breaking news
commoner
-
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హాట్ ప్రిన్స్ పెళ్లి, పిక్స్ వైరల్
ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన బ్రూనై యువరాజు ఒక ఇంటివాడయ్యారు. బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాల్ని వివాహ మాడటం ఆసక్తికరంగా మారింది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. 1788 గదులున్న ప్యాలెస్లో సోమవారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. 32 ఏళ్ల బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వివాహానికి సంబంధించిన నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి సాధారణ అమ్మాయి అనీషా అడుగుపెట్టబోతోంది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు.ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం. ప్రిన్స్ మతీన్, హాలీవుడ్గా హీరోకి మంచి తన ఫ్యాషన్ స్టయిల్ను చాటుకుంటూ ఉంటాడు. ఫైటర్ జెట్స్,, స్పీడ్ బోట్లను నడుపుతూ వర్కౌట్లు బేరీ బాడీ ఫోజులతో చాలా పాపులర్. ఖరీదైన క్రీడ పోలో, బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మతీన్ మిలిటరీ యూనిఫాంలో పోజులను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. -
యువరాణి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
టోక్యో: జపాన్ యువరాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోబోతోంది. తన ప్రేమ కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో ఎట్టకేలకు తన ప్రియుడిని మనువాడేందుకు సిద్ధమైంది. మాజీ కాలేజీ క్లాస్మేట్ను అక్టోబర్ 26 న వివాహం చేసుకోనుంది. పలు విమర్శలు, నిశిత పరిశీలన తర్వాత జపాన్ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతోందని, దాన్నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందని కూడా ప్రకటించింది. సంప్రదాయ వివాహం అనంతరం ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెడుతుందనీ, సాధారణ రాజ వివాహానికి సంబంధించిన వేడుకలేవీ జరగవని స్పష్టం చేసింది. జపనీస్ రాయల్ వెడ్డింగ్తో పాటు జరిగే అన్ని ఆచారాలకు విరుద్ధంగా ఈ వివాహం ఉంటుందని తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు, నరుహిటో మేనకోడలైన మాకో, కౌమురో ఎంగేజ్మెంట్ 2017లోనే జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా 2018లో జరగాల్సిన వీరి పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. వీరి ప్రేమ వార్త జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకుదారి తీసింది. ఈ జంట తమ వివాహాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసుకుంటారని యువరాణి 110 మిలియన్ జపనీస్ యెన్స్ లేదా 1.4 మిలియన్ డాలర్లను వదులుకుందని అధికారిక ప్రకటన తెలిపినట్టు స్థానికమీడియా నివేదించింది. యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి రాయల్టీ కింద కొంత సొమ్మును ముట్టజెబుతారు. కానీ ప్రిన్సెస్ మాకో 1.4 మిలియన్ డాలర్లను రిజెక్ట్ చేసి మరీ పెళ్లి సిద్ధంగావడం విశేషంగా నిలిచింది. అలాగే కౌమురోతో పెళ్లి అనంతరం జపాన్ రాజకుటుంబ వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది. కియో కౌమురో పోనీటైల్తో దర్శనమిచ్చి మీడియాను ఆకర్షించాడు. కౌమురో ఈ సంవత్సరం ఫోర్డ్హామ్ లా స్కూల్లో చదువు పూర్తి చేయడంతోపాటు, లా ప్రాక్టీస్ కోసం బార్ ఎగ్జామ్ పూర్తి చేశాడు. తాజా మీడియా నివేదికల ప్రకారం, అతను అమెరికాలో ఒక లా ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ నేపథ్యంలో తన ప్రియుడు కౌమురోను పెళ్లి చేసుకొని అమెరికాకు షిఫ్ట్ కానుంది మాకో. కాగా డైలీ మైనీచి ఇటీవల నిర్వహించిన పోల్లో 38 శాతం మంది వీరి వివాహానికి మద్దతునివ్వగా, 35 శాతం మంది వ్యతిరేకించారు. 26 శాతం తటస్థంగా ఉండిపోయారు. -
నీటి కాపరి!
మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తికి కెంపెగౌడ జీవితం గొప్ప నిలువుటద్దం. గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగించే ఈ సామాన్యుడు.. మూగ జీవాల దాహం తీర్చడానికి తన విశ్వరూపం చూపాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తనంతట తానే కొండపైన చెరువును సృష్టించాడు. ఆ నీటితో జీవాలు దాహం తీర్చుకుంటూ ఉంటే ఆయన కడుపు నిండిపోతోంది. ఆ ఆనందమే అతనితో నలభయ్యేళ్లలో మరో 13 చెరువులు తవ్వించింది. ఒకటి తర్వాత మరొకటిగా 14 గొలుసు చెరువులు తవ్వాడు. అంతేకాదు ఇప్పుడు మరొకటి తవ్వే ప్రయత్నంలో ఉన్నాడు! సంకల్ప బలం, పట్టుదలతో కొండంత ఎదిగిన కెంపెగౌడ కథ ఇదీ.. బెంగళూరు–మాళవళ్లి–కొళ్లేగల్ రోడ్డు మీదుగా దేవాలయాలు సందర్శించేందుకు, చామరాజనగర్ జిల్లా ఎతై న కొండ ప్రాంతాలను చూసేందుకు వెళ్లే వారికి దారిలో కెంపెగౌడ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అక్కడి అందరికీ ఆయన తలలో నాలుక వంటి వారు కావడమే అందుకు కారణం. ఆయన పేరు, కథ విన్నవారెవరైనా సెల్యూట్ చేసి తీరాల్సిందే. ‘మ్యాన్ ఆఫ్ లేక్స్’గా పేరుగాంచారు కెంపెగౌడ. కర్ణాటకలోని మండ్య జిల్లా మాళవళ్లి తాలూకాలోని దాసనదొడ్డి అనే ఒక కుగ్రామంలో కెంపెగౌడ పుట్టారు. ఆ గ్రామంలోని వారంతా గొర్రెల కాపరులే. 82 ఏళ్ల కెంపెగౌడను కలవాలంటే దాసనదొడ్డి గ్రామానికి వెళితే సరిపోదు.. ఆ గ్రామానికి శివార్లలో ఉన్న కుందినిబెట్టా అనే కొండ ప్రాంతానికి వెళ్లి చూడాలి. ఎందుకంటే రోజులో 12 గంటలపాటు ఆయన అక్కడే ఉంటారు. అక్కడ తన 50 గొర్రెలను కాస్తూనో లేదా మొక్కలను నాటుతూనో లేదా చెరువులను తవ్వుతూనో కనిపిస్తారు. ఆయన కుమారులు పేదరికంతో ఆ కుగ్రామంలోనే నివసిస్తున్నారు. వారికున్న ఏకైక జీవనాధారం గొర్రెల పెంపకమే. కెంపెగౌడ సాదాసీదా రైతు, గొర్రెల కాపరిలాగే ఉన్నాడు. ఒకే చొక్కాతో ఆయన ఎప్పుడూ ఆ కొండపైనే ఉంటాడు, ఇతరులు ఇచ్చిన దుస్తులనే ధరిస్తూ ఉంటాడు. తనకంటూ కొత్త చొక్కాలు కొనుక్కోడు. చాలా అరుదుగా గడ్డం చేసుకుంటాడు. ఒక చేతి కర్ర సహాయంతో కెంపెగౌడ నడుస్తూ కనిపిస్తాడు. కెంపెగౌడకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా రాగి ముద్ద, అంబలి, రొట్టె.. మొత్తంగా చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్నే భోజనంగా తీసుకుంటాడు. కుందినిబెట్టా కొండ ప్రాంతంలో కెంపెగౌడ ఇప్పటికి సొంత ఖర్చు, శ్రమతోనే 14 చెరువులను తవ్వాడు. 2017 వరకు మొత్తం 6 చెరువులు తవ్వాడు. కొండ మీదకు రోడ్డు వేసిన తర్వాత మిగిలిన 8 చెరువులను ఒక్క ఏడాదిలోనే తవ్వించాడు. గొర్రెలకు దాహం తీర్చడం ఒక్కటే లక్ష్యమైతే ఒకటి, రెండు తవ్వి ఆపేసేవాడే. దాంతోపాటు ప్రకృతి చెట్టు చేమలతో పచ్చగా ఉండాలన్న ఉదాత్త లక్ష్యంతో చెరువులను తవ్వుకుంటూ వెళుతున్న ఆయనకు కెరే (చెరువులు) కెంపెగౌడ అని చుట్టుపక్కల వారు పేరు పెట్టారు. కెంపెగౌడ నిస్వార్థ సేవను గుర్తించి పలువురు నగదు బహుమతులు ఇస్తున్నారు. ఆ డబ్బును కూడా కెంపెగౌడ సొంత అవసరాలకు ఉపయోగించకుండా చెరువులు నిర్మించేందుకే వినియోగిస్తున్నాడు. చెరువులు తవ్వేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు, కూలి ఖర్చులకు ఆ డబ్బునే వినియోగిస్తూ మరిన్ని చెరువులను తవ్వుతున్నాడు. గొర్రెలకు దాహం తీర్చేందుకు... కెంపెగౌడ 40 ఏళ్ల క్రితం తొలి చెరువును నిర్మించాడు. గొర్రెలు, మేకలను మేపేందుకు తాను కొండపైకి తీసుకెళ్తుండేవాడినని, మేత మేసిన తర్వాత వాటికి తాగడానికి నీరు దొరికేది కాదు. చుట్టుపక్కల చెరువులు కానీ, కాల్వలు కానీ లేకపోవడంతో వాటి దప్పిక ఎలా తీర్చాలనే బెంగ కెంపెగౌడకు పట్టుకుంది. తాగు నీరు లేకపోవడంతో క్రూరమృగాల సంచారం కూడా చాలా తక్కువగా ఉండేది. పశువులు ఒకవైపు మేత మేస్తుంటే కెంపేగౌడ మాత్రం చెరువును తవ్వేవాడు. తొలినాళ్లలో అక్కడి స్థలాన్ని తవ్వేందుకు కట్టెనే ఉపయోగించాడు. తొలిసారి నేలను తవ్వినప్పుడు అదృష్టం కొద్ది అడుగుల్లోనే నీరు బయటకు వచ్చింది. చెరువు తవ్వేందుకు తనకు నెలలకు నెలలు సమయం పట్టేది. చెరువులో నీరు పడ్డాక వెంటనే దానికి అనుసంధానంగా మరో చెరువును తవ్వడం ప్రారంభించాడు. కట్టెతో తవ్వడం ఎంతో ఇబ్బందిగా ఉండి పని సరిగ్గా సాగకపోవడంతో, కొన్ని గొర్రెలను అమ్మేసి ఆ సొమ్ముతో ఇనుప పనిముట్టును కొనుగోలు చేశాడు. తొలి చెరువు తవ్వాక గొర్రెల దాహార్తి తీరడంతో చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత దాని వాలులో ఒక్కొక్కటిగా 14 చెరువులు తవ్వాడు. నిరక్షరాస్యుడైన కెంపెగౌడ చెరువులను నిర్మించే కొద్దీ వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన సాంకేతికతలు, నీటి ప్రవాహ తీరు తదితర వివరాలన్నీ అర్థమయ్యాయి. ప్రస్తుతం ఆ 14 చెరువులు ఎలా అనుసంధానమై ఉన్నాయి. ఒక చెరువు నిండితే మరో చెరువుకు నీరు ప్రవహిస్తుంది. తొలి చెరువు ‘గోకర్ణ’... గత ఏడాది ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ ఆయన సమాజ సేవను గురించి తెలుసుకొని నగదు అందజేశాడు. ఆ డబ్బుతోనే కొండపైకి రోడ్డును నిర్మించాడు కెంపెగౌడ. ఆ రోడ్డు వేసిన తర్వాత సులువుగా మరికొన్ని చెరువులు తవ్వానన్నాడు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు వెళ్లడం వల్ల అన్ని చెరువులకూ జల కళ వచ్చింది. ఈ ఏడాది ఆ కొండపైనే 2 వేలకు పైగా అరటి మొక్కలు నాటాడు. కెంపెగౌడ చదువుకోలేదనే మాటే కానీ పురాణాలపై మంచి పట్టు ఉంది. ఆయన తవ్విన తొలి చెరువుకు ‘గోకర్ణ’ అని పేరు పెట్టుకున్నాడు. ఇక చెరువులను కలుపుతూ నిర్మించిన రోడ్డుకు రామలక్ష్మణ అని పేరు పెట్టాడు. 82 ఏళ్లలోనూ పూర్తి ఆరోగ్యం... 82 ఏళ్ల వయసులోనూ కెంపెగౌడ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. చాలా ఉత్సాహంగా వేగంగా కొండ ఎక్కుతూ, దిగుతూ కనిపిస్తాడు. ఉదయం 8 గంటలకు తన దినచర్యను ప్రారంభిస్తాడు. ఇటీవలే కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. గత 40 ఏళ్లుగా కెంపెగౌడ రోజుకి 12 గంటల పాటు కొండపైనే గడుపుతున్నాడు. ఉదయం కొండపైకి వెళితే తిరిగి రాత్రికే ఇంటికి తిరిగి వచ్చేవాడు. ప్రభుత్వం ఆ కొండను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని పలువురు సామాజిక కార్యకర ్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యోత్సవ పురస్కారం... ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కెంపెగౌడకు ప్రముఖ రాజ్యోత్సవ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. గతేడాది నవంబర్ 1న రాజ్యోత్సవ పురస్కారాన్ని కెంపెగౌడకు ప్రభుత్వం అందజేసింది. ఈ అవార్డు కింద అందజేసిన రూ. లక్ష నగదును సైతం కొత్త చెరువు తవ్వేందుకే ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 15వ చెరువును త్వరలోనే పూర్తి చేస్తానంటూ అమాయకంగా బోసి నవ్వులు నవ్వుతున్నాడు కెంపెగౌడ! మేకలు, గొర్రెల పెంపకం, యాజమాన్యంపై డిప్లొమా మేకలు, గొర్రెల పెంపకం, యాజమాన్యం, మార్కెటింగ్ తదితర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు లక్నవూ(ఉత్తరప్రదేశ్)లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గోట్ మేనేజ్మెంట్ సంస్థ ‘డిప్లొమా ఇన్ లైవ్స్టాక్ బిజినెస్ మేనేజ్మెంట్’ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇది 6 నెలల డిప్లొమా కోర్సు. ఫీజు రూ. 50 వేలు. ప్రతిభావంతులకు ఫీజు సగం వరకు తగ్గింపు అవకాశం ఉంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. ఏప్రిల్ 15 లోగా ధరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు.. +91 86018 73054/55/60/63, ఠీఠీఠీ.జీజీజఝ్చ.ఛిౌ.జీn 23న కరీంనగర్లో ఎన్.సి.ఓ.ఎఫ్. సేంద్రియ రైతు సమ్మేళనం కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్.సి.ఓ.ఎఫ్.) ఆధ్వర్యంలో కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్ (కలెక్టరేట్ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. – సా. 5 గం. వరకు రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్ డీ కంపోజర్ టెక్నాలజీతో సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, పిజిఎస్ ఇండియా సర్టిఫికేషన్, సేంద్రియ మార్కెట్ అనుసంధానంపై సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఎన్.సి.ఓ.ఎఫ్. డైరెక్టర్ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. వూట్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివరాలకు.. విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకులు సముద్రాల జనార్దన్రావు– 93969 69217, 84640 09350. -
కోటను వీడి సామాన్యుడి చెంతకు..
టోక్యో : సామాన్య ఉద్యోగిని పెళ్లాడేందుకు సిద్ధపడ్డ జపాన్ రాణి అయెకో రాజ కుటుంబాన్ని, రాచరిక హోదాను వీడనున్నారు. దివంగత రాజు తకమొడో మూడవ కుమార్తె అయెకో కియో మోరియా అనే 32 ఏళ్ల షిప్పింగ్ కంపెనీ ఉద్యోగిని వివాహం చేసుకుంటారని జపాన్ రాజప్రాసాద ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. ఏడాది కిందట వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆగస్ట్ 12న వీరి నిశ్చితార్థం జరగనుండగా, అక్టోబర్ 29న టోక్యోలోని మిజి జింగు మసీదులో వివాహ బంధంతో వీరు ఒక్కటవనున్నారు. సోషల్ వెల్ఫేర్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ప్రిన్స్ అయెకోకు గత ఏడాది డిసెంబర్లో మొరియాను ఆమె తల్లి రాణి తకమొడో పరిచయం చేశారని ఏజెన్సీ తెలిపింది. స్ధానిక ఎన్జీఓ ద్వారా రాణి తకమొడోకు కియో మోరియా తల్లితండ్రులు ఎప్పటినుంచో పరిచయం. మరోవైపు రాణి అయెకో, కియో మోరియాలకు స్వచ్ఛంద సేవా కార్యకలాపాలతో పాటు పలు ఉమ్మడి అభిరుచులు ఇద్దరినీ దగ్గర చేశాయని చెబుతున్నారు. వీరికి ప్రయాణాలు చేయడంతో పాటు పుస్తక పఠనం వంటి అభిరుచులున్నాయి. జపాన్ చట్టాల ప్రకారం రాణి అయెకో కియో మోరియాను వివాహం చేసుకుంటే రాజ కుటుంబాన్ని విడిచివెళ్లాల్సి ఉంటుంది. అయితే బోనస్ చెల్లింపుల కింద ఆమెకు లక్షలాది డాలర్ల సొమ్ము అందనుంది. సామాన్యుడిని పెళ్లాడి రాచ కుటుంబాన్ని వీడనుండటం అయెకోనే కాదు, గత ఏడాది మేలో ఆమె సోదరి, మహారాజు పెద్ద మనవరాలు రాణి మాకో కూడా పారామెడికల్ ఉద్యోగి కెల్ కొమొరాను పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి వివాహం తరువాత వాయిదా పడింది. జపాన్ రాణులు మాకో, అయెకో ఇద్దరూ సామాన్యులను పెళ్లాడితే రాజ కుటుంబ సభ్యుల సంఖ్య 17కు పడిపోయి మిగిలిన సభ్యులపై రాచరిక బాధ్యతల భారం పడనుంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పురాతన రాజకుటుంబంలో వారసత్వ అంశాలపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. సామాన్యుడిని పెళ్లాడిన రాణులు కుటుంబ శాఖలను ఏర్పరచేందుకు అనుమతించండం, రాజకుటుంబ బాధ్యతలను నూతన సభ్యులకు అప్పగించడం వంటి ప్రతిపాదనలను వారసత్వ ప్రక్రియలో భాగంగా పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
సామాన్యుల చెంతకు.. సంపన్నురాలు
హిసార్: ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలు. కార్పొరేట్ దిగ్గజం, రాజకీయ వేత్త నవీన్ జిందాల్కు స్వయానా తల్లి. హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి. అయితేనేం ఓట్ల కోసం ఓ సామన్య పౌరురాలిగా రోడ్ల వెంటపడ్డారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఆమే ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్. హిసార్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న సావిత్రి జిందాల్ 64 ఏళ్ల వయసులోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండే సావిత్రి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ నియోజకవర్గమంతా కలియదిరుగుతున్నారు. ఉపన్యాసాలు పెద్దగా ఇవ్వకుండా తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మరో అవకాశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. హిసార్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన సావిత్రి హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వందమంది జాబితాలో సావిత్రి కూడా ఉన్నారు.