breaking news
barcode scanners
-
ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి
న్యూఢిల్లీ: చాలా సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రముఖ బార్కోడ్ స్కానర్ యాప్ ను వెంటనే ఆన్ ఇన్స్టాల్ చేయండి లేకపోతే హ్యాకింగ్ భారీన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ యాప్ లో వైరస్ ప్రవేశించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఈ వైరస్ వేగంగా ఇతర మొబైల్స్ లోకి వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. దాంతో వెంటనే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను తొలిగించినట్లు పేర్కొంది. దీనిని ఇప్పటికే ఒక కోటికి మందికి పైగా దీనిని డౌన్ లోడ్ చేసుకొని వాడుతున్నారు. ఈ యాప్ ను ఓపెన్ చేసినప్పుడు క్రాష్ అవ్వడంతో పాటు చాలా రకాల ప్రకటనలు(యాడ్స్) వస్తున్నాయని కొందరు వినియోగదారులు గుర్తించారు. ఈ సమస్య గురుంచి తెలుసుకున్న వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే దీనిని అన్ఇన్స్టాల్ కోరింది. ఈ యాప్ ను లావాబర్డ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మీ ఫోన్లో దీనిని కనుగొనలేకపోతే AppCheckerని డౌన్లోడ్ చేసి 'బార్కోడ్ స్కానర్' ను చెక్ చేయండి. బార్కోడ్ స్కానర్ ఒక సాధారణ యాప్, గత సంవత్సరం డిసెంబర్ 4న తీసుకొచ్చిన అప్డేట్ తర్వాత ఫోన్లలోకి వైరస్ వచ్చినట్లు తెలుస్తుంది. చదవండి: ఓటు వేసి రియల్మీ నార్జో30 గెలుచుకోండి ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్ -
‘బార్’కోడ్ బాదుడు!
వైన్ షాపులు, బార్లలో బార్కోడ్ స్కానర్లు ఒక్కొక్కరూ రూ.80వేలు చెల్లించాల్సిందే.. జిల్లా వ్యాపారులపై రూ.3.50కోట్లకు పైగా భారం 31లోపు స్కానర్లు కొనకపోతే మద్యం సరఫరాకు బ్రేక్ ఆందోళనలో వ్యాపారులు గుడివాడ : మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుంది మద్యం వ్యాపారుల పరిస్థితి. తీవ్ర ఉత్కంఠ పోటీలో మద్యం షాపు దక్కించుకుని కాసుల వేట సాగించాలని ‘చుక్క’ల లోకంలో విహరిస్తున్న వారి ఆశలపై ఎక్సైజ్ శాఖ నీళ్లు చల్లుతోంది. ఇప్పటికే ఎమ్మార్పీకే విక్రయించాలని, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయొద్దని, పర్మిట్ రూముల కోసం అదనంగా రూ.2లక్షలు చెల్లించాలని ఆదేశించిన ఎక్సైజ్ శాఖ తాజాగా బార్కోడ్ స్కానర్ల పేరుతో మరోమారు బాదుడుకు తెరలేపింది. ఈ నెలాఖరులోపు అన్ని మద్యం షాపులు, బార్లలో బార్కోడ్ స్కోనర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఇందుకోసం రూ.80వేలు చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే సరుకు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. బార్కోడ్ స్కానర్లు ఏర్పాటుచేయని షాపులు, బార్లకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మద్యం సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్నారు. దీనిపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రయోజనం కోసం కాదని, ఏదో ఒక హార్డ్వేర్ కంపెనీకి లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. బార్ కోడ్ స్కానర్లు ఉంటేనే అమ్మకాలు జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 301 వైన్ షాపులు, 150కి పైగా బార్లు ఉన్నాయి. వీటిలో ‘హలో గ్రాఫిక్ ఎక్సైజ్ అడిసివ్ లేబుల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టం(హీల్) పేరుతో బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతి మద్యం బాటిల్పై ఉండే లేబుల్ను స్కాన్ చేసిన తర్వాతే విక్రయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్కాన్ చేసిన ప్రతి బాటిల్కు వచ్చే ప్రింటెడ్ బిల్లును మద్యం వినియోగదారుడికి అందజేయాల్సి ఉంది. ఈ హీల్ స్కానర్ను ఎక్సైజ్ శాఖ నేరుగా కొనుగోలు చేసి అందిస్తుంది. ఇందుకోసం ప్రతి వైన్షాపు, బార్ లెసైన్సుదారులు రూ.80వేలను డీడీ రూపంలో ఎక్సైజ్ శాఖకు చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలోని మద్యం వ్యాపారులపై రూ.3.50 కోట్లకు పైగా భారం పడుతుంది. హీల్ మిషన్ వల్ల ఉపయోగాలు.. ప్రతి బాటిల్ను బార్కోడ్ స్కానర్తో స్కాన్ చేయటం వల్ల ఎప్పుడు తయారు చేశారు. ఎక్కడ చేశారు. బ్యాచ్ నంబర్, ఎంఆర్పీ తదితర పూర్తి వివరాలు బిల్లులో వస్తాయి. ఎవరైనా మద్యం తాగి అస్వస్థతకు గురై మరణిస్తే అతను తాగిన బాటిల్ స్కాన్ చేస్తే చాలు. దాని బ్యాచ్ నంబర్ సహా మొత్తం వివరాలు వెలుగులోకి వస్తాయి. ఏ షాపులో విక్రయించారనే విషయం కూడా తెలుస్తుంది. బెల్టు షాపుల్లో పట్టుబడిన బాటిల్స్ ఏ షాపు నుంచి సరఫరా చేశారనే విషయం తెలుస్తుంది. షాపుల్లో ఏయే బ్రాండ్ ఎంత అమ్మకాలు జరిగాయి. ఎంత స్టాకు ఉంది.. అనే వివరాలు తెలుసుకోవచ్చు.