bafta Award
-
జాతీ మతం కంటే మనిషి ముఖ్యం
బ్రిటిష్ అకాడెమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ‘బూంగ్’ తెర వెనుక కథ మానవత్వాన్ని చాటుతోంది. ఈ సినిమా దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి మణిపూర్లో మెయితి తెగకు చెందినామె. ముఖ్య పాత్ర పోషించిన బాలనటుడు గుగున్ కుకీ తెగకు చెందినవాడు. అయితే సినిమాలో అతను మెయితీ తెగకు చెందిన పిల్లాడిగా నటించాడు. సినిమా షూట్ ముగిశాక మొదలైన మణిపూర్ అల్లర్లలో మెయితీల దాడి నుంచి గుగున్ కుటుంబాన్నిలక్ష్మీ ప్రియాదేవి కాపాడింది. ఢిల్లీకి వలస వచ్చిన గుగున్ ప్రస్తుతం ఆరవ తరగతి పరీక్షలకు కూచుంటున్నాడు. 2023కు ముందు మతం, జాతీ తేడా లేకుండా ఉన్న తాము ఇప్పుడెందుకు ఇలా ఉన్నామని ప్రశ్నిస్తున్నారు వారు.మణిపురి భాషలో తీసిన ‘బూంగ్’ సినిమా ట్రైలర్ను చూసినా అది మనల్ని ఆకట్టుకుంటుంది. అందులో కనిపించే తల్లీకొడుకులు మనకు ఏదో లోతైన కథ చెప్తున్నారనిపిస్తుంది. ఆ సినిమాలో తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లి ఉంటాడు. స్కూల్ చదువులో ఉన్న కుమారుడు తండ్రి కోసం బయల్దేరడమే ‘బూంగ్’ సినిమా. మణిపురి దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘బ్రిటిష్ అకాడెమీ’ అవార్డ్స్లో మొదటిసారి మన దేశానికి అవార్డు సం పాదించిపెట్టింది. ఇది రికార్డు. ఈ కథ ఇక్కడ ముగిసినా ఈ సినిమా వెనుక ఉన్న కథ మాత్రం మనసుల్ని కదిలించేలా ఉంది.మెయితీ–కుకీమణిపూర్లో రెండు బలమైన జాతులు ఉన్నాయి. మెయితీ– కుకీ. ఇంఫాల్ లోయలో మెయితీలది పై చేయి అయితే కొండ ప్రాంతాలలో కుకీలది పై చేయి. లక్ష్మీ ప్రియాదేవి తీసిన ‘బూంగ్’ సినిమాలో కథ మెయితీ కుటుంబానిది. అయితే అందుకు కావలసిన బాల నటుడు కుకీ కుటుంబం నుంచి దొరికాడు. అతని పేరే గుగున్ కిప్జెన్. 2023లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కిప్జెన్కు 11 ఏళ్లు. సినిమా షూటింగ్ ముగిశాక మే 3, 2023న హటాత్తుగా మణిపూర్లో అల్లర్లు మొదలయ్యాయి. మెయితీలు పైచేయిగా ఉండే ఇంఫాల్లో కుకీల మీద దాడులు జరుగుతున్నాయి.అప్పుడు కిప్జెన్ కుటుంబం ఇంఫాల్లోని కానన్వెంగ్ అనే ప్రాంతంలో ఉంది. మే4న మెయితీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో స్వయంగా మెయితీ తెగకు చెందిన లక్ష్మీ ప్రియాదేవి రంగంలో దిగి కిప్జెన్ కుటుంబాన్ని ఆ ప్రాంతం నుంచి దాటించింది. కిప్జెన్ కుటుంబం పోట్ట చేత్తో పట్టుకుని అస్సాం రైఫిల్స్ శిబిరానికి చేరి తల దాచుకుంది. అక్కడ కొన్నాళ్లు ఉన్నాక కుకీలు ఎక్కువ ఉండే కాంగ్ పోక్పి జిల్లాకు తరలి వెళ్లింది.ఇంఫాల్లో ఉన్న సొంత ఇంటిని కిప్జెన్ వదిలి పెట్టేశాడు. అతని స్కూల్లో అతను తిరిగి చదవలేడు. ఏ మెయితీ పిల్లాడి పాత్ర తాను పోషించాడు ఆ మెయితీల వల్లే కష్టాల్లోకి వెళ్లిపోయాడు. ఇతనిలాగే కుకీల వల్ల మెయితీ కుటుంబాలు, పిల్లలు అవస్థ పడ్డాయి. ఇరు వర్గాల ఘర్షణల్లో పై పై లెక్కల ప్రకారం 260 మంది చనిపోతే 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.ఢిల్లీకి చేరి...కొండ ప్రాంతానికి చేరినా కిప్జెన్ కుటుంబం సురక్షితంగా లేదు. అల్లర్లు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో కిప్జెన్ చదువు కోసం కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లాలనుకుంది. అదీ అంత సులభంగా జరగలేదు. మిలటరీ కాన్వాయ్లో ఒక బస్సులో కొన్ని కుటుంబాలతో పాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఢిల్లీకి చేరారు. 