-
బ్యాంగ్ బ్యాంగ్
భూమిక చివరిసారిగా తెలుగు స్క్రీన్పై కనిపించింది ఎప్పుడు? ఓ మూడేళ్లు అయ్యుంటుంది. ఈ ఏడాది ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి)తో తెలుగుకి మళ్లీ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె హీరో నానికి వదినగా నటించి, మంచి మార్కులే కొట్టేశారు. కమ్బ్యాక్ అంటే.. ఇలా బ్యాంగ్ బ్యాంగ్గా ఉండాలన్నట్టు ఈ చిత్రంలో భూమిక మెప్పించారు. నెక్ట్స్ ఏంటి? మళ్లీ కనిపిస్తారా? గ్యాప్ తీసుకుంటారా? అంటే.. చాన్సే లేదు. ఇక వరుసగా సినిమాలు చేసేలా ఉన్నారు. ఎందుకంటే, ‘ఎంసీఏ’ ఇలా రిలీజైందో లేదో భూమిక మరో సినిమాతో బిజీ అయ్యారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు భూమిక. దీన్నిబట్టి చూస్తుంటే ఈ బ్యూటీ తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారనిపిస్తోంది. సో.. భూమిక యూత్ హీరోలందరికీ అక్క, వదినగా, అవి కాకపోతే కథ డిమాండ్ని బట్టి కథానాయికగా కూడా కనిపించే అవకాశం ఉంది. -
ధోని జీవిత కథతో భూమిక రీఎంట్రీ
తమిళసినిమా: ప్రముఖ క్రికెటర్ ధోని జీవిత ఇతివృత్తంతో తెరకెక్కనున్న హిందీ చిత్రం ద్వారా నటి భూమిక రీఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాది భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందిన నటి భూమిక. తమిళంలో రోజాకూట్టం చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత సూర్య సరసన చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంతో పాటు కొన్ని చిత్రాలు చేసి ప్రాచుర్యం పొందారు. తెలుగులోనూ సింహాద్రి, మిస్సమ్మ తదితర పలు చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. నటిగా మంచి ఫామ్లో ఉండగానే యోగా మాస్టర్ భరత్ఠాగూర్ ప్రేమలో పడి 2007లో ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్తను నిర్మాతగా చేసి తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం భూమికను తీవ్ర నష్టాలకు గురి చేయడంతో భర్తతో మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఆ మధ్య భరత్ఠాగూర్ నుంచి విడిపోయినట్లు తన ట్విట్టర్లో పేర్కొన్న భూమిక ఆ వెంటనే దాన్ని ఖండిస్తూ వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న భూమిక ఇప్పుడు ధోని జీవిత కథా చిత్రంతో రీఎంట్రీ కానున్నారు. దీని గురించి భూమిక తెలుపుతూ తాను 2007లో గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో నటించానని గుర్తు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదని మళ్లీ ఇన్నాళ్లకు క్రికెటర్ ధోని జీవిత కథతో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. నీరజ్పాండే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ఇప్పుడు చెప్పలేనన్నారు. అయితే చాలా ముఖ్యపాత్ర అని మాత్రం చెప్పగలనని అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement