black mailer
-
బాబును మించిన బ్లాక్మెయిలర్ రేవంత్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, పురాణం సతీశ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగా ‘ఏపీ సీఎం చంద్రబాబు కంటే మించిన బ్లాక్ మెయిలర్ రేవంత్’ అంటూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, పురాణం సతీశ్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. విపక్షాలన్నీ కలసి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓ కేసులో కృష్ణ యాదవ్ పట్టుబడితే పదవి నుంచి తొలగించారని.. కానీ, ఓటుకు నోట్లు కేసులో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్రెడ్డిని మాత్రం చంద్రబాబు ఏకంగా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ను చేసేశారన్నారు. దీన్ని బట్టి చంద్రబాబును మించిన బ్లాక్మెయిలర్ రేవంత్రెడ్డి అని అర్థమవుతుందన్నారు. -
అశ్లీల చిత్రాల పేరుతో యువతికి బెదిరింపులు
అశ్లీల చిత్రాలు ఉన్నాయంటూ ఒక యువతిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సదరు యువకులను మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా మలికిపురానికి చెందిన కొందరు యువకులు సఖినేటిపల్లి మండలానికి చెందిన ఓ యువతిని.. తమ వద్ద ఆమె అశ్లీల చిత్రాలు ఉన్నాయని కొద్ది రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంతే కాకుండా..విషయం పొక్కకుండా ఉండాలంటే.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరువు పోతుందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకులకు రూ.పది లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలిసిన వారి కుటుంబపెద్దలు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించడంతో బ్లాక్మెయిలర్లను పట్టుకునేందుకు వలపన్నారు. మలికిపురం ఎస్సై విజయబాబు తన బృందంతో మూడు రోజులుగా ఈ యువకుల కదలికలపై నిఘా పెట్టారు. వారి ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. నగదు ఇస్తామని చెప్పించి, వారిని దిండి రప్పించి, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందనే అనుమానం ఉండటంతో రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను అమలాపురం డీఎస్పీ అంకయ్య ప్రశ్నించినట్టు తెలిసింది.