-
విపక్షాల సభకు పవార్ వస్తారా? రారా? ఇదీ క్లారిటీ..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నేటి నుంచి ప్రారంభమైన ప్రతిపక్షాల సమావేశానికి ఎస్పీపీ అధినేత శరద్ పవార్ గైర్హాజరు కానున్నాడని ఊహాగానాలు వచ్చిన వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. శరద్ పవార్ రేపు(మంగళవారం) మీటింగ్కు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. శరద్ పవార్తో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రతిపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరు కాట్లేదనే పుకార్లను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ప్రతిపక్షాల సమావేశం అధికారికంగా మంగళవారం(జులై 18)నే జరగనుందని తెలిపారు. జులై 17 (సోమవారం) కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆతిథ్యమిస్తున్న డిన్నర్కు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. 'మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవనున్న నేపథ్యంలో శరద్ పవార్ తప్పనిసరిగా ఉండాల్సిన అవరసరం ఏర్పడింది. రేపు తప్పకుండా ప్రతిపక్షాల సమావేశానికి హజరవుతారు. భేటీకి రావాల్సిందిగా శరద్ పవార్ను కోరాను' అని ఖర్గే తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు.. శరద్ పవార్ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల భేటీలో ఎలాంటి సమస్యలు లేవని ఖర్గే వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు తప్పకుండా హజరవుతారని ఖర్దే తెలిపారు. పాట్నా భేటీలో హాజరైన నేతల కంటే ఎక్కువ మంది నేతలు బెంగళూరు సమావేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్ పవార్ -
మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న జిమ్నీ మోడల్ చేరిక సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వెల్లడించింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న కంపెనీకి ఇది బలమైన మోడల్గా నిలుస్తుందని ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఇతర మోడళ్లతో పాటు జిమ్నీ కీలక పాత్ర పోషించాలని సంస్థ భావిస్తోంది. ప్యాసింజర్ కార్ల రంగంలో భారత్లో ఎస్యూవీల వాటా ప్రస్తుతం 45 శాతం ఉంది. ఎస్యూవీల్లో కాంపాక్ట్ ఎస్యూవీలు సగానికిపైగా వాటాను కైవసం చేసుకున్నాయి. 2022–23లో దేశంలో 39 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో కాంపాక్ట్ ఎస్యూవీలు 8.7 లక్షల యూనిట్లు ఉన్నాయి. లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ కొత్తగా ప్రాచుర్యంలోకి వస్తోంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) కంపెనీ వృద్ధిలో సాయం.. సంస్థ మొత్తం బ్రాండ్ విలువపై జిమ్నీ సానుకూల ప్రభావం చూపుతుందని మారుతీ సుజుకీ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఒక నిష్ణాత ఎస్యూవీగా వారసత్వాన్ని జిమ్నీ కలిగి ఉంది. ఈ విభాగంలో కంపెనీ వృద్ధికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది’ అని అన్నారు. అయిదు డోర్లు కలిగిన జిమ్నీ ఎస్యూవీ అభివృద్ధి కోసం ఎంఎస్ఐ రూ.960 కోట్లు వెచ్చించింది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాల్లో సుజుకీ ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల జిమ్నీ వాహనాలను విక్రయించింది. విదేశాల్లో ఇది మూడు డోర్లతో లభిస్తోంది. తొలిసారిగా అయిదు డోర్లతో భారత్లో రంగప్రవేశం చేస్తోంది. ఆల్-టెరైన్ కాంపాక్ట్ లైఫ్స్టైల్ ఎస్యూవీగా స్థానం సంపాదించింది. ఈ ఫోర్-వీల్-డ్రైవ్ ఆఫ్-రోడర్ కఠినమైన భూభాగాల్లో కూడా పరుగెత్తగలదు. (e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..) జిమ్నీకి 30 వేల బుకింగ్స్.. ఇప్పటికే జిమ్నీ కోసం సుమారు 30,000 బుకింగ్స్ నమోదయ్యాయని శ్రీవాస్తవ వెల్లడించారు. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయన్నారు. ఏటా దాదాపు 48,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో త్వరగా విస్తరిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. జిమ్నీతో అమ్మకాలు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని శ్రీవాస్తవ చెప్పారు. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలతో కంపెనీ 2022–23లో దేశీయ ఎస్యూవీ విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాను ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీ వాటా 2022 ఏప్రిల్లో 12 శాతం ఉంటే.. గత నెలలో ఇది 19 శాతానికి ఎగసిందన్నారు. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) సాయుధ దళాలకు.. జిప్సీ మాదిరిగా సాయుధ దళాలకు జిమ్నీ వాహనాలను అందించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ మోడల్ను పరిచయం చేసిన తర్వాత ఏదైనా నిర్దిష్ట అవసరం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. గతంలో సాయుధ దళాలకు 6–10 వేల యూనిట్ల జిప్సీ వాహనాలను సరఫరా చేసేవాళ్లం. ప్రస్తుతం జిప్సీ తయారీని నిలిపివేశాం అని తెలిపారు. మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
నేడు ఏపీకి రానున్న నూతన గవర్నర్
-
Tecno Phantom V Fold అద్బుత ఫీచర్లతో టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ కంపెనీ టెక్నో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను త్వరలోనే విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ పేరుతో దీన్ని ఈ నెల ఫిబ్రవరి 27 నుండి స్పెయిన్లోని బార్సిలోనాలో ప్రారంభమయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరి 28న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ పేజీ ఇప్పటికే MWC 2023 వెబ్సైట్లో లిస్ట్ అయి ఉంది. మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ఫాం టమ్ వీ ఫోల్డ్ను ఫిబ్రవరి 28న MWC 2023 సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు అధికారికంగా టెక్నో ప్రకటించింది. అంతేకాదు ప్రపంచంలోని మొట్టమొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్గా కూడా ఉంటుందని తెలిపింది. MediaTek డైమెన్సిటీ 9000+ SoC ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ అనీ, చిప్సెట్ మొత్తం AnTuTu టెస్ట్ స్కోర్ను 1.08 మిలియన్లకు పైనే కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను టిప్స్టర్ పరాస్ గుగ్లానీ లీక్ చేశారు. దీని ప్రకారం వీ ఫోల్డ్ డిస్ప్లేను సెంట్రల్-ప్లేస్డ్ హోల్-పంచ్ హౌసింగ్ సెల్ఫీ కెమెరాను, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తెలుస్తోంది. ఫాంటమ్ వీ ఫోల్డ్ అంచనా ఫీచర్లు 7.1, 5.54 అంగుళాల అమెలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 56+16+8 ఎంపీ రియర్ కెమెరా 32+32 సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్ 4500 బ్యాటరీ 67 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ Tecno Phantom V Fold 🔥 pic.twitter.com/mEnzA7whn3 — Sudhanshu Ambhore (@Sudhanshu1414) February 2, 2023 -
హామీల అమలుపైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పట్టణానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరనున్న ఆయన హెలికాప్టర్లో 10:40 గంటలకు హాలియా చేరుకుంటారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జరగనున్న సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పురోగతే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్ష జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో భోజనానంతరం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి మొత్తం మీద మూడున్నర గంటల పాటు హాలియాలో గడపనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎత్తిపోతల పథకాలపై ప్రధాన చర్చ సాగర్ ఉప ఎన్నికల సమయంలో తాను ఇచ్చినnal హామీల అమలు, వాటి పురోగతితో పాటు ఇంకా ప్రారంభించాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్షించనున్నారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని దిగువన ఉన్న త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు అనుసంధానం చేసే అంశంపైనా సీఎం సమీక్షిస్తారని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద మంజూరు చేసిన రూ.199 కోట్లతో చేపట్టాల్సిన పనుల గురించి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement