-
జోరుగా గుంటూరు మిర్చి ఎగుమతులు..కోల్డ్ స్టోరేజీలు ఖాళీ
(బీవీ రాఘవరెడ్డి) కోవిడ్, బ్లాక్ థ్రిప్స్ తెగులు లాంటి అవరోధాలు ఎదురైనా గుంటూరు మిరప ఘాటు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లతో ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా ఏటా కనీసం 30 శాతం మిర్చి తర్వాత సీజన్ వరకు నిల్వ ఉంటుంది. కోల్డ్ స్టోరేజీల్లో మొత్తం నిల్వలు ముందుగానే ఖాళీ కావటం ఇటీవల ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత 2–3 ఏళ్లుగా ఎండుమిర్చి ధరలు బాగున్నాయి. క్వింటాల్ రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. క్వింటాల్కు రూ.8 వేల కంటే అధిక ధర లభిస్తే రైతన్నకు లాభాలు దక్కుతాయి. గత రెండేళ్లలో దాదాపు 40 శాతం మిరప తోటలు బ్లాక్ థ్రిప్స్ బారిన పడినప్పటికీ మిగిలిన పంటకు మంచి ధర రావటంతో రైతులు అప్పుల పాలు కాకుండా గట్టెక్కారు. వచ్చే సీజన్లోనూ డిమాండ్.. దేశవ్యాప్తంగా మిర్చి ఉత్పత్తి తగ్గుతుండగా డిమాండ్ మాత్రం భారీగా ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ ముగిసి హోటళ్లు తిరిగి ప్రారంభం కావటంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మిర్చికి గిరాకీ పెరిగింది. ఇప్పటికే క్వింటాల్ మిర్చి రూ.15,000–30,000 పలుకుతోంది. గత రెండు సీజన్లలో తేజ, బాడిగ రకం గరిష్టంగా రూ.30 వేలు ధర పలికాయి. మిర్చి పండించే కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా ప్రస్తుత సీజన్లో పంట విస్తీర్ణం 15–20 శాతం తగ్గిందని అధికార వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల ఆలస్యంగా విత్తడంతో పాటు వివిధ కారణాల వల్ల పంట రాక కనీసం 45–60 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రానున్న డిసెంబర్ సీజన్లో ఎగుమతులతో పాటు ధరలు 30 – 40 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. స్పైసెస్ పార్కుతో ఎగుమతులకు ఊపు గుంటూరు శివార్లలో ఏర్పాటైన స్పైసెస్ పార్కు గత మూడేళ్లుగా మిర్చి ఎగుమతులు పెరిగేందుకు ఎంతో దోహదం చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మైదవోలు–వంకాయలపాడు పరిధిలో సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను నెలకొల్పాలని 2007లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో స్పైసెస్ పార్కు మంజూరైంది. దేశవ్యాప్తంగా 60 శాతం మిరప పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్నందున పార్కు కోసం ప్రతిపాదనలు పంపి ఆమోదింపజేశారు. వెంటనే భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వెచ్చించాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 12 ఎకరాల్లో 23 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నాలుగు గోడౌన్లను నిర్మించింది. వీటికి 200 కేవీఏ సామర్థ్యం గల రెండు సోలార్ యూనిట్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు పార్కు స్థలంలో ప్లాట్లు అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు బోర్డు లీజుకు ఇస్తోంది. ఈ మేరకు 58 ప్లాట్లను సిద్ధం చేయగా 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. ఐటీసీతో సహా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న పలు ప్రముఖ సంస్థలు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో సొంత ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తున్నాయి. ఉత్తమ విధానాలపై శిక్షణ.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపు కోసం స్పైసెస్ పార్కులు ఏర్పాటయ్యాయి. వీటిలో ఉత్పత్తులను శుభ్రపరచడం, గ్రేడింగ్, గ్రైండింగ్, ప్యాకింగ్, నిల్వ చేసేందుకు గోడౌన్లు ఉంటాయి. పవర్ స్టేషన్లు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు, వేయింగ్ బ్రిడ్జిలు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నాణ్యతా నిర్ధారణకు ల్యాబ్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ కౌంటర్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు, గెస్ట్హౌస్ తదితరాలు అందుబాటులో ఉన్నాయి. స్పైసెస్ పార్కు తరఫున రైతులు, వ్యాపారులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, అధునాతన ప్రాసెసింగ్ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గించటం ద్వారా రైతులకు మంచి ధర అందించేలా తోడ్పాటు అందిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు పార్కులో అందుబాటులో ఉన్న సాధారణ ప్రాసెసింగ్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. తద్వారా నేరుగా ఎగుమతిదారులకు విక్రయించవచ్చు. మూడేళ్లుగా మంచి ధరలు 12 ఎకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేస్తున్నా. గత మూడేళ్లుగా ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎకరాకు 30–35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గత ఏడాది నల్ల పేను (బ్లాక్ థ్రిప్స్) తెగులు కారణంగా 15–20 క్వింటాళ్లకు మించలేదు. ఎకరా మిర్చి సాగుకు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుంది. డిసెంబరు చివరలో మొదటి కోత వస్తుంది. జనవరి చివరికి మూడు కోతలు పూర్తవుతాయి. ఈసారి దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లకు తగ్గదని భావిస్తున్నా. – బొడ్లపాటి రామిరెడ్డి, రైతు, చేజర్ల, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా ఆరోగ్యానికి మంచిదే ఔషధ గుణాలను కలిగి ఉండే మిర్చిని మితంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ప్రపంచంలో 400 రకాలకు పైగా మిరపకాయలున్నాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 16 శాతం మిరప కాయలున్నాయి. మిర్చి ఉత్పత్తిలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఘాటైన మిరప రకం గుంటూరు సన్నం–ఎస్4 విదేశాలకు ఎగుమతి అయ్యే మిరపలో దాదాపు 30 శాతం వాటా గుంటూరు మిర్చిదే. + ఇక్కడ పండే కాయ నాణ్యత బాగుండటంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. -
ఘాటైన మిర్చీలు తిన్నాడు.. ఆపై!
టొరంటో: సాధారణంగా మిర్చీలను తగిన మోతాదులో వాడటం వల్ల వంటకాలకు అదనపు రుచి చేకూరుతుంది. అదే మోతాదుకు మించి వాడితే నోరు మంటపుట్టడంతో పాటు అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి, మిర్చీలను వంటకాల్లో భాగంగా కాకుండా నేరుగా ఆరగించడమే వృత్తిగా ఎంచుకున్నాడు. అతను ఆరగించే మిర్చీలు నామమాత్రపు ఘాటు ఉండే సాదాసీదా మిర్చీలనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రపంచ నలుమూలల్లో లభ్యమయ్యే ఘాటైన మిర్చీలను పోటీపడి మరీ ఆరగిస్తుంటాడు. అతను ప్రపంచవ్యాప్తంగా జరిగే చిల్లీ ఈటింగ్ పోటీల్లో పాల్గొంటుంటాడు. కెనెడాకు చెందిన మైక్ జాక్ అనే వ్యక్తి ప్రపంచంలో అత్యంత ఘాటైన మిర్చీలుగా ప్రసిద్ధి చెందిన మూడు కరోలినా రీపర్ మిర్చీలను 10 సెకెన్లలోపు(9.72 సెకెన్ల) ఆరగించి 4 గిన్నీస్ ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నీస్ ప్రపంచ రికార్డుల ప్రతినిధులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, మైక్ గతంలో కూడా అనేక మిర్చీలు ఆరగించే పోటీల్లో పాల్గొని మూడు ప్రపంచ రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. అతను మున్ముందు ఎనిమిది కరోలినా రీపర్ మిర్చీలను తినడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని గిన్నీస్ రికార్డుల సంస్థ వెల్లడించింది. -
మిర్చి ‘ధర’హాసం
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా కష్టకాలంలోనూ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి వచ్చే సమయానికి కరోనా వైరస్ వ్యాప్తితో గుంటూరు మార్కెట్ యార్డు మూతపడి లావాలాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తాము పండించిన మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని 118 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు కోటి టిక్కీలకు పైగా సరుకు నిల్వ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అమ్మకాలు మొదలైన 60 లక్షల టిక్కీలను విక్రయించగలిగారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 40 లక్షలకు పైగా మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నాయి. (చదవండి: మిరపకాయలతో గుండెపోటుకు చెక్!) కలిసొచ్చిన ఎగుమతులు ►గత నెలతో పోలిస్తే ఈ నెలలో మిర్చి ధరలు క్వింటాకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మిర్చి పంట ఆలస్యం కావడంతో మన రాష్ట్రంలోని మిర్చికి డిమాండ్ పెరిగింది. ►దీనికి తోడు సింగపూర్, మలేషియా, థాయ్లాండ్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం మిర్చి రైతులకు కలిసొచ్చింది. ►గుంటూరు జిల్లాలో దాదాపు 1.95 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ►దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధరలు సైతం బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు ►కరోనా నేపథ్యంలో మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అనంతరం క్రయవిక్రయాలు మొదలైనా రోజుకు కేవలం 10 వేల టిక్కీల లోపు మాత్రమే అమ్ముడయ్యేవి. ►సొంత గ్రామాలకు వెళ్లిన కూలీలు తిరిగి రావడం, ధరలు సైతం పెరగడంతో మిర్చి క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. ►గుంటూరు మార్కెట్ యార్డులో ప్రస్తుతం రోజుకు సగటున 20 వేల టిక్కీల వరకు మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ►బయట కోల్డ్ స్టోరేజీల్లో సైతం రోజుకు 30 వేల టిక్కీల వ్యాపారం సాగుతోంది. రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. రైతులు పంటను విక్రయించుకోవడానికి వీలుగా అన్ని వసతుల్ని మార్కెట్ యార్డులో కల్పిస్తున్నాం. ధరలు సైతం స్థిరంగా ఉండి కొంత పెరగడంతో రైతులు సరుకును అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి, గుంటూరు (చదవండి: ఇదీ పౌష్టికాహార మెనూ..) -
మిరపకాయలతో గుండెపోటుకు చెక్!
న్యూఢిల్లీ : భోజనంలో వారానికి నాలుగుసార్లు మిరప కాయలు తింటే గుండె పోటు వచ్చే ప్రమాదం దాదాపు 40 శాతం తగ్గుతుందట. ఇటలీకి చెందిన పరిశోధకులు 23 వేల మంది వాలంటీర్లపై ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ అధ్యయనం జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. మిరపకాయల్లో ఉండే ‘యాంటి ఆక్సిడెంట్’ గుణం కలిగిన ‘క్యాప్సేసియన్’ పదార్థం వల్లనే గుండెకు రక్షణ కలుగుతోందని వారు తేల్చారు. ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన డైట్గా పరిగణిస్తున్న ‘మెడిటెరేనియన్ డైట్ (మధ్యస్థ డైట్)’ను ఎక్కువగా తీసుకొనే ఇటలీలోని మొలిస్ ప్రాంతానికి చెందిన ప్రజలపై ఈ పరిశోధనలు జరిపారు. ఆ ప్రాంతం ప్రజలు ఎక్కువగా కూరగాయలు, గింజ ధాన్యాలు, పండ్లు, చేపలు తీసుకొని తక్కువగా గుడ్లు, మాంసం తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న వారిపై పరిశోధనలు జరపడం వల్లనే తమకు మంచి ఫలితాలు లభించాయని పరిశోధకులు చెబుతున్నారు. 23 వేల మంది ఆహార అలవాట్లను పర్యవేక్షించగా ఎనిమిదేళ్ల కాలంలో 1236 మంది మరణించారని. వారిలో క్యాన్సర్ కారణంగా మూడొంతుల మంది మరణించగా, గుండె పోటు కారణంగా కూడా దాదాపు అంతే మంది మరణించారని పరిశోధకులు తెలిపారు. గుండెపోటుతో మరణించిన వారిలో మూడొంతుల మంది ఎప్పుడు మిరపకాయలు భోజనంలో తీసుకోలేదని, కేవలం 24 శాతం మంది మాత్రమే తీసుకున్నారని పరిశోధకులు తేల్చారు. చనిపోయిన వారి వయస్సు, వారి ఆహారపు అలవాట్లను పరిగణలోకి తీసుకొని అధ్యయనం జరపడం ద్వారా వారానికి నాలుగుసార్లు ఆహారంలో మిరపకాయలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తక్కువని వారు నిర్ధారించారు. ఈ అధ్యయనం వివరాలను ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలోజీ’ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. పర్చి మిరపకాయలు తినాలా, ఎర్రటి మిరప కాయలు తినాలా? వాటిని ఎలా తినాలో మాత్రం వారు అందులో వెల్లడించలేదు. ఇటలీ ప్రజలు వారికి అక్కడ దొరికే ఎర్రటి మిరప కాయలనే తింటారు. వారు వాటిని మసాలా దట్టించి కానీ, పలు రకాల సాస్లతోగానీ తింటారు. అలా వారానికి నాలుగు సార్లు తింటే చాలట. -
ఉల్లి రైతు కుటుంబాన్ని ఆదుకునేదెప్పుడు?
మూడేళ్లుగా పంటలు సక్రమంగా పండక, గిట్టు బాటు ధర లేక, పొలానికి పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో బోయ తలారి గిడ్డయ్య ఒకరు. అతనిది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ మండల పరిధిలోని దైవందిన్నె గ్రామం. గిడ్డయ్య(42) అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో రెండేళ్లు వరుసగా మిరప, ఉల్లి పంటల సాగు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పులపాయ్యాడు. దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పు తేలింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావటంతో కృంగిపోయాడు. ఆ నేపథ్యంలో 2018 ఆగస్టు 11న ఉల్లి పంట కోసి పొలంలో కుప్ప వేశాడు. ఉల్లికి ధర మరీ తక్కువగా ఉండటంతో కోసిన పంటను పొలంలోనే వదిలేసి నిర్వేదంతో గిడ్డయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య రామలక్ష్మి, కుమారులు చంద్రశేఖర్ నాయుడు(10 వ తరగతి), మల్లికార్జున(9వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణించటంతో చదువు మానేసి పొట్ట కూటి కోసం పనులకు వెళ్తున్నారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తుంటే, చిన్నకుమారుడు మల్లికార్జున తల్లికి తోడుగా పనికి వెళ్తున్నాడు. గిడ్డయ్య ఆత్మహత్య చేసుకొని ఆరు నెలలైనప్పటికీ అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. అప్పులిచ్చిన వారు డబ్బు కట్టమని గిడ్డయ్య భార్య, పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. పొలం అమ్మి అయినా అప్పులు తీర్చుదామనుకొని బేరం పెడితే.. కొనటానికి ఎవరూ ముందుకు రాలేదని రామలక్ష్మి వాపోయింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తమ కుటుంబం వీధిన పడినా ప్రభుత్వం కనికరించడం లేదని కళ్ల నీరు కుక్కుకుంటున్నదామె. ఎప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతోనే బతుకుతున్నామని తెలిపిందామె. – నాగరాజు సాక్షి, ఎమ్మిగనూరు రూరల్, కర్నూలు జిల్లా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement