breaking news
banwar lal
-
మల్లన్న సేవలో భన్వర్లాల్
శ్రీశైలం(కర్నూలు జిల్లా): శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామి వార్లను రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ భన్వర్లాల్ దర్శించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం శ్రీశైలం చేరుకున్న ఆయన కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ గోపురం వద్ద ఈఓ సాగర్బాబు ఆలయ మర్యాదలతో భన్వర్లాల్కు స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు భన్వర్లాల్కు తీర్ధప్రసాదాలు అందించారు. -
నేనూ సర్కారు బడుల్లోనే చదివా
డోన్ టౌన్:‘నేనేమీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవలేదు. నేనూ ప్రభుత్వ కళాశాలల్లోనే చదివే ఈ స్థాయికి ఎదిగా. ప్రభుత్వోద్యోగిగా కొలువుదీరా’నంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ అన్నారు. డోన్లోని జీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కళాశాల 36వ వార్సికోత్సవానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. ముందుగా ఆయన కళాశాల విద్యార్థులు తయారు చేసిన సోలార్ ప్రాజెక్టును సందర్శించి విద్యార్థుల మేధసంపత్తిని అభినందించారు. తరువాత కళాశాలలో ఏర్పాటు చేసిన వివేకానంద విజ్ఞాన మందిరం(లైబ్రరీ), కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ పల్లె శివశంకర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన తన విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలకు బస్సులు, రోడ్లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయన్నారు. తాను చదివే రోజుల్లో ప్రతి రోజూ ఆరు కిలోమీటర్ల దూరంలోని కళాశాలకు నడచి వెళ్లి చ దువుకున్నట్లు తెలిపారు. అప్పటి నడకలే ఉన్నత శిఖరాలతో పాటు ఆరోగ్యానికి దోహదపడ్డాయన్నారు. పుస్తకాలతోనే మేధోసంపత్తితో పాటు వ్యక్తిత్వ వికాసం సిద్ధిస్తుందన్నారు. అందుకే పుస్తకపఠనం అలవర్చుకోవాలని కోరారు. తల్లిదండ్రులు, గురువులను పూజించిన చోటే నాగరికతతో కూడిన మానవత్వం విరాజిల్లుతుందన్నారు. ఓటుకూ ఆధార్.. ఓటు హక్కు గల ప్రతి విద్యార్థి దాన్ని వినియోగించుకున్నప్పుడే నిజమైన నాయకుడు ఆవతరిస్తాడని భన్వర్లాల్ అన్నారు. తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎనిమిది నెలల కిందటి ఫలితాలకు పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాయన్నారు. అందుకే ఓటు ప్రతి పౌరుని చేతిలో వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. వందేమాతరం ఫౌండేషన్ డెరైక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ మానసిక పరకత్వం లేని విద్య ఉపయోగపడదని, తద్వారా ఆరోగ్యం క్షీణించి అనర్థాలకు దారి తీస్తుందన్నారు. కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడారు. కళాశాల ప్రగతిని ప్రిన్సిపాల్ చదివి విన్పించారు. అనంతరం భన్వర్లాల్ దంపతులను ఘనంగా సన్మానించారు. జింథాల్ మైన్స్ అధికారి అంకాల్రెడ్డి, సబ్జైల్ సూపరింటెండెంట్ స్వామి, పారిశ్రామిక వేత్త పామయ్య, న్యాయవాది నాగభూషన్రెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న రవివర్మ సంగీతం ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు రవివర్మ సంగీత విభావరి విద్యార్థులను ఆకట్టుకుంది. పాడే ప్రతి గీతం రసరమ్య మధురంగా ఉండటంతో ఆయన పాటలకు విద్యార్థులు జతకట్టి నృత్యాలు చేశారు. రవివర్మ పాటలకనుగుణంగా వారు స్టెప్పులేయడం అందిరిలో జోష్ పెంచింది. -
కొద్ది గంటల్లో ఓటరు తీర్పు
* తేలనున్న నేతలు, పార్టీల భవిష్యత్తు * నేటి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం * 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల కౌంటింగ్.. 11 గంటలకల్లా ట్రెండ్స్! * అత్యధికంగా 45 రౌండ్లలో మల్కాజిగిరి లోక్సభ, కూకట్పల్లి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు * అతి తక్కువగా అనకాపల్లి లోక్సభకు 18 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు * 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం * లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు నిషేధం సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం కారణంగా.. ఈ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా 4.82 కోట్ల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు శుక్రవారం వెలువడనుంది. రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాలకు 598 మంది పోటీ పడగా, 294 అసెంబ్లీ స్థానాలకు 3,910 మంది పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకల్లా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఏ పార్టీలు అధికారంలోకి రానున్నాయో (ట్రెండ్స్) తెలిసిపోయే అవకాశం ఉంది. కౌంటింగ్కు 25 వేల మంది సిబ్బంది రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో 168 కేంద్రాల్లోని 437 హాళ్లలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. ఉదయం 8 గంటల కల్లా అభ్యర్థుల ఏజెంట్లందరూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం భన్వర్లాల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 437 కౌంటింగ్ హాళ్లలో 6,955 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 25,000 మందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత నిమిత్తం 75,000 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఒక కౌంటింగ్ టేబుల్కు ఒకరు చొప్పున సూక్ష్మ పరిశీలకుడిని నియమించడంతో పాటు ప్రతి కేంద్రంలోను అదనపు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ 189 మంది పరిశీలకులను నియమించిందన్నారు. ఈవీఎంలన్నీ భద్రం ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్నాయని, ఎవరూ ఈవీఎంల దగ్గరకు వెళ్లలేదని, ఎవరూ ఈవీఎంలను ఇళ్లకు తీసుకువెళ్లలేదని భన్వర్లాల్ స్పష్టం చేశారు. ప్రింటర్ ఆర్గనైజర్ డిస్ప్లేను భద్రపరచడంలో అలసత్వంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రజలకు ఫలితం తెలియజేసేందుకు తెరలను ఏర్పాటు చేశారు. అతి పెద్ద లోక్సభ స్థానం అయిన మల్కాజిగిరి ఓట్లను అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కిస్తారు. అనకాపల్లి లోక్సభ స్థానం కౌంటింగ్ 18 రౌండ్లలోనే పూర్తి కానుంది. అలాగే కూకట్పల్లి అసెంబ్లీ ఓట్లను కూడా అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కించనున్నారు. చార్మినార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మాత్రం 13 రౌండ్లలోనే పూర్తి కానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఎన్నికల సిబ్బంది ‘బ్యాలెట్ యూనిట్’లను ఆన్ చేస్తారు. ప్రతిరౌండ్ లెక్కింపు తర్వాత ప్రింట్అవుట్ను అభ్యర్థుల తరఫు ఏజెంట్లకు అందజేస్తారు. ఫలితాలను ఠీఠీఠీ.ఛిౌ్ఛ్చఛీజిట్చ.జీఛి.జీ వెబ్సైట్లో చూడవచ్చు. గురువారం అర్ధరాత్రి నుంచి 17వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావడంపైనా నిషేధం విధించారు.