-
సివిల్ ఎస్ఐగా ప్రియాంక
నల్గొండ: చిలుకూరు మండలం పరిధిలోని జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన పందిరి అమృతరెడ్డి లక్ష్మి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. వీరి రెండో కుమార్తె ప్రియాంక ఎంటెక్ పూర్తి చేసింది. ఈమె సోదరి తేజస్విని జైలు వార్డెన్గా పనిచేస్తుండగా తమ్ముడు శ్రీకాంత్రెడ్డి సివిల్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ప్రియాంక పదో తరగతి వరకు జెర్రిపోతులగూడెంలో, ఇంటర్, ఇంజనీరింగ్ కోదాడలో, ఎంటెక్ హైదరాబాద్లో పూర్తి చేసింది. తొలి ప్రయత్నంలోనే ఎస్ఐగా ఉద్యోగం సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటోంది.. ప్రియాంక. ఆమెను ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
పోలీసు, న్యాయవ్యవస్థ నాణేనికి రెండు ముఖాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు, న్యాయవ్యవస్థలు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల వంటివని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి (ఆర్బీవీఆర్ఆర్) తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 2019 కొత్త ఎస్సై(సివిల్) బ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ, పోలీస్ విధుల్లో వ్యత్యాసమున్నా లక్ష్యం ఒక్కటేనన్నారు. పోలీసు అధికారులు సమాజం పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులతో వచ్చే ప్రజలతో సహనంతో వ్యవహరించాలన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలపై శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులతోపాటు, చట్టాలన్నింటిపైనా పట్టు సాధించాలని సూచించారు. బృంద స్ఫూర్తి, స్మార్ట్వర్క్, సిటిజన్ ఫ్రెండ్లీ విధానాలకనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ముడిరాళ్లను వజ్రాలుగా సానబెట్టే అవకాశం టీఎస్పీఏకి వచ్చిందని పోలీసు అకాడమీ డైరెక్టర్ వినయ్కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ట్రైనీ ఎస్సైలకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్కుమార్.. టీఎస్పీఏ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జానకీషర్మిల తదితరులు పాల్గొన్నారు. -
పట్టుదలే పెట్టుబడి
ఎస్ఐ ఉద్యోగమంటే ఎంతో ‘ఖర్చు’ అనుకునే ఈ రోజుల్లో చాలా అవలీలగా ఉద్యోగం సంపాదించి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు పాలమూరు ముద్దు బిడ్డలు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టినా పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగారు. లక్ష్య సాధనలో అనేక అవరోధాలు ఎదురైనా అన్నింటినీ అధిగమిస్తూ గమ్యం చేరుకున్నారు. శనివారం వెలువడిన ఎస్ఐ ఫలితాల్లో పాలమూరు పేద విద్యార్థులు ప్రతిభ చూపారు. పేద కుటుంబాల నుంచి... కొల్లాపూర్ నుంచి ముగ్గురు యువకుల ఎంపిక కొల్లాపూర్రూరల్,న్యూస్లైన్ : మండలం నుంచి ముగ్గురు యువకులు ఎ స్ఐ పోస్టులకు ఎంపికయ్యారు. శని వారం రాష్ట్రపోలీస్ శాఖ విడుదల చేసిన ఎస్ఐ ఫలితాల్లో చుక్కాయిపల్లి,రామాపురం, సింగోటం గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు తమ ప్రతిభ కనబర్చి ఎస్ ఐలుగా ఎంపికయ్యారు. చుక్కాయిపల్లికి చెందిన వరప్రసాద్ జనరల్ కేటగిరిలో 172మార్కులు సాధించి సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. సింగోటంకు చెందిన ధర్మేష్, రా మాపురానికి చెందిన నాగరాజులు ఎస్ఐ పోస్టుకు ఎంపికైన ట్లు గ్రామస్తులు తెలిపారు. చుక్కాయిపల్లికి చెందిన వరప్రసాద్ వనపర్తి ఫైర్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ పోస్టుకు ఎంపిక కావడంతో గ్రామస్తులతో పాటు స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. ఉప్పునుంతల, న్యూస్లైన్ : ఉప్పునుంతలకు చెందిన అంతటిలోని ఓ అనే యువకుడు ఎస్ఐగా ఎంపికయ్యాడు. గత మార్చిలో రాజేష్గౌడ్ వీఆర్ఓగా ఎంపికవడంతో ప్రస్తుతం అచ్చంపేటలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇతను 10వ తరగతి వరకు ఉప్పునుంతల పాఠశాలలో చదివాడు. ఇంటర్ అచ్చంపేటలోని ప్రగతి కళాశాలలో, డిగ్రీ సీబీఎం కళాశాల కల్వకుర్తిలో, ఎంబీఏ హైదరాబాద్లోని టీకేఆర్ కళాశాలలో పూర్తిచేశాడు. 2012లో పట్టుదలతో సన్నద్దమై ఎస్ఐ ఎంపిక పరీక్ష రాసి ఎంపికయ్యాడు. దీంతో గ్రామస్తులు పలువురు రాజేష్గౌడ్ను అభినందించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఉప్పునుంతల పోలీస్స్టేషన్లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న సైదులు, వెంకటేష్లు కూడా ఎస్ఐకి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సైదులు వెల్దండ మండలం చంద్రాయణపల్లికి చెందిన వ్యక్తి కాగా, వెంకటేష్ మిడ్జిల్ మండలం రామిరెడ్డిపల్లి నివాసి. ఇరువురు యువకులు 2013లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ఇక్కడకు వచ్చారని ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 2014 బ్యాచ్లో ఇద్దరూ ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఎస్ఐ వారిని అభినందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement