-
ఆర్థిక స్థితిగతులపై నివేదికలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలన్నీ తమ ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని ఏప్రిల్ 15లోగా పంపించాలని దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ఆర్థిక సంఘం ఆదేశించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా 15వ ఆర్థి క సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు. శుక్రవారం వారు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఆర్థిక సంఘం కార్యదర్శి అర్వింద్ మెహతా, ఆయన సతీమణితో సహా ఇతర అధికారులు ఈ బృందంలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సలహాదారు జీఆర్ రెడ్డి, పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంఘం సూచనల మేరకే నిధులు..: 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. సంఘం సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆర్థిక స్థితిగతులు, కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు, పన్నుల వాటా, స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు, తదితర నిధుల పంపిణీ అంశాలను అధ్యయనం చేస్తోంది. కాగా, రాష్ట్ర పర్యటనలో భాగంగా సంఘం ప్రతినిధులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. -
23న రాష్ట్రానికి కేంద్ర బృందం
నోట్ల రద్దు ప్రభావంపై అధ్యయనం - క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై ఆరా - వివిధ రంగాల వారీగా నష్టాన్ని నివేదించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థా రుులో వాస్తవ పరిస్థితులు, నోట్ల రద్దు ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర అధికారుల బృందం ఈనెల 23న రాష్ట్రానికి రానుంది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బృందం రెండు రోజులు పర్యటించనుంది. వివిధ శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ బృందంలో ఉంటారు. తెలంగాణలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎలా ఉందో అధ్యయనం చేస్తారు. బ్యాంకులు, ఏటీఎంలు ఎలా పనిచేస్తున్నాయి.. ప్రజలకు, ఖాతాదారులకు సత్వర సేవలందిస్తున్నాయా లేదా అనే దాన్ని క్షేత్రస్థారుులో పరిశీలిస్తారు. రైతులు, చిరు వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు, అసంఘటిత రంగాల వారిపై ఎలాంటి పరిణామాలున్నాయో అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రంలోని దాదాపు 85 శాతం ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకు బ్రాంచీల్లోనూ కరెన్సీ లేక డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రీ పగలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలలో నిరీక్షిస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం రాక ప్రాధాన్యం సంతరించుకుంది. నోట్ల రద్దు వల్ల వివిధ రంగాలపై తీవ్ర ప్రభావముం టుందని, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయే ప్రమాదముం దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వివిధ శాఖలు, రంగాల వారీగా ప్రభావాన్ని విశ్లేషించే నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర బృందానికి ఈ నివేదికను అందజేసి పరిస్థితు లను వివరించనుంది. ఈ మేరకు నివేదిక తయారు చేసేందుకు సమాచారం పంపించాలని సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది. నేడు వీడియో కాన్ఫరెన్స్ నోట్ల రద్దు నిర్ణయం అమలు తీరును తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్వహించే ఈ కాన్ఫరెన్సకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకుల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన నగదు మార్పిడి, బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన నగదు, ప్రజలు పడుతున్న అవస్థలపై చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 8వ తేదీ రాత్రి తెలంగాణలోని అన్ని బ్యాంకులకు రూ.8,000 కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించారుు. ఇప్పటివరకు రూ.6,000 కోట్ల నగదు మార్పిడి జరిగిందని, దాదాపు రూ.9,500 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల్లో జమ అరుునట్లు బ్యాంకర్లు అంచనాగా వెల్లడించారు. సరిపడేన్ని నోట్లు ఆర్బీఐ సరఫరా చేయటం లేదని, అందుకే ఖాతాదారులకు నిర్దేశించిన పరిమితికి లోబడిన డబ్బు కూడా ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement