breaking news
BSP President
-
తమిళనాడు BSP చీఫ్ దారుణ హత్య
-
పేదరికం, నిరుద్యోగం పెంచారు
నిర్మల్: ఏళ్లపాటు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు పేదరికం, నిరుద్యోగాన్ని మరింత పెంచాయని, బహుజనుల అభివృద్ధి విస్మరించాయని బీఎస్పీ జాతీ య అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ను ఆయా పార్టీలు విస్మరించాయని విమర్శించారు. తప్పుడు ఆర్థిక విధానాలతో పేదరికం, నిరుద్యోగం పెరిగిందన్నారు. సామాన్యుడిని ఇబ్బంది పెట్టేలా డీజిల్, పెట్రోల్ ధరలను పెంచారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు అవినీతి పెరుగుతోందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని 2014 ముందు ఎన్నికల్లో నరేంద్రమోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా కుటుంబానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలోనూ ధన బలంతోనే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుజను ల బాగోగులను పట్టించుకోవడంలో విఫ లమయ్యాయని ధ్వజమెత్తారు. ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఘనత తమదేనన్నారు. మైనార్టీల స్థితిగతులపై సచార్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బడుగు, బలహీన, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలకూ రిజర్వేషన్లు పెంచేందుకు బీఎస్పీ పోరాడుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో నాలుగుసార్లు గెలుపొందిన బీఎస్పీ ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’సూత్రంతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీ ఒంటరిగా పోరాటం చేస్తుం దని చెప్పారు. ఈసారి తమకు రాష్ట్ర ప్రజ లు అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సభకు చుట్టూ పక్కల అన్ని నియోజకవర్గాల నుంచి బీఎస్పీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎన్నికల ప్రచారంలో మాయా బిజీ
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకున్నందున, బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం రాజధాని బాట పట్టారు. మొదటగా యమునావిహార్లో గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీకి హాజరై ప్రసంగించారు. ముజఫర్నగర్ అల్లర్ల నేపథ్యంలో ముస్లింలు ఈసారి కాంగ్రెస్కు బదులు తమకే ఓట్లు వేస్తారని ఢిల్లీ బీఎస్పీ నాయకులు విశ్వసిస్తున్నారు. అందుకే ముస్లిం జనాభా అధికంగా ఉండే యమునావిహార్లో మాయావతి ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో తమ పార్టీకి చక్కటి స్పందన వస్తోందని, తమ అధినేత్రి తదుపరి ఎన్నికల ర్యాలీ అశోక్ విహార్లో ఉంటుందని పార్టీ ఎన్నికల ప్రచార విభాగం ఇన్చార్జ్ ఎంఎల్ తోమర్ అన్నారు. ‘ముస్లింలు కాంగ్రెస్తో విసిగిపోయారు. వాళ్లు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. యూపీలో మేం అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం కాబట్టి ఢిల్లీలోనూ వారికి మేమే ప్రత్యామ్నాయంగా అవతరిస్తాం. షీలా దీక్షిత్ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదు. మాయావతి ఈ అంశాలపై దృష్టి సారిస్తారు’ అని తోమర్ వివరించారు. మాయావతి శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు అశోక్విహార్, తుగ్లకాబాద్, నజఫ్గఢ్, నరేలా, ఆర్కే పురం, త్రిలోక్పురి, ద్వారక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 2008 ఎన్నికల్లోనూ ఆమె ఢిల్లీలో త్రిలోక్పురి, సుల్తాన్పురి, అలీగావ్లో ప్రచారం చేసినప్పుడు అనూహ్య స్పందన వచ్చిందని బీఎస్పీ వర్గాలు తెలిపాయి. ఈసారి ఆమె ఏకంగా ఎనిమిది ర్యాలీల్లో పాల్గొంటున్నందున తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని తోమర్ ఆశాభావం వ్యక్తపరిచారు. సంప్రదాయ ఓటర్లయిన దళితులతోపాటు జాట్లు, ముస్లిం ఓట్లపై బీఎస్పీ కన్నేసింది. ఢిల్లీ రాజకీయాల్లో తాము మూడోశక్తిగా అవతరించామని, యూపీలో మాయావతి చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాల్సిందిగా తాము ఢిల్లీవాసులను కోరుతున్నామని తోమర్ అన్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ రెండు స్థానాలను గెలిచింది. ఈసారి తమ ఓట్ల సంఖ్య 14 నుంచి 25 శాతానికి పెరుగుతుందని ఢిల్లీ బీఎస్పీ అంచనా వేసింది. ద్రవ్వోల్బణం అదుపు, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా వంటి అంశాలను ఈపార్టీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది.