Bhagirath
-
బండి భగీరథ్... వెలుగులోకి సంచలన నిజాలు.?
-
ఈ శాడిజం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలి. జీరో ఎఫ్ఐఆర్ చేసి పద్ధతి ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేశాం. అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ ఇప్పించాం. మా చర్యలను ప్రజలు గానీ, కోర్టులు గానీ తప్పుబట్టలేదు. పోక్సో కేసు వివరాలు చెప్పకూడదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దర్యాప్తు అధికారి (ఐఓ) లాగా విచారణ చేసిండు. కేటీఆర్ జడ్జీలాగా శిక్ష వేసిండు. వారిలాగా రోడ్లపై పడి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది? ఆ అమ్మాయి, తల్లిదండ్రుల ఫొటోలు పెట్టారు (సోషల్ మీడియాలో). రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. ఎన్నికల్లో ఓడించు. ఒక మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు? ఒక మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఏదో సాధించినట్టు ఈ శాడిజం ఏమిటి? ఇది శాడిస్టిక్ ఆనందం కాదా?..’అని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ‘అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో కేసు పెట్టడానికి ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో అమ్మాయి మేజర్ అనే వివాదానికి తెరలేపారు. అమ్మాయి మైనరా? మేజరా? అనే ప్రభుత్వ రికార్డులు సేకరించాం. అమ్మాయి ఏజ్ ఎంత అని ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ప్రవీణ్కుమార్ ఐఓనా? ఐఓ వెళ్లి స్కూల్లో ఆమె బర్త్ సర్టిఫికెట్, టెన్త్ సర్టిఫికెట్, హాస్పిటల్లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకుని మైనర్ అని తక్షణమే నిర్ధారించారు. ప్రవీణ్కుమార్కు ఉద్యోగం లేదు.. ప్రధాని పర్యటన ఉన్నప్పుడు వారి (బండి సంజయ్) ఇంటిపైకి వెయ్యి మంది పోలీసులను పంపితే తమ పార్టీ (బీజేపీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిందని, తెలంగాణలో గెలుస్తుందని, దీనితో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన చెçప్పుకుంటాడు. సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించాం. ఎక్కడైనా సెక్షన్లలో, అరెస్టులో, రిమాండ్లో, కోర్టులో వాదనల్లో లోపం ఉందా? కేటీఆర్, బండి సంజయ్కి ఏదో పంచాయితీ ఉంది. ఆ పంచాయితీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటున్నడు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఉద్యోగం లేక గాలికి తిరుగుతూ నేనే విచారణాధికారి అనే భ్రమల్లో ఉన్నడు.’అని సీఎం ధ్వజమెత్తారు. కేటీఆర్ బావమరిదికి ఇంకో న్యాయమా? ‘కేటీఆర్ బావమరిదికి కూడా డ్రగ్స్ కేసులో విచారణకు నోటీసులు ఇచ్చాం. పోక్సో కేసులో బండి భగీరథ్కి నోటీసులు ఇచ్చాం. ఫామ్హౌస్లో డ్రగ్స్ తీసుకుని తన బావమరిది దొరికితే అతడిని వంగబెట్టి గొట్టండి..కోదండం ఎక్కించండి అని కేటీఆర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఎందుకు చెప్పలేదు. మా బామ్మర్ది దీపావళి పండుగ చేసుకుంటున్నడు. చిచ్చుబుడ్లకు బదులు సారాయి బూత్ పెట్టుకున్నడు. బంతిపూలకి బదులు గంజాయి పూలు లేకపోతే కొకైన్ పెట్టుకున్నడు. మీరు ఎట్ల అరెస్ట్ చేస్తరు అని బయటకి వచ్చి మాట్లాడిండు కదా. బామ్మర్ది డ్రగ్స్తో ఫామ్హౌస్లో పట్టుబడితే కేసు కాదట. ఇంకో ఎమ్మెల్సీ కోడిపందాల్లో దొరికితే కేసు లేదట. దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు..ఆర్థిక లావాదేవీలు, వాళ్ల ఎక్స్ ఎమ్మెల్యే గురించి ఇవాళ చెప్తున్న. వాళ్ల ఫామ్హౌస్లో పోలీసులపై కాల్పులు జరిపి (ఓ వ్యాపారి) డ్రగ్స్తో దొరికిండు. మరి ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ యాడ పండుకుండు? ఎందుకు పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయలేదు ? వాడికి నోటీసు ఇవ్వలేదు. నీతులు చెప్పడానికే ఉన్నయా?. కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ‘కేటీఆర్ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నేత యాడ నిద్రపోతుండు? బయటకి వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకుంటే ప్రెస్నోట్ అయినా ఇవ్వొచ్చు కదా? పక్క పార్టీ వాడు పార్టీలోకి వస్తే జగిత్యాల పోయివస్తడు. ఇంత మేజర్ ఘటన రాష్ట్రంలో జరిగితే ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయిండు? ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాలి కదా. అధికారం ఉంటనే బయటకి వస్తావా?..’అని రేవంత్ ప్రశ్నించారు. మా పోలీసులు చెప్పిందే నమ్ముతా.. ‘బండి భగీరథ్ను అరెస్టు చేశామని మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతా. పిల్లవాడిని వారి ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి సరెండర్ చేయాలి. రోడ్డుపై నాకాబందీ చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ వద్ద పోలీసులకు బండి భగీరథ్ చిక్కిండు. రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలో తీసుకుంటే సరెండర్ చేశామని చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా? పోలీసుల మాటలా? బండి సంజయ్ దగ్గరుండే పంపించవచ్చు. ఐదు రోజులు పరారీలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా? లేరా?..’అని సీఎం నిలదీశారు. రైతు ఆత్మహత్యపై విచారణకు ఆదేశం మెదక్లో రైతు ఆత్మహత్యపై విచారణ జరపాలని కలెక్టర్కు ఆదేశించినట్టు రేవంత్ తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబానికి గతంలో కొల్లగొట్టిన ధనం నుంచి రూ.2 లక్షలో రూ.5 లక్షలో ఇస్తారనుకుంటే శవం చూసి పళ్లు ఇకిలిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.కొంతమంది బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు ఉన్నారని, వారి మిల్లులకు లారీల్లో ధాన్యం పంపితే దించనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శవాల మీద పేలాలు ఏరడం ఏమిటి? అని ప్రశ్నించారు. కులగణనను సుప్రీంకోర్టు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో మోదీ సర్కార్ కుయుక్తులు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో మళ్లీ ఆ బిల్లు పెట్టాలి: సీఎం రేవంత్రెడ్డి లక్డీకాపూల్(హైదరాబాద్): మహిళా రిజర్వేషన్ల బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు మహిళా బిల్లుకు డీలిమిటేషన్తో లింక్ పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం వద్ద ఉన్న విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాజీవ్గాంధీ సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనికుడన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. సోనియాగాంధీ సాహసోపేత నిర్ణ యంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఎంపీ అనిల్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్ పాల్గొన్నారు. -
బండి భగీరథ్ కేసులో బయటపడ్డ కీలక విషయాలు
-
బండి భగీరథ్కు జీవిత ఖైదు?
-
బండి భగీరథ్ కేసులో మలుపు..! బాధితురాలు మైనర్ కాదు..?
-
బండి భగీరథ్ కోసం ఐదు ప్రత్యేక.. బృందాలతో గాలింపు
-
విదేశాలకు పారిపోయే ప్లాన్..!?
-
బండి భగీరథ్ POCSO CASE పిన్ టు పిన్ డీటెయిల్స్
-
బండి భగీరథ్ ఇంట్లో పోలీసుల సోదాలు!
-
రేపు పోలీసుల ముందుకు బండి.. హైకోర్టులో వాదనలు
-
హైకోర్టు సంచలన కామెంట్స్.. బండి భగీరథ్ కు బిగ్ షాక్
-
బండి భగీరథ్ అరెస్ట్!బెయిల్పై హైకోర్టులో విచారణ..
-
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
-
బండి భగీరథ్ కేసులో కక్ష సాధింపు! పొన్నం రియాక్షన్
-
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
కుత్బుల్లాపూర్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ మైనర్ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. స్నేహం పేరుతో బ్లాక్మెయిల్ స్నేహం పేరుతో తనను బ్లాక్మెయిల్ చేస్తూ వివాహానికి ఒత్తిడి తెచ్చారని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక యువతిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సదరు యువతితో తన స్నేహితులకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈ మేరకు సదరు యువతి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కాటేసిన కలుషిత నీరు
ఇండోర్(ఎంపీ): మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని భగీరథ్పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అయిన కలుషిత నీటిని తాగిన ఉదంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యవిభాగ సిబ్బంది 2,703 నివాసాల్లోని దాదాపు 12,000 మంది స్థానికులకు వైద్య పరీక్షలు చేశారని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసానీ చెప్పారు.మధ్యస్థాయి రోగ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న 1,146 మందికి వెంటనే చికిత్సనందించారు. 111 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని, ఆరోగ్యం మెరుగుపడటంతో 18 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. బాధితులందరికీ ప్రభు త్వ ఖర్చులతో వైద్యసాయం అందిస్తామని ఇండోర్ మేయర్ పుష్యామిత్ర భార్గవ హామీ ఇచ్చారు. నర్మదా నదీజలాలను శుద్ధి చేసి నల్లా కనెక్షన్ ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటిని సరఫరాచేస్తున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాంపిళ్లను సేకరించారని ఆయన చెప్పారు. ఇండోర్కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోన్ జిల్లాలోని జలూద్ నుంచి పైప్లైన్ ద్వారా నర్మదా నదీజలాలను నగరానికి సరఫరాచేస్తున్నారు. -
మాటిచ్చి మరచినందుకు ప్రతిఫలం ఇది
సమాజానికి ఎప్పుడూ మంచే చేసేవాడు.. తన గ్రహపాటు బాగుండక ఓ పొరపాటు చేస్తే... అంతవరకూ చేసిన మంచి అంతా హుష్ పటాక్ అయిపోతుంది. ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ఖాన్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి తన వంతు కృషి చేస్తున్నారు ఆమిర్. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు. అయితే... ఇటీవల ఆయన విషయంలో ఓ పొరపాటు దొర్లింది. దాంతో నిందల్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకెళ్తే- ‘సత్యమేవ జయతే’ షోలో భాగంగా బీహార్లోని ఓ పల్లెటూరికి వెళ్లారు ఆమిర్. అక్కడ భగీరథ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిశారు. భగీరథది చాలా బీద కుటుంబం. అతని భార్య పేరు బసంతీదేవి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం తయారు చేయడం ఈ దంపతుల పని. ఓ వైపు ఆర్థిక బాధలు, మరో వైపు బసంతీదేవి ఆనారోగ్యం ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇదంతా దగ్గరుండి తెలుసుకున్నారు ఆమిర్. ‘మీ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాను’ అని భగీరథకు మాటిచ్చేశారు. త్వరలోనే తన మనుషులు కొంతమంది మిమ్మల్ని కలుస్తారని, మీ ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో... వాటన్నింటినీ తొలగించి, మీకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా సమకూరుస్తారని ఆమిర్ మాటివ్వడంతో భగీరథ కుటుంబం ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. కట్ చేస్తే... రోజులు గడిచిపోతున్నాయి. ఆమిర్ దగ్గర్నుంచి ఎవ్వరూ భగీరథను కలవడానికి రాలేదు. ఓ వైపు బసంతీదేవి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమీర్ నుంచి మాత్రం ఎలాంటి వర్తమానం లేదు. బసంతీదేవి పరిస్థితి విషమించి, చివరకు ఆమె చనిపోయింది. తన భార్యకు అంతిమ సంస్కారం చేయడానికి కూడా భగీరథ దగ్గర డబ్బుల్లేవు. చివరకు ఓ స్వచ్ఛంద సేవాసంస్థ అందించిన సాయంతో ఆంత్యక్రియలు పూర్తి చేశాడు భగీరథ. ‘‘ఆమీర్ సకాలంలో సాయం అందించి ఉంటే... నా భార్య నాకు దక్కేది. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు’’ అని బాహాటంగా విమర్శలు గుప్పించాడు భగీరథ. నిజానికి ఆమిర్ఖాన్ బాలీవుడ్లో తిరుగులేని సూపర్స్టార్. క్షణం తీరిక లేని జీవితం ఆయనది. అంత బిజీలో కూడా సమాజానికి ఏదైనా చేయాలనే దృక్పధం ఆమిర్లో కనిపిస్తుంది. దానికి ఉదాహరణే ‘సత్యమేవ జయతే’. దాని ద్వారా ఎందరినో ఆదుకున్నారాయన. అంత చేసినా... మరపు వల్ల తాను చేసిన ఓ చిన్న పొరపాటు ఆయనకు ఈ మచ్చను తెచ్చిపెట్టింది. పాపం ఆమిర్.


