breaking news
capable
-
కెపాసిటీ ఉన్న వారికి మధ్యంతర భరణం ఎందుకు : ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
భార్యాభర్తల విభేదాలు, మధ్యంతర భరణం విషయంలోఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామర్థ్యం ఉన్న మహిళలు మధ్యంతర భరణం కోరకూడదంటూ భర్త నుండి తాత్కాలిక భరణం నిరాకరించిన చర్చకు తావిచ్చింది. సంపాదనా సామర్థ్యం ఉన్న అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుండి మధ్యంతర భరణం కోరకూడదని, పనిలేకుండా ఉండటానికి చట్టం ప్రోత్సహించదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ నిరుద్యోగిగా ఉన్న ఒక మహిళకు మధ్యంతర భరణం తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 [ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 (BNSS) సెక్షన్ 528] కింద మధ్యంతర భరణాన్ని నిరాకరించిన కుటుంబ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను జస్టిస్ చంద్ర ధరి సింగ్ తోసిపుచ్చారు.చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త మార్చి 19న జస్టిస్ చంద్ర ధరి సింగ్ మాట్లాడుతూ, CrPCలోని సెక్షన్ 125 (భార్యలు, పిల్లలు మరియు తల్లిదండ్రుల భరణం కోసం ఆర్డర్) జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి భార్యలు, పిల్లలు ,తల్లిదండ్రులకు రక్షణ కల్పించడానికి చట్టం ఉంది కానీ, ఈ పేరుతో వారు పనీ పాటా లేకుండా ఉండడాన్ని కోర్టు ఆమోదించదన్నారు. బాగా చదువుకున్న భార్య, చక్కటి ఉద్యోగంలో ఉన్న భర్త నుండి భరణం పొందడానికి మాత్రమే ఖాళీగా ఉండకూడదన్నారాయన. అంతేకాదు తన చదువుకు తగిన ఉద్యోగాన్ని వెదుక్కోవాలని పిటిషనర్కు సూచించింది. ప్రాథమిక అవసరాలకోసం భర్తలపై పూర్తిగా ఆధారడే, ఇతర చదువురాని మహిళల మాదిరిగా ఉండకూదని హితవు పలికింది.కేసు నేపథ్యంఈ కేసులోని జంట 2019 డిసెంబర్ 11 వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట త్వరలోనే విదేశాలకు మకాం మార్చారు. అయితే, వైవాహిక విభేదాలు కారణంగా రెండేళ్లకు (ఫిబ్రవరి 20, 2021) ఇండియాకు తిరిగి వచ్చేసింది.భర్త తనను క్రూరంగా హింసించాడని, జీవిత భాగస్వామి వీసా చేశాడని ఆరోపించింది. ఇంటికి తిరిగి రావడానికి తన నగలను అమ్మమని బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. తదనంతరం, ఆమె CrPC సెక్షన్ 125 కింద తాత్కాలిక ఉపశమనం కోసం దరఖాస్తుతో పాటు భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కుటుంబ న్యాయస్థానం మధ్యంతర భరణం పిటిషన్ను 2022 నవంబరులో తిరస్కరించింది.దీనిపై దాఖలైన రివిజన్ పిటిషన్ను దాఖలు చేసింది. చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!పెళ్లికి ముందు కూడా తాను ఆర్థికంగా స్వతంత్రంగా లేనదిభార్య వాదన. భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి నిరుద్యోగిగా ఉన్నాననీ, భర్త నెలకు రూ. సుమారు 27.22 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి నెలకు రూ.3.25 లక్షలు భరణం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే తన భార్య ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ వ్యాపారంలో మాస్టర్స్ పట్టా పొందింది. గతంలో టాప్ కంపెనీలో పనిచేసింది. సొంత కృత్రిమ ఆభరణాల వ్యాపారాన్ని నడిపింది. పైగా ప్రస్తుతం తాను ఉద్యోగం లేదు. కనుక అంత భరణం చెల్లించ లేనని భర్త వాదన -
మోస్ట్ ఎవైటెడ్ బైక్ వచ్చేసింది, ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: ప్రీమియం ద్విచక్ర వాహనాల సంస్థ కేటీఎం సోమవారం 2022 కేటీఎం ఆర్సీ 390 మోటర్సైకిల్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 3,13,922 (ఎక్స్ షోరూం ఢిల్లీ). వీటి తమ షోరూమ్లలో బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ వివరించింది. 2014 నుంచి ఆర్సీ 390 అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ స్పోర్ట్స్ మోడల్స్లో ఒకటి. అవుట్గోయింగ్ మోడల్లో పోలిస్తే ఈ కొత్త-తరం ఆర్సీ 390 బైక్లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, సూపర్మోటో మోడ్తో కూడిన డ్యూయల్-ఛానల్ ABS ,పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్, టీఎఫ్టీ మల్టీకలర్ డిస్ప్లే సహా ఇతర ఎలక్ట్రానిక్ అప్గ్రేడ్లతో వస్తుంది. అలాగే క్విక్షిఫ్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. లేటెస్ట్ మోడల్లో అధునాతన 373 సీసీ ఇంజిన్, 13.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. 4వాల్వ్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్తో వస్తుంది. ఇది 42.9బీహెచ్పీ గరిష్ట శక్తిని, 37ఎన్ఎం వద్దగరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ను పొందుపర్చారు. రేసింగ్ బ్లూ , ఆరెంజ్ రెండు రంగుల్లో లభ్యం. -
ఎన్నికలు సమర్థంగా నిర్వహించాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సార్వత్రికం సహా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు ప్రతిష్టను పెంచినట్టు డీజీపీ ప్రసాదరావు చెప్పారు. ఇందుకు కిందిస్థాయి కానిస్టేబుల్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు చేసిన సమష్టి కృషే కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో ఆదివారం జరిగిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ప్రసాదరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీలు మొదలుకుని సీనియర్ ఐపీఎస్ వరకు వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికలు, మధ్యలో ఇతర ఉద్యమాలు, పండుగలకు పోలీసులు అలుపెరగకుండా కష్టపడి బందోబస్తు నిర్వహించారని కొనియాడారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులతో పోలీసు అధికారులు విరామం లేకుండా పనిచేశారన్నారు. గెట్ టుగెదర్లో రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్శర్మ, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ కౌముది, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం. మహేందర్రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ ఐపీఎస్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.