2025 జనవరి నుంచి కిప్జెన్ కుటుంబం ఢిల్లీలోనే ఉంది. మణిపూర్లో అల్లర్లు పూర్తిగా తగ్గితే తప్ప వెనక్కు వెళ్లమని చెబుతోంది. కొత్త వాతావరణంలో కిప్జెన్ బడి బాట పట్టాడు. ప్రస్తుతం 6వ తరగతి పరీక్షకు కూచుంటున్నాడు. అతడు నటించిన సినిమా దేశ దేశాల్లో ఎంతో పేరు సం పాదిస్తున్నా ఆ సంతోషం అంతా అనుభవించలేకపోతున్నాడు. వలస జీవితం ఎంత దుర్భరమో అనుభవించినవారికే తెలుసు.దివ్యశక్తి ప్రతిఒక్కరిలో...బ్రిటిష్ అకాడెమీ అవార్డు పోందాక లక్ష్మీ ప్రియా దేవి తన ఉపన్యాసం ఇలా చేసింది– ‘మేమంతా ఎంతో బాగుండేవాళ్లం. ఆ మునుపటి శాంతి మణిపూర్కి తిరిగి రావాలి. చెదిరిపోయిన పిల్లలంతా తిరిగి తమ గూళ్లకు చేరుకుని ఆనందంగా గడ పాలి. ఎన్ని ఘర్షణలు జరిగినా మనిషిలో క్షమ అనే దివ్యశక్తి మనిషికి మాత్రమే సొంతం. ఆ క్షమతో మానవత్వాన్ని నిలబెట్టాలి’ అందామె. దేశంలో అందరికీ గౌరవంగా, సమానంగా బతికే హక్కు ఉంది. ఎవరికంటే ఎవరూ ఎక్కువ కాదు... తక్కువ కాదు. దాడులు, ప్రతి దాడులు, ద్వేషాలు పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచివి కావు. మానవత్వమే మనిషి ప్రథమ గుణం కావాలి... ఇదే ఇప్పుడు ‘బూంగ్’ సినిమా విజేతలు లోకానికి ఇస్తున్న సందేశం. -
చరిత్ర సృష్టించిన బూంగ్
భారతీయ చిత్రం ‘బూంగ్’ చరిత్ర సృష్టించింది. లండన్ లో జరిగిన 79వ ‘బాఫ్టా’ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల ప్రదానోత్సవంలో ‘బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్’ విభాగంలో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే ‘బాఫ్టా’లో తొలి అవార్డు సాధించిన మణిపుర్ సినిమా కూడా ఇదే. ఈ విభాగంలో ‘జూటోపియా 2’, ‘లిలో – స్టిచ్’, ‘ఆర్కో’ వంటి హాలీవుడ్ చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నప్పటికీ ‘బూంగ్’ అవార్డును గెలుచుకోవడం విశేషం.బూంగ్ కథ ఏంటంటే...గుగున్ కిప్జెన్ టైటిల్ రోల్లో, బాలా హిజామ్ కీలక పాత్రలో నటించిన మణిçపుర్ చిత్రం ‘బూంగ్’. లక్ష్మీ ప్రియా దేవి దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ఫర్హాన్ అక్తర్, వికేష్ భూతాని, అలాన్ మెక్ అలెక్స్, రితేష్ సిధ్వాని, షుజాత్ వ్యాపారి నిర్మించారు. ఈ సినిమాని 2024లో కెనడాలో జరిగిన 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి ప్రదర్శించారు. 2025 సెప్టెంబరు 19న ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేశారు. తన తల్లిదండ్రులు మందాకిని, జాయ్కుమార్లను కలిపేందుకు బూంగ్ అనే పాఠశాల విద్యార్థి తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు వరకు చేసిన సాహసోపేతమైన భావోద్వేగ ప్రయాణంతో ఈ మూవీ సాగుతుంది. మణిపుర్లో శాంతి నెలకొనాలి: లక్ష్మీప్రియా దేవి ‘బాఫ్టా’ అవార్డు స్వీకరించిన అనంతరం భావోద్వేగంతో మాట్లాడారు లక్ష్మీప్రియా. ‘‘మేం ఎంతో కష్టపడుతూ ఓ పర్వతం ఎక్కుతున్నది ఫస్ట్ ప్లేస్ కోసమని మేం ఈ వేదికపైకి వచ్చాక అర్థం అయింది. మా చిన్న సినిమాపై ఇంతటి ప్రేమను వ్యక్తం చేసిన జ్యూరీ సభ్యులకు, బాఫ్టాకు థ్యాంక్స్. భారతదేశంలోని మణిçపుర్ నా మాతృభూమి. అక్కడ తిరిగి శాంతి నెలకొనాలని దేవుణ్ణిప్రార్థిస్తున్నానని చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలనుకుంటున్నాను. సినిమాలోని బాల నటులతో సహా, మణిపూర్లోని పిల్లలందరూ వారి ఆనందాన్ని, వారి కలలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ప్రధాని మోదీ ప్రశంస‘‘బూంగ్’ సినిమాతో అసోసియేట్ అయిన అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఆనందమైన క్షణాలు ఇవి. ముఖ్యంగా మణిపూర్కు. అలాగే దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభ హైలైట్ అవుతుంది’’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోది ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అలాగే పలువురు భారత సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆలియా సందడి‘బాఫ్టా’ అవార్డ్స్లో బాలీవుడ్ నటి ఆలియా భట్ సందడి చేశారు. ‘బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్’ విభాగంలో ‘సెంటిమెంటల్ వేల్యూ’ యూనిట్కు అవార్డు అందించారు. ఈ అవార్డ్స్లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా బెస్ట్ ఫిల్మ్గా నిలవడంతో పాటు అత్యధికంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. చిత్ర దర్శకుడు పాల్థామస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. రాబర్ట్ అరమాయో (ఐ స్వయిర్ సినిమాకు) ఉత్తమ నటుడిగా నిలవగా, జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచి (‘హామ్నెట్’ చిత్రానికిగాను).. బాఫ్టా లీడ్ యాక్ట్రస్ అవార్డు గెలుచుకున్న తొలి ఐరిస్ మహిళగా రికార్డు సాధించారు. -
బాఫ్టా అవార్డ్స్-2026.. తొలిసారి భారత్ సినిమాకు అవార్డ్
సినీ ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటిగా భావించే బాఫ్టా (బ్రిటిష్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్)లో భారత్ సత్తా చాటింది. లండన్లో జరిగిన 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA)లో మణిపురి చిత్రం బూంగ్ (Boong) ఉత్తమ బాలల, కుటుంబ చిత్రంగా అవార్డును దక్కించుకుంది. దీంతో భారతదేశం గర్వపడేలా చేసింది. బ్రిటిష్ సినిమాలతోపాటు అంతర్జాతీయ చిత్రాలకు ఈ అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే.లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగిన బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవంలో భారత్ తొలిసారి అవార్డ్ అందుకుంది. గతంలో నామినేషన్ వరకు మాత్రమే పరిమితమైన భారత చిత్రాలు ఇప్పుడు తొలిసారి మణిపురి చిత్రం బూంగ్ అవార్డ్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అర్కో, లిలో అండ్ స్టిచ్, జూట్రోపొలిస్ 2 వంటి టాప్ చిత్రాలను అధిగమించి బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగంలో అవార్డ్ అందుకుంది.‘బూంగ్’ చిత్రాన్ని లక్ష్మీప్రియ దేవి తెరకెక్కించగా.. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా ఉన్నారు. టైటిల్ పాత్రలో గుగున్ కిప్జెన్ ప్రేక్షకులను మెప్పించారు. 2025 సెప్టెంబర్లో మణిపురిలో విడుదలైన ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డ్స్ను అందుకుంది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు, ఇంటర్నేషనల్ సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వంటి వేదికలపై అనేక విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. ‘బూంగ్’ కథ ఏంటి..?2024లో మణిపురి భాషలో లక్ష్మీప్రియాదేవి తెరకెక్కించిన చిత్రం ‘బూంగ్’. ఇది బూంగ్ అనే స్కూల్ పిల్లాడి కథ. ఆ పిల్లవాడు తప్పిపోయిన తన తండ్రి జాయ్కుమార్ని, తన తల్లి మందాకినిని తిరిగి కలపడం కోసం తన స్వస్థలం నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని మోరే వరకు ప్రయాణించడమే ఇందులోని కథ. బూంగ్ తండ్రి బతికే ఉన్నాడా, అతనికి ఏమైంది, ఈ ప్రయాణంలో బూంగ్కు ఎదురైన అనుభవాలేమిటనేది లక్ష్మీప్రియదేవి ఆసక్తికరంగా, గుండె చలించేలా చిత్రించారు.ఇది ఒక రకంగా లక్ష్మీప్రియదేవికి బాగా తెలిసిన కథ. తన బాల్యంలో చుట్టూ ఉన్న పరిస్థితులే బూంగ్ కథకు అంకురార్పణ చేశాయని అంటారు లక్ష్మీప్రియదేవి. ఈ చిత్రం తన మణిపుర్ జ్ఞాపకాలలోని తీపి చేదు సమ్మేళనంలాంటిది అంటారు. పరాయివారి పట్ల ద్వేషం, మతవిద్వేషం, వేర్పాటువాదం వంటి అనేక సమస్యలను ‘బూంగ్’ కథలో స్పృశించారు. ఇందులోని మెయిటీ బాలుడి పాత్రను కుకీ–జో వర్గానికి చెందిన గుగున్ కిప్జెన్ పోషించాడు.మణిపూర్లో శాంతి తిరిగి రావాలి.. దర్శకురాలు ఎమోషనల్అవార్డు గెలుచుకున్న తర్వాత దర్శకురాలు దేవి తన ప్రసంగంలో ఎమోషనల్ అయ్యారు. తాము తెరకెక్కించిన బూంగ్ మూవీ ఇంతటి కీర్తిని తీసుకొస్తుందని ఊహించలేదని తెలిపారు. 'మా చిన్న చిత్రానికి ఇంత పెద్ద ప్రేమను అందించినందుకు జ్యూరీ సభ్యులకు, BAFTAకి ధన్యవాదాలు. భారతదేశంలో, నా మాతృభూమి మణిపూర్లో చాలా సమస్యాత్మకమైన అంశాలు ఉన్నాయి. వాటిని అధిగమించి సినిమాను తీశాం. ప్రాతినిధ్యం లేని ప్రదేశంలో పాతుకుపోయిన చిత్రం బూంగ్. మణిపూర్లో శాంతి తిరిగి రావాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. సినిమాలోని బాల నటులతో సహా మా మణిపూర్ పిల్లలందరూ తమ ఆనందాన్ని, వారి కలలను తిరిగి పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. కాబట్టి, BAFTA, మాకు అవార్డును మాత్రమే కాకుండా, మా ఆశను వ్యక్తీకరించడానికి ఈ వేదికను ఇచ్చినందుకు ధన్యవాదాలు.' అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.Lakshmipriya Devi accepts the #EEBAFTAs Children’s and Family Film award for Boong 💫 🗻 pic.twitter.com/TFBnBmDVSx— BAFTA (@BAFTA) February 22, 2026 -
‘బాఫ్తా’ నామినేషన్ల తుది జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’కు దక్కని చోటు
ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రతిష్ఠాత్మక ‘బాఫ్తా’ (బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డు కోసం లాంగ్లిస్ట్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రకటించిన ‘బాఫ్తా’ తుది నామినేషన్ల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి చోటు దక్కలేదు. రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ‘బాఫ్తా’ నాన్ ఇంగ్లిష్ లాంగ్లిస్ట్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. అయితే టాప్ 5తో కూడిన ఫైనల్ లిస్టులో స్థానం కోల్పోయింది. తుది నామినేషన్ల జాబితాలో ‘ఆల్ ౖక్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, కోర్సేజ్, డెసిషన్ టు లీవ్, ద క్వయిట్ గర్ల్’ చిత్రాలు నిలిచాయి. కాగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ’ విభాగంలో ఇండియన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’కి నామినేషన్ దక్కింది. మొత్తం 24 విభాగాల్లో నామినేషన్లు ప్రకటించగా, భారతదేశం నుంచి ‘ఆల్ దట్ బ్రీత్స్’ మాత్రమే నామినేషన్ దక్కించుకుంది. షౌనక్ సేన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 19న ‘బాఫ్తా’ అవార్డుల వేడుక జరగనుంది. మరి.. ‘ఆల్ దట్ బ్రీత్స్’ అవార్డు కూడా గెలుచుకుంటుందా? చూడాలి. -
జోరు మీద బాయ్హుడ్
మరో రెండు వారాల్లో ఆస్కార్ విజేతల ఎవరో తెలుస్తారనగా ఈ లోపే బ్రిటీష్ అకాడమీ టెలివిజన్,ఫిలిం ఆర్ట్స్ (బాఫ్తా) అవార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఆస్కార్ బరిలో హాట్ ఫేవరెట్స్గా ఉన్న ‘బాయ్హుడ్’, ‘బర్డ్మేన్’ చిత్రాలు మరోసారి బాఫ్తా అవార్డుల్లో తలపడ్డాయి. అత్యంత కీలక విభాగాలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను ‘బాయ్హుడ్’ చిత్రం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి చిత్రంపై పడింది.‘బర్డ్మేన్’ కేవలం ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును మాత్రమే దక్కించుకుంది. ఆస్కార్ నామినేషన్స్లో హాట్ ఫేవరె ట్గా ఉన్న మరో చిత్రం‘ ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లంచ్ బాక్స్’కు నిరాశే ఎదురైంది. పోలాండ్ చిత్రం ‘ఇదా’ ఈ విభాగంలో విజేతగా నిలిచింది.


