breaking news
child protection committee
-
బాలికలతో బాడీ మాసాజ్.. టీవీ యాంకర్పై కేసు
సాక్షి, కృష్ణా : ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. దీనిలో భాగంగానే నగరంలోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. అయితే సెలవులు ముగిసినప్పటికీ.. బాలికలు చైల్డ్ కేర్కి తిరిగిరాకపోవడంతో సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం బాలికల మిస్సింగ్పై దర్యాప్తు చేయగా.. హైదరాబాద్లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల్ని కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇంటి పనితో పాటు బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు ఆ యాంకర్పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరంమని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లల్ని తన ఇంట్లో పనికి పెట్టుకుని.. వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీడబ్ల్యూసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అయ్యో ‘పాప’ం!
♦ నడిరోడ్డుపై ఎనిమిదేళ్ల పాప ♦ తన తల్లే వదిలి వెళ్లిందంటున్న బాలిక ♦ బాలికను బాలల పరిరక్షణ కమిటీకి అప్పగించిన పోలీసులు జవహర్నగర్: భారమైందో.. వదిలించుకోవాలనుకున్నారో... ఎందుకోగాని.. ఓ ఎనిమిదేళ్ల బాలికను నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. ఆ పాప రోడ్డుపై ఏడుస్తుండగా స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చెన్నాపురంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నాపురం చర్చి సమీపంలో సంధ్య (08) ఒంటరిగా ఏడుస్తుండగా స్ధానికులు గమనించి జవహర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సంధ్యను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తల్లిదండ్రుల వివరాలు అడిగారు. తల్లి లలిత, తండ్రి ప్రకాశ్ అని, తాము కూకట్పల్లిలో ఉంటున్నామని తెలిపింది. సంధ్య కూకట్పల్లిలోని ప్రతిభ పాఠశాలలో 3వ తరగతి చదువుతుంది. తన తల్లే తనను చెన్నాపురం చర్చ్ వద్ద వదిలిపెట్టి పోయిందని పాప చెప్పిందని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు పోలీసులు సోమవారం సాయంత్రం సంధ్యను బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు.