breaking news
Beti Bachao ... Beti padhavo
-
బేటీ పడావోను తప్పుగా రాసిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్ విమర్శలు
‘బేటీ బచావో, బేటీ పడావో’.. దేశంలో బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నినాదాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 22 జనవరి 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. భ్రూణహత్యలను తగ్గించి, బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు, ముఖ్యంగా చదువుల్లోనూ అమ్మాయిలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చారు.కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ నినాదాన్ని తాజాగా ఓ మహిళా కేంద్రమంతి సరిగా రాయలేకపోయారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఆమె మాతృ భాష ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదా హిందీలో తప్పుగా రాశారు. మంగళవారం మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి.ये केंद्रीय महिला एवं बाल विकास राज्यमंत्री सावित्री ठाकुर हैं जिले में शिक्षा जागरूकता रथ पर उन्हें ‘बेटी बचाओ बेटी पढ़ाओ’ का स्लोगन लिखना था लेकिन, मंत्रीजी ने लिखा- "बेढी पडाओ बच्चाव" शपथ-पत्र के मुताबिक वे 12वीं पास हैं ये टीप उनके नहीं बल्कि देश के "शैक्षणिक स्तर" पर है pic.twitter.com/v66qM05Uyc— Anurag Dwary (@Anurag_Dwary) June 19, 2024అయితే జాతీయ స్థాయి నేత మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నినాదాన్ని కూడా మంత్రి సరిగా రాయలేకపోయారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. పార్టీ సీనియర్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ..రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ పెద్ద శాఖలు చూస్తున్న వ్యక్తులకు తమ మాతృభాషలో సైతం సామర్థ్యం లేకపోవడం దురదృష్టకరం. వాళ్లు తమ శాఖలను సమర్థంగా ఎలా నిర్వహించగలరు?’ అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత నిబంధనను రాజ్యాంగం విధించాలని అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ విమర్శలను ధార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఖండించారు.. మంత్రి తొందరపాటులో చేసిన తప్పును కాంగ్రెస్ పెద్దది చేసి చూపడం ఆ పార్టీ అల్పమైన ఆలోచనలకు, గిరిజన వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.కాగా సావిత్రి ఠాకుర్.. మధ్యప్రదేశ్లోని ధార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
ఆడబిడ్డకు అండగా
ఇందూరు: ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘బేటీ బచావో...బేటీ పఢావో’ నినాదంతో ప్రజలలో అవగాహన క ల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. మన జిల్లాలో ఐసీడీఎస్ అధికారులు ‘బాలల సంరక్షణ విభాగం’ ఆధ్వర్యంలో నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. తేదీలవారీగా షెడ్యూల్ను రూపొందించారు. మండలాలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖల సమన్వయం తో ఈనెల 15 లేదా 16న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నిర్వహించే కార్యక్రమాలివే {భూణ హత్యలు, గర్భధారణ సమయంలోనే వైద్యులచే లింగ నిర్ధారణ చేయించడం, చేయిస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు పడే శిక్షలపై అవగాహన తరగతులు. అమ్మాయి, అబ్బాయి అనే వ్యత్యాసాన్ని, వివక్షను రూపుమాపేందుకు అందుకు అనుగుణమైన అంశాలతో కూడిన వర్క్షాప్ల నిర్వహణ. ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలు, చట్టాల గురించి ,విద్య అవసరాలు ఇతర వాటిపై అవగాహన కలిగించడం. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం. బాల్య వివాహాలతో ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయో క్లుప్తంగా వివరించడం. దాడులు, అత్యాచారాలను ఎదుర్కొనేందుకు బాలికలకు ప్రత్యేక శిక్షణ తరగతులు. హెల్ప్లైన్కు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు తెలపడం. {పతీ పాఠశాలలో పై అంశాలన్నింటిపై ప్రత్యేక తరగతులు నిర్వహించడం. విద్యార్థులచే గ్రామాలు, మండలాలలో విస్తృతంగా ర్యాలీలు, శిక్షణ తరగతులు నిర్వహించి ప్రచారం చేపట్టడం. జిల్లాస్థాయిలో పెద్ద కార్యక్రమం నిర్వహించడం. నిధుల లేమి.. ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు పెట్టి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. కానీ, వీటిని విజయవంతగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిధులను కే టాయించడం లేదు. ప్రస్తుతం ‘బేటీ బచావో...బేటీ పఢావో’ కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహించాలి. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. ఒక్క పైసా కూడా కేంద్రం కేటాయించలేదు. మొన్న జరిగిన బాల్య వివాహాలపై సదస్సులు, ర్యాలీలు, పౌష్టికాహార వారోత్సవాలు, తదితర కార్యక్రమాలకు కూడా ప్రభుత్వాలు నిధులు కే టాయించలేదు. దీంతో వాటిని అంతంతమాత్రంగానే నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పెద్ద బాధ్యతలు అప్పగించడం, ఎలా నిర్వహించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితులలో, ఉన్న కొద్దిపాటి నిధులతో సర్దుకోవాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.