-
ఆత్మకు లేదు శాంతి
రాజస్తాన్లోని జోద్పూర్, ఆ చుట్టుపక్కల పరిసరాలను కలిపి ‘మర్వార్’ అంటారు. మర్వార్ అంటే ‘ఎడారి ప్రాంతం’ అని అర్థం. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఓట్ల పంట పండించుకునేందుకు రెండు కుటుంబాల వారు ప్రయత్నిస్తున్నారు. రాజస్తాన్లో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా జో«ద్పూర్ డివిజన్లోని ఓసియాన్ స్థానానికి దివ్య మదెర్నా, లూనీ స్థానానికి మహేంద్ర బిష్ణోయ్ పోటీ చేస్తున్నారు. దివ్య.. మహిపాల్ మదెర్నా కూతురు. మహేంద్ర.. మల్ఖాన్ బిష్ణోయ్ కుమారుడు. ఆ అమ్మాయి తండ్రి, ఈ అబ్బాయి తండ్రి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఒక సెక్సు కుంభకోణంలో ఏడేళ్ల క్రితం జో«ద్పూర్ డివిజన్లో జరిగిన భన్వారీ దేవి అనే నర్సు కిడ్నాప్–హత్య కేసులో వీళ్లిద్దరూ.. విచారణకు పెద్దగా సమయం పట్టకుండానే.. దోషులుగా నిర్ధారణ అయి, ఆరేళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. భన్వారీ హత్య జరిగే నాటికి మహిపాల్.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి. మల్ఖాన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్లు జైల్లో ఉండగానే 2013 ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు 2018 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ తమ స్థానాలలో తమ వారసులకే టికెట్లు లభించేలా జైలు నుంచే వీళ్లు మంతనాలు జరపగలిగారు. ‘‘మా నాన్నను కుట్ర పన్ని ఇరికించారు. ఆయన నా దగ్గర లేకపోవడం నా జీవితంలో పెద్ద లోటు. ఈ ఎన్నికల్లో గెలిచి ఆయన పరువు నిలబెడతాను’ అని మహిపాల్ కూతురు దివ్య అంటోంది. మహిపాల్ను అరెస్ట్ చేసినప్పుడు జాట్ కులస్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. మల్ఖాన్ అరెస్టు సమయంలో బిష్ణోయ్లు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఈ రెండు కులస్థులదీ ఓ మోస్తరు ఓటు బ్యాంకు. ఆ వోటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్న క్రమంలోనే ఇప్పుడూ ఆ రెండు కుటుంబాల్లోని పిల్లలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. 2013 ఎన్నికల్లో మహిపాల్ భార్య లీల, మల్ఖాన్ తల్లి ఆమ్రీదేవి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆశించిన విధంగా సానుభూతి దక్కకపోవడంతో ఇద్దరూ ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో నిలబడిన దివ్యదీ, మహేంద్రదీ సుసంపన్నమైన అనువంశిక రాజకీయ వారసత్వం. దివ్య తాతగారు పరాశ్రమ్ మదెర్నా తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్కి ఆయన శక్తిమంతమైన జాట్ అభ్యర్థి. దివ్య తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా, కొంతకాలం మంత్రిగా ఉన్నారు. దివ్య తల్లి లీల కాంగ్రెస్లో క్రియాశీల కార్యకర్త. మహేంద్ర బిష్ణోయ్ తాతగారు రామ్సింగ్ బిష్ణోయ్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మహేంద్ర తండ్రి మల్ఖాన్ జైలుకు వెళ్లబోయేముందు వరకు కూడా ఎమ్మెల్యే. ‘‘నా తండ్రి కోసమైనా నేను ఈ ఎన్నికల్లో గెలిచితీరుతాను’’ అని మహేంద్ర అంటున్నాడు. అయితే భన్వారీ ‘ఆత్మ’ ఘోష వీళ్లను గెలవనివ్వదన్న ప్రచారం జోద్పూర్ డివిజన్లో జరుగుతోంది. భన్వారీ కిడ్నాప్ – హత్య కేసు 2011 సెప్టెంబర్ 1న భన్వారీదేవి అదృశ్యం అయ్యే నాటికి ఆమె వయసు 36 ఏళ్లు. జోద్పూర్ జిల్లాలోని జలివాడ ఉప ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్నారు. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. రూపవతి అయిన భన్వారీకి అధికార కాంగ్రెస్ పార్టీలోని రాజకీయనాయకులతో సన్నిహిత పరిచయాలున్నాయి. ఆ పలుకుబడితో రెండేళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి ఆమె నిరాశకు గురై, తనని నమ్మిన రాజకీయ నాయకుల్ని బ్లాక్మెయిల్ చెయ్యడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఓ సెక్సు కుంభకోణానికి సాక్షిగా మారారు. అది ఆమె కిడ్నాప్కు, హత్యకు దారి తీసింది. ఇందుకు కుట్ర పన్నారన్న నేరారోపణ నిజం కావడంతో మహిపాల్ మదెర్నా, మల్ఖాన్ బిష్ణోయ్లకు జైలు శిక్ష పడింది. -
భన్వరీ దేవి హత్య కేసులో కీలక అరెస్ట్
జోథ్పూర్: సంచలనం సృష్టించిన దళిత నర్సు భన్వరీ దేవి అపహరణ, హత్య కేసులో సహ నిందితురాలు ఇందిరా బిష్ణోయ్ను రాజస్తాన్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్కాన్ బిష్ణోయ్ సోదరి అయిన ఇందిరను మధ్యప్రదేశ్లోని దేవాస్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను జోధ్పూర్లో సీబీఐ అధికారులకు అప్పగించారు. ఇందిరా బిష్ణోయ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో రాజస్తాన్ ఏటీఎస్ ప్రకటించింది. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నిందితులుగా ఉన్న ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అసలేం జరిగింది 36 ఏళ్ల భన్వరీ దేవి 2011, సెప్టెంబర్ 1న జోథ్పూర్లోని బిలారా ఏరియా నుంచి అపహరణకు గురైంది. ఆమె భర్త అమరచంద్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. భన్వరీ దేవిని హత్యచేసి జలోదాలో తగులబెట్టినట్టు వెల్లడైంది. ఆనవాళ్ళేమీ మిగలకుండా ఆమె ఆస్థికలను రాజీవ్ గాంధీ లెఫ్ట్ కెనాల్లో దుండగులు కలిపేశారు. భన్వరీ దేవి హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో లోతుగా దర్యాప్తు చేట్టారు. రాజస్తాన్ అప్పటి మంత్రి మహిపాల్ మాదేర్నా, ఎమ్మెల్యే మల్కాన్ బిష్ణోయ్, కాంగ్రెస్ నేత సాహిరాం విష్ణోయ్లను అరెస్ట్ చేశారు. ఈ నేరానికి పాల్పడింది తామేనని విచారణలో వీరు అంగీకరించారు. రాజస్తాన్ అప్పటి మంత్రి మహిపాల్ మాదేర్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న భన్వరీ దేవి ఆయనకు తెలియకుండా తాము ఏకాంతంగా గడిపిన దృశ్యాలను వీడియో తీసింది. ఈ వీడియో సీడీలతో మహిపాల్ను బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో మల్కాన్, సాహిరాం సహాయంతో ఆమెను హత్య చేసినట్టు మహిపాల్ వెల్లడించారు. కోర్టు జోక్యంతో అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్.. మహిపాల్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికి రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. అమర్చంద్, ఇందిరా బిష్ణోయ్ సహా మొత్తం 13 మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement