-
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
కవాడిగూడ (హైదరాబాద్): ఎస్సీవర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం ఎంఆర్పీఎస్ (టీఎస్) ఆధ్వర్యంలో ఆర్థిక, రాజకీయ రంగాలలో మాదిగలకు సమానవాటా కోసం డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద cను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామని, 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేసి, మాదిగ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖలోని శానిటేషన్, డైట్ విభాగాలలో దళితులకే కాంట్రాక్ట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్(టీఎస్) జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సువర్ణరాజు, మాదిగ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, ఎంఆర్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో అవార్డ్స్ 2023 విన్నర్స్ జాబితా - పూర్తి వివరాలు
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడో ఎడిషన్ విజేతల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఆటోమొబైల్ నిపుణులు, పరిశ్రమ నాయకులు, ఉన్నతాధికారులు, ఆటోమోటివ్ తయారీదారుల సమక్షంలో అవార్డుల ప్రధానం జరిగింది. ఫోర్ వీలర్, టూ వీలర్ విభాగాల్లో జరిగిన నామినేషన్స్లో అవార్డులు సొంతం చేసుకున్న వాహనాల జాబితా ఇక్కడ చూడవచ్చు 👉బడ్జెట్ మోటార్సైకిల్ ఆఫ్ ది ఇయర్ - హోండా షైన్ 100 👉ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ - అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 👉స్కూటర్ ఆఫ్ ది ఇయర్ - హీరో జూమ్ 👉ప్రీమియం మోటార్సైకిల్ ఆఫ్ ది ఇయర్ - కేటీఎమ్ డ్యూక్ 390 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - టీవీఎస్ మోటార్ కంపెనీ ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! 👉ఫేస్లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ (మాస్ మార్కెట్) - టాటా నెక్సన్ 👉డిజైన్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ వెర్నా 👉ఎస్యూవీ ఆఫ్ ది ఇయర్ - మారుతి సుజుకి జిమ్నీ 👉ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉హై-టెక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ మోటార్ ఇండియా 👉మోస్ట్ ప్రామిసింగ్ కార్ ఆఫ్ ది ఇయర్ - ఎంజీ కామెట్ -
ఈ–వాహనాలకు ‘ఇంటి’ చార్జీలే..
సాక్షి, హైదరాబాద్ : ఇళ్ల వద్ద ప్రజలు సొంత ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు గృహ కేటగిరీ విద్యుత్ చార్జీలనే వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లకు మాత్రం ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఖరారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ టారిఫ్ను వర్తింపజేయాలని కోరింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల వద్ద చార్జింగ్ సదుపాయం పొందే వారు విద్యుత్ చార్జీలతో పాటు సర్వీసు చార్జీలు సైతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. సర్వీసు చార్జీలను ఈఆర్సీ/రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 40 లక్షలకు పైగా జనాభా గల హైద రాబాద్ వంటి మహానగరాలు, వాటికి అనుబంధంగా ఉన్న రహదారుల వద్ద ఏడాది నుం చి మూడేళ్లలోగా ప్రైవేటు చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఈ–వాహనాల చార్జింగ్ మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. గృహాలు/కార్యాలయాల వద్ద ప్రైవేటు చార్జింగ్ను అనుమతించాలి. డిస్కంలు ఆ మేరకు సదుపాయాలు కల్పించాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్)ల ఏర్పాటుకు ఈఆర్సీ నుంచి లైసెన్సు పొందాల్సి న అవసరం లేదు. ఏ వ్యక్తి/సంస్థ అయి నా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), కేంద్ర విద్యుత్ మం త్రిత్వ శాఖ జారీ చేసిన/జారీ చేసే మార్గదర్శకాలు, సాంకేతిక, భద్రత, నిర్వహణ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ నెలకొల్పాలనుకునే వ్యక్తులు విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. డిస్కంలు ప్రాధాన్యతనిచ్చి కనెక్షన్ జారీ చేయాలి. ఏదైనా చార్జింగ్ స్టేషన్/చైన్ ఆఫ్ చార్జింగ్ స్టేషన్లు నేరుగా ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుదుత్పత్తి కంపెనీ నుంచి విద్యుత్ను పొందొచ్చు. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్కు ఉండాల్సిన కనీస సదుపాయాలు సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ 33/11 కేవీ లైన్/కేబుల్స్, అనుబంధ పరికరాలు ఆన్లైన్లో చార్జింగ్ స్లాట్ల బుకింగ్ సదుపాయం కల్పించేందుకు కనీసం ఒక ఆన్లైన్ నెట్వర్క్ సర్వీసు ప్రొౖవైడర్తో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. చార్జింగ్ స్టేషన్ల లొకేషన్, చార్జర్ల రకాలు, సంఖ్య, లభ్యత, చార్జీల వివరాలను వాహనదారులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. సరైన సివిల్స్ వర్క్స్, సరైన కేబులింగ్/ఎలక్ట్రికల్ వర్క్స్ వాహనాల రాకపోకలతో పాటు చార్జింగ్కు సరిపడా స్థలం హౌసింగ్ సొసైటీలు, మాల్స్, కార్యాలయ సముదాయాలు, రెస్టారెంట్లు, హోటళ్ల తదితర ప్రాంతాల వద్ద చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సందర్శకుల వాహనాల చార్జింగ్కు అనుమతించొచ్చు. -
వివిధ కేటగిరీల్లో టాప్ 15ర్యాంకులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ సచివాలయ ఫలితాలలో వివిధ కేటగిరీల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ) మొదటి 15 ర్యాంకులు పొందిన విద్యార్థుల సంఖ్యను విడుదల చేశారు. ఈ సందర్భంగా మొత్తం 18 విభాగాల్లో ఇవి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విభాగం బీసీలు ఎస్సీలు ఎస్టీలు 1 ఉమెన్ పోలీస్ 36 1 0 2 యానిమల్ హస్బండరీ అసిస్టెంట్ 20 7 0 3 వార్డ్ హెల్త్ సెక్రటరీ 32 10 1 4 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 21 0 0 5 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 23 2 0 6 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 24 0 0 7 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 25 1 0 8 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 18 8 1 9 విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ 22 3 2 10 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 61 1 1 11 విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ 34 8 2 12 విలేజ్ సర్వెయర్ గ్రేడ్ 3 69 1 1 13 వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 23 2 0 14 వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 22 0 0 15 వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ 26 1 0 16 వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యూలేషన్ సెక్రటరీ 19 0 0 17 వార్డ్ సానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 26 3 0 18 వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 3 24 3 0 -
కాంగ్రెస్లో సమన్వయం కుదిరేనా..!
సాక్షి, ఆదిలాబాద్: ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల మధ్య సమన్వయానికి పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని నిలువరించాలంటే ముందుగా పార్టీలో ఐక్యత ముఖ్యమని భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ దిశగా ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల తెలంగాణకు ఇన్చార్జీలుగా నియమితులైన ముగ్గురిలో ఒకరైన ఏఐసీసీ కార్యదర్శి, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యనిర్వాహకులతో సమావేశం కానున్నారు. దీంతో ఆ పార్టీ వ్యవహారాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏకతాటిపైకి సాధ్యమేనా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జిల్లాలో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో పరిణామాలు జిల్లా రాజకీయాల్లోనూ వర్గపోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్రెడ్డి నియోజకవర్గాల్లో తన పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు తన ప్రాబల్యాన్ని చాటేందుకు యత్నాలు చేస్తున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ మూడు ముక్కలైంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి ఒక గ్రూపుగా, టీపీసీసీ కార్యదర్శి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మరో గ్రూపుగా, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి భార్గవ్దేశ్పాండే ఇంకో గ్రూపు కొనసాగిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. బోథ్లో సోయం బాపురావు, అనిల్జాదవ్లు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి నడిచింది లేదు. మరోవైపు ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపురావు వచ్చే ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా.. లేనిపక్షంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నరేష్జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఆయన ఎంపీ స్థానానికే పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి వర్గంలో కొనసాగుతున్న ఆయన సీనియర్ నాయకుల అండదండలు ఉంటాయన్న విశ్వాసంతో కదులుతున్నారు. నిర్మల్లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ముథోల్ నియోజకవర్గంలో అన్నదమ్ముళ్లు నారాయణరావుపటేల్, రామారావు పటేల్ల మధ్య గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి. సీనియర్ నాయకులైన నారాయణరావు పటేల్ మరోసారి ఇక్కడినుంచి బరిలో దిగుతారా, లేనిపక్షంలో మహేశ్వర్రెడ్డి వర్గంతో కొనసాగుతున్న రామారావు పటేల్ పైచేయి సాధిస్తారా అనేది రానున్న రోజుల్లో తేటతెల్లం కానుంది. ఖానాపూర్ నియోజకవర్గంలో భరత్ చౌహాన్, హరినాయక్ల మధ్య వైరుధ్యం ఉంది. ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాగజ్నగర్లో రావి శ్రీనివాస్, శ్రీనివాస్యాదవ్లు ఉండగా, మంచిర్యాలలో ప్రేమ్సాగర్రావు, అరవింద్రెడ్డిలు పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. చెన్నూర్లో బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవ్రావు, బెల్లంపల్లిలో చిలుమురి శంకర్, దుర్గాభవానిలు నియోజకవర్గంలో పట్టుకు యత్నాలు చేస్తున్నారు. పార్టీలో సందడి.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధానంగా ఇన్చార్జీలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల మనోగతం తెలుసుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లోనే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మన్ననల కోసం నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇటీవల టీపీసీసీలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే తీర్మానం కూడా చేసినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ద్వారా కొత్త జిల్లాలకు అధ్యక్షులను గుర్తించే విషయంలోనూ ఇన్చార్జీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. బైక్ ర్యాలీ.. ఆదిలాబాద్లో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న ఇన్చార్జీ శ్రీనివాసన్ కృష్ణన్, సబితా ఇంద్రారెడ్డిలకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ శివారు నుంచి వారిని సాదరంగా ఆహ్వానించి బైక్ ర్యాలీ ద్వారా జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉదయం 10గంటలకు ఆదిలాబాద్లోని పంచవటి హోటల్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement