breaking news
coming
-
ఏలియన్లతో మీటింగ్.. అంగారకుడిపై యుద్ధం తప్పదా?
భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే భావి అంచనాలను చెప్పేవారికి ఎక్కడాలేనంత డిమాండ్ ఉంటుంది. మనకు బ్రహ్మంగారు ఎలాగో.. వెస్ట్రన్ కంట్రీస్కు బాబా వాంగా అలాగ!. ఈమె అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచిన ఈమె 1996లో తన 85 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కానీ, చనిపోయిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఆమె చెప్పిన భవిష్యత్ అంచనాలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరొందిన బాబా వంగా తన పన్నెండేళ్ల వయసులో చూపు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఆమె జోస్యం చెప్పడాన్ని మొదలు పెట్టారు. మార్కా డాట్ కామ్ తెలిపిన వివరాల ప్రకారం 2021 సెప్టెంబరు 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్పై జరిగిన దాడిపై బాబా వాంగా చెప్పిన అంచనా నిజమయ్యింది. రెండు లోహపు పక్షులు (విమానాలు) ట్విన్ టవర్స్ను ఢీకొంటాయని, అమాయకుల రక్తం ఏరులై పారుతుందని వాంగా తెలిపారు.బాబా వాంగా తెలిపిన భవిష్యవాణులలో ముఖ్యమైనది ప్రపంచం అంతమయ్యే తేదీ. ఆమె అంచనాల ప్రకారం విశ్వంలో అనూహ్యమైన సంఘటన కారణంగా 5079లో ప్రపంచం అంతం కానుంది. రాబోయే దశాబ్దాలలో ఆమె తెలిపిన ప్రముఖ అంచనాలిలా ఉన్నాయి.2025: ఐరోపాలో భారీ సంఘర్షణల కారణంగా ఈ ఖండంలోని జనాభా గణనీయంగా తగ్గుతుంది.2028: నూతన శక్తి వనరులను కనుగొనే ప్రయత్నంలో మనిషి శుక్రుడిని చేరుకుంటాడు.2033: ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.2076: కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుంది.2130: భూలోకేతర నాగరికతలతో పరిచయం ఏర్పడుతుంది.(ఏలియన్స్తో కమ్యూనికేషన్)2170: ప్రపంచవ్యాప్తంగా కరువు కమ్ముకుంటుంది.3005: అంగారకునిపై యుద్ధం.3797: భూమి నాశనం.. సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి మనిషి ప్రయాణం5079: ప్రపంచం అంతం. -
విపక్షాల సభకు పవార్ వస్తారా? రారా? ఇదీ క్లారిటీ..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నేటి నుంచి ప్రారంభమైన ప్రతిపక్షాల సమావేశానికి ఎస్పీపీ అధినేత శరద్ పవార్ గైర్హాజరు కానున్నాడని ఊహాగానాలు వచ్చిన వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. శరద్ పవార్ రేపు(మంగళవారం) మీటింగ్కు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. శరద్ పవార్తో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రతిపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరు కాట్లేదనే పుకార్లను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ప్రతిపక్షాల సమావేశం అధికారికంగా మంగళవారం(జులై 18)నే జరగనుందని తెలిపారు. జులై 17 (సోమవారం) కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆతిథ్యమిస్తున్న డిన్నర్కు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. 'మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవనున్న నేపథ్యంలో శరద్ పవార్ తప్పనిసరిగా ఉండాల్సిన అవరసరం ఏర్పడింది. రేపు తప్పకుండా ప్రతిపక్షాల సమావేశానికి హజరవుతారు. భేటీకి రావాల్సిందిగా శరద్ పవార్ను కోరాను' అని ఖర్గే తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు.. శరద్ పవార్ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల భేటీలో ఎలాంటి సమస్యలు లేవని ఖర్గే వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు తప్పకుండా హజరవుతారని ఖర్దే తెలిపారు. పాట్నా భేటీలో హాజరైన నేతల కంటే ఎక్కువ మంది నేతలు బెంగళూరు సమావేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్ పవార్ -
మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న జిమ్నీ మోడల్ చేరిక సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వెల్లడించింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న కంపెనీకి ఇది బలమైన మోడల్గా నిలుస్తుందని ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఇతర మోడళ్లతో పాటు జిమ్నీ కీలక పాత్ర పోషించాలని సంస్థ భావిస్తోంది. ప్యాసింజర్ కార్ల రంగంలో భారత్లో ఎస్యూవీల వాటా ప్రస్తుతం 45 శాతం ఉంది. ఎస్యూవీల్లో కాంపాక్ట్ ఎస్యూవీలు సగానికిపైగా వాటాను కైవసం చేసుకున్నాయి. 2022–23లో దేశంలో 39 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో కాంపాక్ట్ ఎస్యూవీలు 8.7 లక్షల యూనిట్లు ఉన్నాయి. లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ కొత్తగా ప్రాచుర్యంలోకి వస్తోంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) కంపెనీ వృద్ధిలో సాయం.. సంస్థ మొత్తం బ్రాండ్ విలువపై జిమ్నీ సానుకూల ప్రభావం చూపుతుందని మారుతీ సుజుకీ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఒక నిష్ణాత ఎస్యూవీగా వారసత్వాన్ని జిమ్నీ కలిగి ఉంది. ఈ విభాగంలో కంపెనీ వృద్ధికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది’ అని అన్నారు. అయిదు డోర్లు కలిగిన జిమ్నీ ఎస్యూవీ అభివృద్ధి కోసం ఎంఎస్ఐ రూ.960 కోట్లు వెచ్చించింది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాల్లో సుజుకీ ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల జిమ్నీ వాహనాలను విక్రయించింది. విదేశాల్లో ఇది మూడు డోర్లతో లభిస్తోంది. తొలిసారిగా అయిదు డోర్లతో భారత్లో రంగప్రవేశం చేస్తోంది. ఆల్-టెరైన్ కాంపాక్ట్ లైఫ్స్టైల్ ఎస్యూవీగా స్థానం సంపాదించింది. ఈ ఫోర్-వీల్-డ్రైవ్ ఆఫ్-రోడర్ కఠినమైన భూభాగాల్లో కూడా పరుగెత్తగలదు. (e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..) జిమ్నీకి 30 వేల బుకింగ్స్.. ఇప్పటికే జిమ్నీ కోసం సుమారు 30,000 బుకింగ్స్ నమోదయ్యాయని శ్రీవాస్తవ వెల్లడించారు. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయన్నారు. ఏటా దాదాపు 48,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో త్వరగా విస్తరిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. జిమ్నీతో అమ్మకాలు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని శ్రీవాస్తవ చెప్పారు. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలతో కంపెనీ 2022–23లో దేశీయ ఎస్యూవీ విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాను ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీ వాటా 2022 ఏప్రిల్లో 12 శాతం ఉంటే.. గత నెలలో ఇది 19 శాతానికి ఎగసిందన్నారు. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) సాయుధ దళాలకు.. జిప్సీ మాదిరిగా సాయుధ దళాలకు జిమ్నీ వాహనాలను అందించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ మోడల్ను పరిచయం చేసిన తర్వాత ఏదైనా నిర్దిష్ట అవసరం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. గతంలో సాయుధ దళాలకు 6–10 వేల యూనిట్ల జిప్సీ వాహనాలను సరఫరా చేసేవాళ్లం. ప్రస్తుతం జిప్సీ తయారీని నిలిపివేశాం అని తెలిపారు. మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
నేడు ఏపీకి రానున్న నూతన గవర్నర్
-
Tecno Phantom V Fold అద్బుత ఫీచర్లతో టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ కంపెనీ టెక్నో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను త్వరలోనే విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ పేరుతో దీన్ని ఈ నెల ఫిబ్రవరి 27 నుండి స్పెయిన్లోని బార్సిలోనాలో ప్రారంభమయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరి 28న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ పేజీ ఇప్పటికే MWC 2023 వెబ్సైట్లో లిస్ట్ అయి ఉంది. మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ఫాం టమ్ వీ ఫోల్డ్ను ఫిబ్రవరి 28న MWC 2023 సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు అధికారికంగా టెక్నో ప్రకటించింది. అంతేకాదు ప్రపంచంలోని మొట్టమొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్గా కూడా ఉంటుందని తెలిపింది. MediaTek డైమెన్సిటీ 9000+ SoC ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ అనీ, చిప్సెట్ మొత్తం AnTuTu టెస్ట్ స్కోర్ను 1.08 మిలియన్లకు పైనే కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను టిప్స్టర్ పరాస్ గుగ్లానీ లీక్ చేశారు. దీని ప్రకారం వీ ఫోల్డ్ డిస్ప్లేను సెంట్రల్-ప్లేస్డ్ హోల్-పంచ్ హౌసింగ్ సెల్ఫీ కెమెరాను, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తెలుస్తోంది. ఫాంటమ్ వీ ఫోల్డ్ అంచనా ఫీచర్లు 7.1, 5.54 అంగుళాల అమెలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 56+16+8 ఎంపీ రియర్ కెమెరా 32+32 సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్ 4500 బ్యాటరీ 67 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ Tecno Phantom V Fold 🔥 pic.twitter.com/mEnzA7whn3 — Sudhanshu Ambhore (@Sudhanshu1414) February 2, 2023 -
హామీల అమలుపైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పట్టణానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరనున్న ఆయన హెలికాప్టర్లో 10:40 గంటలకు హాలియా చేరుకుంటారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జరగనున్న సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పురోగతే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్ష జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో భోజనానంతరం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి మొత్తం మీద మూడున్నర గంటల పాటు హాలియాలో గడపనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎత్తిపోతల పథకాలపై ప్రధాన చర్చ సాగర్ ఉప ఎన్నికల సమయంలో తాను ఇచ్చినnal హామీల అమలు, వాటి పురోగతితో పాటు ఇంకా ప్రారంభించాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్షించనున్నారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని దిగువన ఉన్న త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు అనుసంధానం చేసే అంశంపైనా సీఎం సమీక్షిస్తారని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద మంజూరు చేసిన రూ.199 కోట్లతో చేపట్టాల్సిన పనుల గురించి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఉద్యోగాలు తిరిగొస్తున్నాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి పథకం(ఈపీఎఫ్)లో 2020 డిసెంబర్లో కొత్తగా 12.53 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2020 నవంబర్లో కొత్త సభ్యులు 8.70 లక్షల మందితో పోలిస్తే 40 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2017 సెప్టెంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు ఈపీఎఫ్ పథకంలో 3.94 కోట్ల మంది సభ్యులుగా నమోదైనట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అదే విధంగా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ)లోకి 2020 డిసెంబర్ నెలలో 12.06 లక్షల మంది నూతన సభ్యులుగా నమోదయ్యారు. అంతకుముందు నెలలో (2020 నవంబర్) సభ్యుల నమోదు 9.48 లక్షలతో పోలిస్తే పెరిగింది. 2017 సెప్టెంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు ఈఎస్ఐసీలో 4.63 లక్షల మంది కొత్తగా చేరినట్టు ఎన్ఎస్వో నివేదిక తెలియజేసింది. ఈపీఎఫ్తో పాటు పలు సామాజిక భద్రతా పథకాల్లో నూతన సభ్యుల నమోదు గణాంకాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ నివేదికను రూపొందించింది. 2018 ఏప్రిల్ నుంచి ఎన్ఎస్వో వివరాలను విడుదల చేస్తూ వస్తోంది.(రిటైల్ రుణ గ్రహీతలకు కష్ట కాలమే!) -
సరిహద్దుల్లో పాక్ చొరబాటు యత్నాలు
-
వచ్చే నెల ఒకటిన సీఎం రాక
నరసన్నపేట: వచ్చే నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లాకు రానున్నార ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పైలెట్ ప్రాజెక్టును సీఎం జిల్లాలో ప్రారంభించనున్నారని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే సభ కోసం వివిధ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ నివా స్తో కలిసి మంత్రి సోమవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సీఎంకు ఘ నస్వాగతం పలకనున్నామని చెప్పారు. నరసన్నపేటలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని, సభా వేదిక కోసం స్థలాలను పరి శీలి స్తున్నామన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని 25న రాష్ట్రానికి వస్తారని, అనంతరం ఆయన పర్యటనపై మరింత స్పష్టత వస్తుందన్నారు. సన్నబియ్యం పంపిణీని జిల్లా నుంచే ప్రారంభించాలని ముఖ్య మంత్రి భావిస్తున్నారని తెలిపారు. ఈదులవలస కూడలి దాదాపు ఖరారు... సభా వేదికగా నరసన్నపేట ప్రభుత్వ జూని యర్ కళాశాల మైదానాన్ని ముందుగా ఎంపి క చేసినా.. ఆ రోజున సచివాలయ ఉద్యోగాల కోసం ఇక్కడ పరీక్షలు నిర్వహించనున్నందు న ఇబ్బందులు వస్తాయని భావించి మరికొ న్ని స్థలాలను పరిశీలించారు.వంశధార కార్యాలయ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంతోపాటు ఈదులవలస కూడలిలో ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ స్థలం అనువుగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్ నిర్ధారణకు వచ్చి నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రితో చర్చించా రు. పోలీస్ అధికారులు పరిశీలించిన తరువాత స్పష్టత వస్తుంది. మంత్రి వెంట వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, చింతు రామారావు, ఆరంగి మురళి, కేసీహెచ్బీ గుప్త, ఎంపీడీఓ ఆర్.వెంకటరావు, తహసీల్దార్ ప్రవల్లికాప్రియ, ఈఓపీఆర్డీ రవికుమార్, ఈఓ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ నేడు జిల్లాకు రాక
– కాకినాడ ఆసుపత్రిలో చాపరాయి బాధితులకు పరామర్శ – రంపచోడవరంలో రాత్రి బస – శనివారం చాపరాయి పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం కాకినాడ చేరుకుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజైన శనివారం చాపరాయి గ్రామంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి అదే రోజు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు వైఎస్ జగన్ టూర్ షెడ్యూల్ను గురువారం రాత్రి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రకటించారు. -
రోబోలొస్తున్నాయ్ జాగ్రత్త..!
-
రేపు గవర్నర్ నరసింహన్ పుట్టపర్తి రాక
పుట్టపర్తి టౌన్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారం పుట్టపర్తికి రానున్నట్లు రెవెన్యూ అధికారులు గురువారం తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకుంటారన్నారు. మూడు గంటల పాటు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గడిపి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడి నుంచి ఆయన బయలు దేరుతాయని వారు తెలిపారు. -
టోటల్లీ ప్యాక్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..!
బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ లీ ఇకో మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత బైక్ లను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్ డివైస్తో అనుసంధానమై పనిచేసే ఈ బైక్ను చైనా సంస్థ లీఎకో రూపొందిస్తోంది. 2017 రెండో త్రైమాసికంలో ఈ టోటల్లీ ప్యాక్డ్ విత్ ఆండ్రాయిడ్ స్మార్ట్బైక్ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో స్మార్ట్ రోడ్ బైక్, స్మార్ట్ మౌంటెన్ బైక్ పేరుతో రెండు వేరియంట్స్ ను తీసుకొస్తోంది. మిగతా సూపర్ బైక్ ల ఫీచర్లతో పాటు 6000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేసే రిమూవబుల్ బ్యాటరీ , స్నాప్ డ్రాగన్ 410 పవర్డ్ టచ్ స్ర్కీన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ , వాకీ టాకీ లాంటి అదనపు ఫీచర్లు ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ధర ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సప్పెన్సే. ఈ స్మార్ట్ బైక్ హ్యాండిల్స్ పై ఉండే నాలుగు అంగుళాల టచ్ ఆధారిత స్మార్ట్ స్క్రీన్ ద్వారా మనం ఏ దిశలో వెళ్లాలో తెలుసుకోవచ్చు. ఏయే ప్రాంతాల్లో తిరిగామో రికార్డు కూడా చేస్తుంది. ఒంటరి ప్రయాణంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ సంగీతాన్ని ఆస్వాదించొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు ఈ బైక్ను ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆ బైక్ సంబంధిత యజమాని ఫోన్కి అలర్ట్ ఆటోమేటిక్గా అందే ఏర్పాటు ఉంది. సెన్సర్ల ద్వారా రైడర్ ఫిట్నెస్ వివరాలను కూడా ఈ స్మార్ట్ బైక్ ట్రాక్ చేసేలా రూపొందించారట. దీంతో ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంపై స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ కార్లు, స్మార్ట్ టీవీలే కాదు స్మార్ట్ బైక్ లు కూడా ఇక మార్కెట్లను ముంచెత్తబోతున్నాయన్నమాట. అయితే ముందుగా అమెరికాలో హల్ చల్ చేయనున్న ఈ స్మార్ట్ బైక్ లకోసం దేశీయ బైక్ లవర్స్ మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ కరెంటు మీటర్లు వచ్చేస్తున్నాయి. స్మార్ట్గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా వాటిని బిగించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలో పరిశ్రమలు, గృహాలకు వీటిని ఏర్పాటు చేయనుంది. రూ.41.82 కోట్ల అంచనా వ్యయంతో జీడిమెట్ల పారిశ్రామికవాడలో చేపట్టేందుకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)తో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% నిధులను కేంద్రం భరించనుంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని 12,880 గృహాలు, పరిశ్రమలకు 2017 సెప్టెంబర్ 17లోగా ఈసీఐఎల్ స్మార్ట్ మీటర్లను బిగించాల్సి ఉంది. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగదారులు, డిస్కంలకు ఉభయ ప్రయోజనకారిగా పనిచేయనున్నాయి. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించుకోడానికి డిస్కంలకు అవకాశం లభించనుంది. వినియోగదారులు సెల్ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనాఎస్ఎంఎస్ను తమ ఇంట్లోని స్మార్ట్ మీటర్కు పంపించి ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేందుకు వీలుకలగనుంది. స్మార్ట్ఫోన్ తరహాలోనే ఈ స్మార్ట్మీటర్ పనిచేయనుంది. ఇందులో ఓ సిమ్కార్డుతోపాటు ఎల్సీడీ డిస్ప్లే బోర్డు ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పనిచేసే ఈ మీటర్లను ఒక ఎస్ఎంఎస్ ద్వారా షట్డౌన్ చేసి ఇంట్లో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయవచ్చు. మెయింటెనెన్స్ పనులు, ఇతరాత్ర అవసరాల కోసం విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే సంబంధిత వినియోగదారుల స్మార్ట్ మీటర్లకు డిస్కంలు ఎస్ఎంఎస్లు పంపించనున్నాయి. స్మార్ట్ మీటర్లో ఉండే డిస్ప్లే బోర్డులో ఈ సందేశాలను చూసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారానే ఇంట్లోని గ్రీజర్, రిఫ్రిజిరేటర్ వంటి విద్యుత్ పరకరాలను ఆన్/ఆఫ్ చేయవచ్చు. ప్రస్తుతం పరిశ్రమలు పగటి పూట విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్పై రూపాయి టైమ్ ఆఫ్ డే(టీఓడీ) పెనాల్టీని విధిస్తున్నారు. రాత్రివిద్యుత్ వాడకంపై పరిశ్రమలకు విద్యుత్ చార్జీలో ప్రతియూనిట్పై రూపాయి రాయితీని ఇస్తున్నారు. రాయితీలు లభించే రాత్రిపూట మాత్రమే విద్యుత్ను వినియోగించేవిధంగా పరిశ్రమలు స్మార్ట్ మీటర్ను సెట్ చేసుకొని పెట్టుకోవచ్చని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
త్వరలో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు
చింతపల్లి దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా చింతపల్లి, కొండమల్లేపల్లి, డిండి మండల కేంద్రాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ వెల్లడించారు. మంగళవారం చింతపల్లి పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి సర్కిల్ ఆఫీస్ పరిధిలో నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి పీఎస్లు, కొండమల్లేపల్లి సర్కిల్ ఆఫీస్ పరిధిలో గుడిపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి పీఎస్లు, డిండి సర్కిల్ ఆఫీస్ పరిధిలో నేరడుగొమ్ము, చందంపేట, డిండి పీఎస్లతో త్వరలో సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో గ్రామాల్లో పోలీస్ పల్లెనిద్ర తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22న పీపుల్స్ వారోత్సవాల సందర్భంగా దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కృష్ణపట్టె, రాచకొండ ఏరియాలలో ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా మావోయిస్టుల కదలికలు లేవని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అనంతరం పోలీస్స్టేషన్లోని రికార్డులను సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, ఎస్ఐ నాగభూషణ్రావుతో పాటు సిబ్బంది ఉన్నారు. -
ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్కుమార్ బుధవారం పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. రామకృష్ణ ధియేటర్ వెనుక నిర్మించిన ప్రభుత్వ గృహ సముదాయాలను పరిశీలించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి గూడు కల్పించేందుకు ముఖ్యమంత్రి అన్ని విధాల కృషి చేస్తున్నారన్నారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 1000 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నగరంలో నల్లా ఛానల్ మళ్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, హౌసింగ్ పీడీ సెల్వరాజ్, ఈఈ బిహెచ్ శ్రీనివాస్, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు వారి వెంట ఉన్నారు. సీఎం పర్యటనలో భద్రతకు 700 మంది పోలీసులు రాజమహేంద్రవరంలో ట్రయల్ రన్ రాజమహేంద్రవరం క్రైం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనా ప్రాంతాల్లో బుధవారం ట్రయల్రన్ నిర్వహించారు. అర్భన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో సివిల్ పోలీసులతో పాటు ఏజీఎస్, స్పెషల్ బ్రాంచ్, ఎ.ఆర్. పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలను వినియోగిస్తున్నారు. మధురపూడి విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి కారులో రాజమహేంద్రవరం చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటించే రామకృష్ణ థియేటర్ వెనుక ఉన్న గృహ సముదాయం వద్ద, ఇన్నీసుపేట నుంచి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు, ఆర్సీసీ మేజర్ డ్రైన్, ఆవ ఛానల్ వద్ద రోడ్డు నిర్మాణ శంకుస్థాపనల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
రేపు జిల్లాకు సీఎం రాక
రాజమహేంద్రవరంలో పుష్కరుడికి వీడ్కోలు నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు సాక్షి, రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయడు గురువారం జిల్లా పర్యటనకు రానున్నారని సమచార, పౌర సంబంధాల శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు మధురపూడి విమానశ్రయానికి చేరుకుంటారు. 3:25 గంటలకు రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డులోని దేవాదాయ శాఖ స్థలంలో నిర్మించిన వాంబే గృహాలను లబ్ధిదారులకు అందించి వారినుద్దేశించి ప్రసంగిస్తారు. 4:5కు హుకుంటపేట హైస్కూల్కు చేరుకుని బహిరంగ మల విసర్జనలేని గ్రామంగా ఎంపికైన ఆ గ్రామ పంచాయతీ జన్మభూమి కమిటీ సభ్యులకు రూ.5 లక్షల ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాలను ప్రారంభిస్తారు. 4:30కు చెరుకూరి కల్యాణ మండపంలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 5:45 నుంచి 6:45 వరకు పుష్కరఘాట్లో హారతి కార్యక్రమంలో పాల్గొని పుష్కరుడికి వీడ్కోలు పలుకుతారు. 7:05 గంటలకు మధురపూడి విమానాశ్రయంకు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు. -
గాడిదలు కాయడానికి వస్తున్నావా?
ఉపాధ్యాయుడి తీరుపై మంత్రి చందూలాల్ ఆగ్రహం మదనపల్లి యూపీఎస్ ఆకస్మిక తనిఖీ ములుగు : ‘నీ జీతం ఎంత?’ మంత్రి చందూలాల్ ప్రశ్న. ‘సార్ రూ.40వేలు’ ఉపాధ్యాయుడి స మాధానం. ‘రూ.40వేలు తీసుకొని గాడిదలు కాయడానికి వచ్చావా?.. పిల్లలకు పాఠాలు చెప్పడానికి వస్తున్నావా?’ అంటూ మంత్రి తీ వ్రంగా మండిపడ్డారు. ములుగు మండలం మదనపల్లి యూపీఎస్ను శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఉపాధ్యాయుడు కుమారస్వామి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ హెచ్ఎం ఎక్కడా? అని మంత్రి ప్రశ్నించగా రాలేదని ఉపాధ్యాయు డు సమాధానం చెప్పాడు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్ చూపించాలనడంతో ఒకరు తెచ్చి మం త్రికి ఇచ్చారు. అందులో ఇన్చార్జి హెచ్ఎం భవానీ పేరుతో సీఎల్ అని రాసి ఉంది. లీవ్ లెటర్ చూపాలని మంత్రి అడగ్గా తనతో ఫోన్ లో చెప్పిందని ఉపాధ్యాయుడు కుమారస్వామి సమాధానం చెప్పారు. లీవ్ లెటర్ లేకుండా లీవ్ ఎలా ఇచ్చారంటూ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. అటెండెన్స్ రిజిస్టర్లో గురువారం ఉపాధ్యాయుడు కుమారస్వామి విధులకు హాజరు కాలేదు. ఎలాంటి లీవ్ లెటర్ లేదు. దీన్ని మంత్రి గుర్తించి ప్రశ్నించారు. అక్కడే ఉన్న గ్రామస్తులు వీరు విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని మంత్రికి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి హెచ్ఎం, ఉపాధ్యాయుల మధ్య పరిణామాలపై మంత్రికి వివరించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ఇన్చార్జి హెచ్ఎం భవానీ, ఉపాధ్యాయుడు కుమారస్వామిని సస్పెండ్ చేయాలని డీఈవో రాజీవ్ను ఫోన్లో ఆదేశించారు. డీఈఓ ఆదేశాల మేరకు ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్ నివేదిక ఇచ్చారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల తీరుతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పోతుందన్నారు. ఉదయం 8.45 గంటలకు పాఠశాలలకు చేరుకోవాల్సిన ఉపాధ్యాయులు కొందరు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఇద్దరు టీచర్ల సస్పెన్షన్ విద్యారణ్యపురి : జిల్లాలోని ములుగు మం డలం మదనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం జి.భవానీ, ఎస్జీటీ కుమారస్వామిని డీఈఓ రాజీవ్ సస్పెండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి చందూలాల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఇన్చార్జి హెచ్ఎం జి.భవానీ విధులకు గైర్హాజరు కాగా ఎస్జీటీ కుమారస్వామి అటెండెన్స్ రిజిస్టర్లో సీఎల్ అని రాసినట్లు గుర్తించారు. లీవ్లెటర్ గురించి అడగ్గా లేకపోవడంతో వారిద్దరిని సస్పెండ్ చేయాలని అందులో రాశారు. ఈమేరకు వారిని డీఈఓ సస్పెండ్ చేశారు. -
గోదావరి జిల్లాలో పూలస చేప సందడి
-
డ్రాట్ బీరు వచ్చేస్తోంది
-
హైదరాబాద్కి రానున్న దిగ్విజయ్
-
ఔషధ గుణాలున్న నీటికి ఉదయగిరిలో డిమాండ్
-
టీస్టాలు పెట్టినంత సులువుగా బీయర్ కేఫ్