breaking news
bikes robber
-
ఘరానా మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
సాక్షి, తిరుపతి క్రైం: నగరంలో కొంతకాలంగా తాళాలు వేసిన మోటార్ సైకిళ్లను దొంగలిస్తున్న∙ఘరానా దొంగను ఈస్టు పోలీసులు అరెస్టు చేశారు. క్రైం ఏఎస్పీ వెంకటేశ్నాయక్ కథనం.. శుక్రవా రం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎంఆర్ సర్కిల్ వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా రికార్డులు పరిశీలించారు. అయితే ఆ వాహనానికి సంబంధించి సరై న ఆధారాలు లేకపోవడంతో ఈస్టు డీఎ స్పీ నాగేశ్వరరావు, సీఐ చంద్రబాబు నా యుడు, ఎస్ఐ జయచంద్ర అతడిని విచా రణ చేశారు. అతడి పేరు నరసింహులని, పీలేరుకు చెందిన అతడు పెయింటర్గా పనిచేస్తూ తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రేణిగుంట రైల్వేస్టేషన్, పీలేరు టౌన్లో మోటార్ సైకిళ్లను దొంగలించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతనిపై ఈస్టు పోలీసుస్టేషన్లో 11, రేణిగుంటలో ఒక కేసు, పీలేరులో 13 కేసులు ఉన్నాయి. ఇత ని నుంచి రూ.11లక్షల విలువ చేసే 24 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతడు హీరో హోండా మోటార్ సైకిళ్లనే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడేవాడని వెల్లడైంది. మోటార్ సైక్లిస్టులు ముందు చక్రానికి వీల్లాక్ వేసుకోవాలని డీఎస్పీ సూచించారు. -
పార్క్ చేసి ఉన్న బైక్సే టార్గెట్
-16 ద్విచక్రవాహనాలు స్వాధీనం వరంగల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షలు విలువ చేసే 16 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పట్టణానికి చెందిన విజయ్ చదువు మానేసి చోరీల బాట పట్టాడు. పార్క్ చేసి ఉన్న బైక్లను టార్గేట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు విజయ్ను శనివారం అరెస్ట్ చేశారు.