏప్రిల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో అన్ని రంగాల్లో రికవరీ ప్రక్రియ ఊపందుకుంది. ► ఒక దశలో దేశ ఆర్థిక రంగానికి సంబంధించి కీలక విభాగాలు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కార్పొరేట్లకు నగదు లభ్యతపై సైతం ఆందోళన నెలకొంది. ఇప్పుడు పరిస్థితులు వేగంగా కుదుటపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ఇందుకు కారణం. ► కోవిడ్–19 రోగులకు ఉత్తమ చికిత్స, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం వంటి అంశాలు ఆర్థిక రికవరీని వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతున్నాయి. ► ప్రస్తుత కీలక తరుణంలో బ్యాంకులు రుణ గ్రహీతకు అవసరమైన సలహాలను అందించాలి. ► బడ్జెట్ అంచనాలపై ఇప్పుడే చేసే వ్యాఖ్య ఏదీ లేదు. ప్రభుత్వంతో జరిగిన సమావేశాల్లో మా అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. 600 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ లిస్టింగ్ అంతక్రితం ఇండియా ఐఎన్ఎక్స్ గ్లోబల్ సెక్యూరిటీస్ మార్కెట్ (జీఎస్ఎం) ప్లాట్ఫామ్పై ఎస్బీఐ 600 మిలియన్ డాలర్ల ఫారిన్ కరెన్సీ బాండ్ ఇష్యూ లిస్టింగ్ కార్యక్రమంలో ఖరా పాల్గొన్నారు. తన 10 బిలియన్ డాలర్ల గ్లోబల్ మీడియం టర్మ్ నిధుల సమీకరణ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ లండన్ బ్రాంచ్ తాజా ఇష్యూ లిస్ట్ చేసింది. బాండ్ కూపన్ రేటు 1.80 శాతం. 2008 తర్వాత ఇంత తక్కువ కూపన్ రేటు ఇదే తొలిసారి. ఇండియా ఐఎన్ఎక్స్పై భారీగా ఫారిన్ కరెన్సీ ఇష్యూ చేస్తున్న జాబితాలో ఎస్బీఐ ఒకటి. తాజా లిస్టింగ్తో కలిపి దాదాపు 2.6 బిలియన్ డాలర్ల బాండ్లను బ్యాంక్ ఇప్పటికి లిస్ట్ చేసింది. తద్వారా నిధుల సమీకరణ బ్యాంకుకే కాకుండా, భారత్ ఆర్థిక వ్యవస్థలోనూ విశ్వాసాన్ని నింపుతుందని గురువారం కార్యక్రమం సందర్భంగా ఖరా అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఎస్బీఐ చాటి చెబుతోందని పేర్కొన్నారు. -
రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యం
ముంబై: రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రత, కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్ తొలి ప్రాధాన్యతలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన దినేష్ కుమార్ మూడేళ్ల కాలానికి చైర్మన్గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కోవిడ్–19 నేపథ్యంలో పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే ఆర్బీఐ నిర్దేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కంపెనీలకు తగిన మద్దతు అందించడానికి బ్యాంక్ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. ► రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. అయితే ఇక్కడ రుణ పునర్వ్యవస్థీకరణను కోరుతున్న కస్టమర్ల సంఖ్యను చూస్తే, బ్యాంక్ నిర్వహించదగిన స్థాయిలోనే ఈ పరిమాణం ఉంది. ► మూలధనం విషయంలో బ్యాంక్ పరిస్థితి పటిష్టంగా కొనసాగుతోంది. ► ఎస్బీఐ డిజిటల్ సేవల వేదిక అయిన ‘యోనో’ను ప్రత్యేక సబ్సిడరీ (పూర్తి అనుబంధ సంస్థ)గా వేరు చేయాలన్న అంశంపై పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. తగిన సమయంలో ఆయా అంశలను వెల్లడిస్తాం. -
‘డర్టీ డజన్’పై చర్యలు... బ్యాంకింగ్కు మంచిదే
♦ రుణ నాణ్యత మెరుగుపడుతుంది... ♦ మూడీస్ విశ్లేషణ న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో రుణ ఎగవేతలకు పాల్పడిన 12 కంపెనీలపై దివాలా కోడ్ కింద చర్యలు చేపట్టడం బ్యాంకింగ్కు క్రెడిట్ పాజిటివ్ అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సోమవారం పేర్కొంది. దీనివల్ల బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుపడుతుందనీ విశ్లేషించింది. మొత్తం బ్యాంకింగ్ మొండిబకాయిల్లో (ఎన్పీఏ) ఈ 12 కంపెనీల వాటా దాదాపు 25 శాతం. ఈ అకౌంట్లకు సంబంధించి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ను ప్రారంభించడానికి ఆర్బీఐ గత వారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఈ కేసుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 డిఫాల్టర్స్ ఎవరనేది అధికారికంగా పేర్లు వెల్లడించనప్పటికీ, వీటిలో ఎస్సాస్ స్టీల్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్యార్డ్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, జేపీ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, మోనెత్ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్ఫ్రా ఉన్నట్టు సమాచారం. 12 డిఫాల్టర్లపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్బీఐ జాబితాను పంపింది. తాజా పరిణామాలు బ్యాంకింగ్ రుణ నాణ్యతకు దారితీయడమే కాకుండా, చిన్న మొండిబకాయిల సమ స్య పరిష్కారానికి కూడా వీలుకల్పిస్తాయని మూడీస్ వివరించారు. లాభదాయకతపై ఎఫెక్ట్... మొండిబకాయిలకు సంబంధించి అధిక నిధులు కేటాయించాల్సి న పరిస్థితి (ప్రొవిజనింగ్స్) ఉత్పన్నమయితే మాత్రం ఇది వచ్చే ఏడాదిలో బ్యాంకుల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ అంచనా వేసింది. అంతేకాకుండా బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మరింత తాజా మూలధనం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.95,000 కోట్ల తాజా మూలధనం అవసరమవుతుందని మూడీస్ అభిప్రాయపడింది. ఈ పరిమాణం ప్రభుత్వం కేటాయించిన రూ.20,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇంద్రధనస్సు ప్రణాళిక కింద 2015 నుంచీ నాలుగేళ్లలో బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల రుణ నాణ్యత గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోందని పేర్కొన్న మూడీస్, అయితే ఇటీవల త్రైమాసికాల్లో ఈ క్షీణత స్పీడ్ కొంత తగ్గిందని వివరించింది. 2016–17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు రూ. 1 లక్ష కోట్ల పైగా పెరిగి రూ. 6.06 లక్షల కోట్లకు ఎగిశాయి. ‘డర్టీ డజన్’ షేర్లు డౌన్ న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ప్రారంభించడానికి ఆర్బీఐ రూపొందించిన జాబితాలో వున్నాయని భావిస్తున్న 12 కంపెనీల్లో కొన్ని షేర్లు సోమవారం 20 శాతం వరకూ క్రాష్ అయ్యాయి. పతనమైన షేర్లలో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ల్యాంకో ఇన్ఫ్రా, మోన్నెట్ ఇస్పాత్, ఆలోక్ ఇండస్ట్రీస్ వున్నాయి. ఆమ్టెక్ ఆటో 19.97 శాతం క్షీణించి రూ. 23.45 వద్ద ముగియగా, ల్యాంకో ఇన్ఫ్రా 20 శాతం పతనమై రూ. 1.90 వద్ద క్లోజయ్యింది. భూషణ్ స్టీల్ 16 శాతం తగ్గుదలతో రూ. 59 వద్ద ముగిసింది. మోన్నెట్ ఇస్పాత్ 12.37 శాతం క్షీణతతో రూ. 30.10 వద్ద, అలోక్ ఇండస్ట్రీస్ 11.61 శాతం తగ్గుదలతో 2.36 వద్ద ముగిసాయి. ఈ జాబితాలో పేరుందని భావిస్తున్న మరో కంపెనీ ఎలక్ట్రోస్టీల్ 4.94 శాతం నష్టపోయింది. ఎన్పీఏల ప్రగతిపై పీఎంఓ సమీక్ష న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్పీఏ)ల సమస్యపై ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. భారీ రుణ ఎగవేతదారులపై ఆర్బీఐ చర్యలకు దిగిన నేపథ్యంలో వీటికి సంబంధించిన ప్రగతిపై తాజా భేటీ జరగడం గమనార్హం. ప్రధాన మంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమీక్ష నిర్వహించారని.... పెరిగిపోతున్న ఎన్పీఏలకు కళ్లెం వేసేందుకు పలు రకాల చర్యలపై ఈ సందర్భంగా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్, తదితర వ్యవస్థల సన్నద్ధతపైనా చర్చ జరిగినట్టు పేర్కొన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరగా, అందులో రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులవే ఉన్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఎగవేసిన 12 సంస్థలపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ అంతర్గత సలహా కమిటీ గత వారం బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే. ఐబీబీఐ ముందుకు ఇంకా రాలేదు... ఆర్బీఐ గుర్తించిన 12 కేసులు తమ ముందుకు రావాల్సి ఉందని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ తెలిపారు. బ్యాంకులు ముందుగా ఎన్సీఎల్టీ వద్ద కేసులు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఐబీసీని అమలు చేసే సంస్థే ఐబీబీఐ. ఎన్సీఎల్టీ మరిన్ని కేసులను డీల్ చేసేవిధంగా సామర్థ్యాన్ని పెంచాలని సాహూ అభిప్రాయపడ్డారు. 12 కేసుల్లో విచారణ కౌంటర్ సివిల్ వ్యాజ్యాల కారణంగా ఆలస్యమవుతుందని తాను భావించడం లేదన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement