breaking news
birth and death
-
జననాలు 2.52 కోట్లు..మరణాలు 86.6 లక్షలు
దేశవ్యాప్తంగా 2023లో 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 2.32 లక్షలు తక్కువ. 2023లో 86.6 లక్షల మరణాలు నమోదయ్యాయి. మొత్తం జననాల్లో దాదాపు 75 శాతం ఆసుపత్రుల్లోనే జరగడం గమనార్హం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జన గణన కమిషనర్ కార్యాలయం 2023 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను ‘వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా’ పేరిట విడుదల చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కోవిడ్–19 డ్యాష్బోర్డ్లో 2025 మే 5 నాటికి మహమ్మారి వల్ల సంభవించిన మరణాల సంఖ్య 5,33,665గా ఉంది. 2022, 2023లో మరణాలలో పెద్దగా పెరుగుదల లేదని నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే 2021లో 21 లక్షలకు పైగా అధిక మరణాలు సంభవించాయి. 2020లో 81.2 లక్షలు, 2021లో 1.02 కోట్ల మంది కన్నుమూశారు. కొన్ని రాష్ట్రాలే..: నిర్ణీత కాలపరిమితి అయిన 21 రోజుల్లోపు 90% కంటే ఎక్కువ జననాల నమోదును 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే సాధించాయి. వీటిలో గుజరాత్, తమిళనాడు, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, గోవా, పంజాబ్ వంటివి ఉన్నాయి. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 80–90% జననాల నమోదు చేశాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో 50–80% జననాలు మాత్రమే నిర్ణీత కాలపరిమితి లోపు నమోదయ్యాయి.మగపిల్లలే ఎక్కువ2023 నమోదిత జనన గణాంకాలుజననాల్లో మగపిల్లలు 52.4%, ఆడపిల్లలు 47.6%పట్టణాల్లో 58.3%, గ్రామీణ ప్రాంతాల్లో 41.7% మంది పుట్టారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జననాల నమోదు ప్రక్రియను 100% పూర్తి చేశాయి.మరణాల్లో పురుషులే అధికంమరణాల్లో 60.6% పురుషులు, 39.4% స్త్రీలు ఉన్నారు.మరణాల్లో గ్రామీణులు 57.7%, పట్టణవాసులు 42.3% ఉన్నారు.ఆసుపత్రుల్లో మృతి చెందినవారు (సిక్కిం మినహా) 24%శిశువుల మరణాల్లో పట్టణాల వాటా 85.7%, గ్రామీణ ప్రాంతాల వాటా 14.3%. విదేశాల్లో జననాలు, మరణాలుప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఉంటున్న భారతీయులకు 2023లో మొత్తం 62,182 మంది జన్మించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, యూకే, ఖతార్లలోనే పుట్టడం విశేషం. విదేశాల్లోని భారతీయుల్లో 10,531 మంది మరణించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్లలోనే సంభవించాయి.అత్యధిక శిశు మరణాలు..: 2023లో అత్యధిక శిశు మరణాలు సంభవించిన రాష్ట్రాలు.. మహారాష్ట్ర (17,436), గుజరాత్ (13,676), హరియాణా (11,622). ఏపీలో 6,852, తెలంగాణలో 3,956 సంభవించాయి. -
మహామేధావికి రెండు జననమరణాలు!
ఐజాక్ న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళశాస్త్రాల్లో మహనీయునిగా పేరొందారు. ఆయన ప్రపంచానికి అందించిన పలు ఆవిష్కరణలు కొత్తదారులను చూపాయి. న్యూటన్ జననమరణాలకు సంబంధించిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తాయి.బహుముఖ ప్రజ్ఞాశీలిగా..ఐజాక్ న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. యాపిల్ కిందనే పడటానికి న్యూటన్ చెప్పిన కారణం, ఆయన అందించిన చలన నియమాల గురించి చాలా మందికి తెలుసు. కానీ న్యూటన్ ప్రపంచానికి అనేక ఇతర ఆవిష్కరణలను కూడా అందించారు. గణిత శాస్త్రజ్ఞునిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా న్యూటన్ ప్రపంచానికి సుపరిచితమే. న్యూటన్ అందించిన ఆవిష్కరణలు కొన్నిరంగాల్లో సమూల మార్పులను తీసుకువచ్చాయి.రెండు పుట్టినరోజులున్యూటన్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, అతనికి రెండు పుట్టినరోజులున్నాయి. న్యూటన్ జీవించివున్న కాలంలో వినియోగంలో ఉన్న క్యాలెండర్ల కారణంగా అతని పుట్టిన తేదీలలో పది రోజుల వ్యత్యాసం కనిపిస్తుంది. న్యూటన్ పుట్టినరోజు జనవరి 4 అని కొందరు పరిణిస్తుండగా, డిసెంబర్ 25న అతని పుట్టినరోజును జరుపుకునేవారున్నారు. నిజానికి న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్లో జరుపుకున్నారు. అయితే ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4న చేసుకుంటారు.అధికారిక జన్మదినంన్యూటన్ ఇంగ్లాండ్లోని వూల్స్టోర్ప్లోని మనోర్ హౌస్లో జన్మించారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్ను ఇంగ్లాండ్లో ఉపయోగించేవారు. ఇది యూరప్కు భిన్నంగా ఉండేది. దీని ప్రకారం చూస్తే న్యూటన్ 1642, డిసెంబర్ 25న జన్మించారు. అయితే అదే కాలంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్కు ఆమోదం లభించింది. ఇదే నేడు అందరూ ఉపయోగిస్తున్న క్యాలెండర్. దీని ప్రకారం చూసుకుంటే న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. ఇదే తరువాతి కాలంలో న్యూటన్ అధికారిక పుట్టిన తేదీగా పరిగణించారు.కెమిస్ట్రీలో అమితమైన ఆసక్తిగురుత్వాకర్షణ భావన న్యూటన్ సిద్ధాంతానికి ముందే ఉన్నప్పటికీ, న్యూటన్ అందించిన సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపధ్యంలో న్యూటన్ సైన్స్లో కొత్త శకాన్ని ప్రారంభించారని అంటారు. ఆయన కాలిక్యులస్ని కనిపెట్టడం ద్వారా గణితానికి కొత్త శాఖను అందించారు. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ను తయారు చేసిన మహనీయునిగానూ న్యూటన్ పేరొందారు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది అయిన ప్రిజం ద్వారా తెల్లని కాంతితో కూడిన రంగుల వర్ణపటాన్ని మొదటిసారి న్యూటన్ ప్రపంచానికి చూపించారు. న్యూటన్కు కెమిస్ట్రీలో ఎంతో ఆసక్తి ఉంది. ఆయన రసాయన శాస్త్రంపై పలు రచనలను సాగించారు. రచయితగానూ పేరొందారు.ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలుజూలియన్ క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారం న్యూటన్ 1727, మార్చి 20న మరణించారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే ఏడాది మార్చి 31న న్యూటన్ కన్నుమూశారు. న్యూటన్ నిద్రలో మరణించారని చెబుతారు. అతని మరణం తరువాత అతని శరీరంలో పెద్దమొత్తంలో పాదరసం కనుగొన్నారని అంటారు. న్యూటన్ తన జీవితంలోని తుదిదశలో మానసిక ఆరోగ్యంతో బాధపడ్డారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు. చుట్టుపక్కలవారిని కలుసుకోవడం మానేశారు. న్యూటన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగాయి.ఇది కూడా చదవండి: టెన్త్ అర్హతతో 10 మెడికల్ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం -
ఒకేరోజు జననం.. ఒకేరోజు మరణం
సాక్షి, ఉమ్మడి వరంగల్: వారిద్దరూ ఒకే రోజు జన్మించారు. బంధుత్వంలో ఆప్యాయంగా మెలిగారు. అయితే వారి మరణం కూడా ఒకేరోజు జరగడం విధి విచిత్రం. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట, మరొకరు మృతి చెందారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ (85) కుమార్తె అచ్చమ్మను, ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ (85) కుమారుడైన యాకయ్యకు ఇచ్చి వివాహం చేశారు. మల్లమ్మ, యాకమ్మ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండడం విశేషం. బంధుత్వంలో వారిద్దరూ అప్యాయంగా ఉండేవారు. శనివారం తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాకమ్మ, మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా మల్లమ్మ, యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు -
జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి
అనంతపురం మెడికల్ : జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీటింగ్ హాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాల్లో తేడాలు లేకుండా చూడాలన్నారు. ఆధార్ నంబర్ తీసుకుని పేర్లు సరిచూసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన వారందరికీ ఆధార్తో పాటు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాలు కూడా నమోదు చేయాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఎస్ఓ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ కార్యాలయ ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


