-
మహోజ్వల భారతి: సరెండర్ నాట్ బెనర్జీ
సురేంద్రనాథ్ బెనర్జీ బ్రిటిష్ ఇండియా భారత రాజకీయాలలో ముఖ్య నాయకులు. ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ స్థాపకులు. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బెనర్జీ బెంగాల్ ప్రావిన్స్లోని కలకత్తాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండి దుర్గా చరణ్ బెనర్జీ వైద్యులు, ఉదారవాద, ప్రగతిశీల ఆలోచనలు గలవారు. బెనర్జీపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత బెనర్జీ ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలను రాయడానికి ఇంగ్లండ్ వెళ్లారు. పరీక్షల్లో విజయం సాధించి సిల్హెట్లో (నేటి బంగ్లాదేశ్) అసిస్టెంట్ మేజిస్ట్రేట్గా నియామకం పొందారు. 1905లో బెంగాల్ ప్రావిన్స్ విభజనను నిరసించిన ముఖ్య ప్రజా నాయకులలో సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఉన్నారు. మితవాద రాజకీయ నాయకుల ప్రజాదరణ క్షీణించడం భారత రాజకీయాల్లో బెనర్జీ పాత్రను ప్రభావితం చేసింది. 1909 లో మింటో–మార్లే సంస్కరణలకు బెనర్జీ మద్దతు ఇచ్చారు. భారతీయ ప్రజా, జాతీయవాద రాజకీయ నాయకులలో చాలామందికి అది ఆగ్రహం కలిగించింది. అంతేకాదు, మహాత్మాగాంధీ ప్రతిపాదించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని బెనర్జీ విమర్శించడం, తర్వాత్తర్వాత బెంగాల్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని అంగీకరించడం అనేకమంది జాతీయవాదులకు కోపం తెప్పించింది. అయినప్పటికీ భారత రాజకీయాల మార్గదర్శక నాయకుడిగా మొదట భారత రాజకీయ సాధికారత కోసం మార్గం నడపడం వల్ల బెనర్జీ చరిత్రలో గొప్ప నేతగా నిలిచిపోయారు. ‘సర్’ అనే బ్రిటిష్ హోదాకు అర్హులయ్యారు. బెనర్జీ చివరి రోజులలో బ్రిటిష్వారు ఆయన్ని ఆయన దృఢత్వానికి చిహ్నంగా ‘సరెండర్ నాట్’ బెనర్జీగా గౌరవించారు. బెనర్జీ తన 76 ఏళ్ల వయసులో 1925 ఆగస్టు 6న కన్నుమూశారు. -
అతడు ఆమె ప్రియుడు..టీజర్ చాలా బాగుంది
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి. -
‘అసలు మీరెవరు.. మమ్మల్ని అడగడానికి?’
ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ అటు సోషల్ మీడియాలోనూ ఇటు మీడియాలోనూ హైలైట్గా నిలిచారు. కరోనా కష్టకాలంలో తనపై, తన సహాయక కార్యక్రమాలపై అసత్య ఆరోపణలతో వార్తలు రాసిన వెబ్సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ ఓ వీడియో విడుదల చేశాడు. అంతేకాకుండా ‘కిల్ ఫేక్ న్యూస్’ అంటూ పిలుపునిచ్చాడు. దీంతో విజయ్కు మద్దతుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు కదిలింది. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేశ్బాబు, నాగార్జున, రవితేజ, కొరటాల శివ, అనిల్ రావిపూడి తదితరులు విజయ్కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ కూడా విజయ్కు సంఘీభావం తెలిపాడు. ‘మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత అవసరమైనా ఎవరి ముందు చేతులు చాచి అడగలేరు. ఎందుకంటే వారికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అలాంటి మిడిల్క్లాస్ కుటుంబాల కోసం విజయ్ దేవరకొండ ఓ ఛారిటీ ఏర్పాటు చేసి సహాయం అందించడం అభినందనీయం. అదేవిధంగా కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)కి విరాళం ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అయితే అతడు చేస్తున్న మంచి పనులను అభినందించకున్నా పర్లేదు కానీ బురద జల్లడం మంచిది కాదు. అసలు మీరెవరండి? హు ఆర్ యూ? మేం ఎంత విరాళం ఇస్తాం, ఎవరికి ఇస్తాం అనేది మా(ఆర్టిస్టులు) ఇష్టం. విరాళం ఎందుకు ఇవ్వడం లేదు? ఎక్కడ దాక్కున్నాడు అంటూ రాయడం సరికాదు. ఇలా విజయ్ దేవరకొండకు అనే కాదే సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఇలాంటి సమస్య ఎదురైనా మేమందరం ఉన్నాం. అండగా నిలుచుంటాం. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే’ అని బెనర్జీ ఆ వీడియోలో పేర్కొన్నాడు. చదవండి: తమిళ హీరో సూర్యకు బిగ్ షాక్ ! శివాజీరాజాకు గుండెపోటు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1081263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది
‘‘ఎంఎంఓఎఫ్’ ట్రైలర్ చూశాక నేను నిదానంగా వెళుతున్నానా? సినిమా తీసినవారు ఫాస్ట్గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కథలతో మరెన్నో సినిమాలు చేయాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. జేడీ చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో యన్.యస్.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంఎంఓఎఫ్’. అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ జేకే క్రియేష¯ŒŒ్స బ్యానర్స్పై ఆర్ఆర్ఆర్ రాజశేఖర్, జేడీ కాశీం నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ని హైదరాబాద్లో రామ్గోపాల్ వర్మ విడుదల చేశారు. డైరెక్టర్ శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘వర్మలా సినిమాలు చేయాలని, అతన్ని అనుకరించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మంచి నటుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే త్వరగా సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జేడీ చక్రవర్తితో చాలా కాలం తర్వాత నటించాను. ఆర్జీవీగారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ‘ఎంఎంఓఎఫ్’ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నటుడు బెనర్జీ. జేడీ చక్రవర్తి, నటులు ఉత్తేజ్, మనోజ్ నందం, నిర్మాత రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
సెలవులో నరేశ్.. బెనర్జీకి ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేశ్ 41 రోజులు సెలవు పెట్టడంతో బై లాస్ ప్రకారం ఉపాధ్యక్షుడు బెనర్జీకి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంపై బుధవారం ఫిల్మ్ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిప్లినరీ, ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు మురళీమోహన్, సీనియర్ నటి జయసుధ, ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, నటీనటులు హేమ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, అనితా చౌదరీ, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్ టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, అలీ, సురేష్ కొండేటి, తనీష్, ఆశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసాగా సాగిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్బాబు వంటి అతిరథుల సమక్షంలోనే మాజీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ అధ్యక్షుడు నరేశ్పై ఆరోపణలు చేశారు. అయితే సభ్యులతో రాజశేఖర్ ప్రవర్తించిన తీరు, వేదికపై మాట్లాడిన తీరుపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజశేఖర్పై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదే సమయంలో ‘మా’ సభ్యులు వివాదాలు మానుకొని కలసి పనిచేయాలని చిరంజీవి సూచించారు. అంతేకాకుండా తెలుగు సినిమా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన సంగతి విదితమే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement