breaking news
Chaitanya Jonnalagadda
-
సిద్ధుకి వుమనైజర్ ప్రశ్న.. నేనెందుకు బాధపడతా: చైతన్య జొన్నల గడ్డ
‘తెలుసు కదా’ సినిమా ప్రెస్మీట్లో సిద్ధు జొన్నలగడ్డని ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఆ మధ్య వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమాల్లో మీ పాత్ర ఉన్నట్లుగా..బయట కూడా మీరు వుమనైజరా? అని సదరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై సిద్ధు కూడా స్పందించాడు ‘మైకు ఉంది కదా అలా మాట్లాడటం సరికాదు’ అంటూ ఘాటుగానే సమాధానం చెప్పాడు. తాజాగా ఈ ఇష్యూపై సిద్ధు జొన్నలగడ్డ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు.ఆయన కీలక పాత్రలో నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘మహిళా జర్నలిస్ట్ అడిగిన ఉమనైజర్ ప్రశ్నకు సంబంధించిన వీడియో చూశాను. దీనిపై నేను మాట్లాడనుకోలేదు. ఎందుకంటే నా తమ్ముడు వుమనైజర్ కాదన్న సంగతి నాతో పాటు అందరికి తెలిసిందే. అలాంటప్పుడు ఎందుకు బాధపడతాం. ఒకవేళ నా తమ్ముడు నిజంగానే వుమనైజర్ అయి..ఇప్పుడు బయటపడితే బాధపడేవాళ్లం. అంతేకానీ ఆమె అడిగిందని బాధపడాల్సిన అవసరం లేదు. మా తమ్ముడు దీనిపై స్పందించాడు కానీ.. నేను అయితే అసలు రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. మా వాడికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. అపార్థం చేసుకునే అవకాశం ఉందని లెటర్ రాశాడు. అలా ఎందుకు రాశాడో కూడా నాకు వివరించాడు. కానీ మా వాడిని అలాంటి ప్రశ్న అడిగితే నేను ఎందుకు ఫీల్ అవుతా? మనం అలాంటివాళ్లం కాదని తెలిసిన తర్వాత బాధపడడం ఎందుకు?’ అని చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక ఇంట్లో సిద్ధుతో ఎలా ఉంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంది. పెద్దగా మాట్లాడుకోం. సినిమాల గురించి ఇంట్లో తక్కువగా మాట్లాడతాం. అసలు నేను అయితే సినిమాలే చూడను. ఈ మధ్యే సినిమాలు చూడడం స్టార్ట్ చేశా. సిధ్దు సినిమాలన్నీ చూస్తాను. కెరీర్ ప్రారంభంలో కొన్ని సలహాలు ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు’ అని చెప్పాడు. ఇద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారని అడిగిన ప్రశ్నకు.. ఒక నటుడిగా తనతో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తా కానీ..బ్రదర్స్ కదా..ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో సినిమా మాత్రం చేయలేం’ అని క్లారిటీ ఇచ్చేశాడు. -
అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా, చైతన్య జొన్నలగడ్డ కీ రోల్ చేసిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్లో సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. శనివారం చైతన్య జొన్నలగడ్డ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బబుల్గమ్, హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించాను కానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన వెంకన్న పాత్రకు, సినిమాకూ మంచి స్పందన లభిస్తుండటం హ్యాపీ. నేను లీడ్ రోల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా రావాల్సింది. ఆ సినిమా పనుల్లో ఉన్న నాకు దివ్యాంగుడు వెంకన్న రోల్ చేసే చాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పి, తన పేరు ఉపయోగించుకోవాలనుకోలేదు. ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే సిద్ధును మా సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ కు పిలవడం లేదు.‘రాజు వెడ్స్ రాంబాయి’లో నా నటనను మెచ్చుకుంటూ సిద్ధు మెసేజ్ చేశాడు. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. పవన్ డైరెక్షన్లోనే రాజశేఖర్గారు హీరోగా చేస్తున్న ‘మగాడు’ సినిమాలో నటించాను’’ అన్నారు. అవకాశం వస్తే సిద్ధుతో కలిసి నటిస్తా’ అని అన్నారు. .


