breaking news
Conservation Committee
-
సారూ.. మా నోట్లో మట్టి కొట్టొద్దు!
సాక్షి, రావికమతం(చోడవరం) : అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ప్రకృతి సహకరించక పంటంతా నాశనం అయిపోయింది. ఆదుకుంటుందని ఆశలు పెట్టుకున్న గత ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులిచ్చి మా నోట మట్టి కొట్టిందని కళ్యాణపులోవ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ అనుమతులు తక్షణమే వెనక్కు తీసుకోవాలంటూ కళ్యాణపులోవ రిజర్వాయర్ల పరిరక్షణ కమిటీ ఆందోళనలు, పత్రికల్లో వస్తున్న కథనాలతో పాటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని శాఖల అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో జెడ్.కొత్తపట్నంలో గురువారం జరిగిన సభకు ఇరిగేషన్ ఎస్ఈ సూర్యకుమార్, మైన్స్ ఏడీలు ప్రసాద్, వెంకట్రావు, నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, అటవీశాఖ అధికారి శివప్రసాద్, పంచాయతీ అధికారి రమణయ్యల సమక్షంలో రైతుల అభిప్రాయాలు సేకరించారు. రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చని భరోసా ఇవ్వడంతో గుండెల్లో ఆవేదనను ఇలా ఒక్కొక్కరిగా సభ ముందుంచారు. 5 వేల ఎకరాల్లో పంటలు నాశనం కళ్యాణపులోవ ప్రాంతంలో మైనింగ్ క్వారీ లారీలు భారీలోడ్లుతో నడవటం వల్ల ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా గుంతలు పడ్డాయి. రోడ్డు బాగాలేక 108 రాలేని పరిస్థితి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 50 ఏళ్లలో రిజర్వాయర్ ఎండిపోయి 5 వేల ఎకరాల్లో పంటలు పండడం లేదు. కల్యాణపులోవ రిజర్వాయర్లో ఏటా రూ.25 లక్షల చేప పిల్లలు వేసి ఆ మత్స్య సంపద ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. ఈ ఏడాది నారుపోతలు వద్దంటూ అధకారులు చాటింపులు వేస్తున్నారు. పంట లేకుంటే మేమెలా బతకాలి. టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని మా బతుకులు రోడ్డునపడ్డాయంటూ రైతులు, మత్స్యకారులు కన్నీరు కార్చారు. కల్యాణపులోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతం సామాలమ్మ కొండపై పలు గ్రానైట్ కంపెనీలు విచ్చలవిడి మైనింగ్, పేలుళ్ల కారణంగా ఊట గెడ్డలు కనుమరుగైపోయాయి. రిజర్వాయర్ మనుగడకే ముప్పు మహారాష్ట్రలో ఇటీవలే ఒక రిజర్వాయర్ కట్ట తెగి పోయి మూడు ఊళ్లు కొట్టుకుపోయాయి. అధికారులు తేరుకోకపోతే ఇక్కడా అలాంటి ముప్పు రావచ్చు. -
సీమకు తరతరాలుగా అన్యాయం: బెరైడ్డి
న్యూఢిల్లీ: తరతరాలుగా త్యాగాలు చేస్తున్న సీమ ప్రజలకు చివరకు అన్యాయమే జరుగుతోందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన జలసాధన దీక్షలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాల కళ్లు తెరిపించేందుకు ఈ దీక్ష చేపడుతున్నట్టు వివరించారు. ‘కృష్ణా పెన్నా ప్రాజెక్టు కట్టుకోలేకపోయాం. దాని స్థానంలో నాగార్జునసాగర్ కట్టుకున్నారు. లక్షల ఎకరాలకు నీరందించే సర్ మెకన్జీ పథకాన్ని తుంగలో తొక్కారు. ఎగువన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పైన నీళ్లున్నా సీమకు కరువే మిగులుతోంది. రాజధాని , నీళ్ల విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పొద్దున లేచిన నుంచి అమరావతి, మెట్రో రైలు, కృష్ణా డెల్టా తప్ప ఇంకొకటి కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు తప్ప సీమకు నీళ్లివ్వడం లేదన్నారు. -
ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. సెంటు భూమీ ఇవ్వం
వైఎస్సార్సీపీ ఏపీ రైతు పరిరక్షణ కమిటీ ముందు రైతుల స్పష్టీకరణ సాక్షి, గుంటూరు: ‘‘ఎకరానికి రూ. లక్ష చందా మేమే ఇస్తాం. ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో రాజధానిని కట్టుకోండి. ఇక్కడి భూములు సర్కారు తీసుకుంటే కౌలు రైతులు, కూలీల భవిష్యత్తు ఏమిటి? రెండు నెలలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రజలకు బీపీ డౌన్ అవుతుంది’’ అంటూ గుంటూరు జిల్లా నిడమర్రు, కురగల్లు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల మనోగతం తెలుసుకునేందుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కన్వీనర్గా ఉన్న వైఎస్సార్సీపీ రైతు పరిరక్షణ కమిటీ గురువారం గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో పర్యటించింది.