breaking news
autocratic
-
నిరంకుశ శక్తులతోనే ప్రపంచానికి రిస్కు:హెచ్డీఎఫ్సీ చైర్మన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్ల కన్నా నిరంకుశ శక్తులు, సహకార కొరవడటం, వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకోవడం వంటివే ప్రపంచానికి అతి పెద్ద రిస్కులుగా మారాయని ప్రముఖ బ్యాంకరు, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సంక్షోభాలను ఉటంకిస్తూ .. ప్రపంచం ప్రస్తుతం ఏకకాలంలో అనేక పెను విపత్తులను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ‘దేశాల మధ్య విశ్వాసలేమి, గ్రూపులు కట్టడం వంటివి ఎంతగానో పెరిగిపోయాయి. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. వాణిజ్యాన్ని ఆయుధంగా ప్రయోగించడం, పరస్పర సహకారం కొరవడటం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవి ఆర్థిక సవాళ్ల కన్నా పెద్ద రిస్కులు. ఇప్పటికే ఇంధనం, ప్రకృతి వనరులు, సెమీ-కండక్టర్లు మొదలైన అంశాల్లో మనం వీటిని చూస్తూనే ఉన్నాం‘ అని కోల్కతాలోని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ విభాగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మరికొన్నాళ్లు కొనసాగుతాయన్నారు. రూపాయి పతనం విషయంలో (డాలరుతో పోలిస్తే మారకం విలువ) రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోరాదని, దేశీ కరెన్సీ తనంత తాను సహేతుక స్థాయిని వెతుక్కునేందుకు వదిలేయాలని పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ సూచించినట్లుగా దేశాలు తమ విదేశీ మారక నిల్వలను భవిష్యత్ షాక్లను ఎదుర్కొనేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు మరింత వివేకవంతంగా ఉపయోగించుకోవాలని పరేఖ్ చెప్పారు. -
ప్రభుత్వ నిరంకుశ పోకడపై వైఎస్ఆర్ సీపీ నిరసన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అయితే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హై కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ఈ సమావేశాలకు దూరంగా ఉండి నిరసన తెలుపాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో సమావేశాలను ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శాసన సభలో ప్రతిపక్షం ఇచ్చిన 'అసమ్మతి నోట్' లను పట్టించుకోకుండా ముందుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులపై కుట్రపూరిత ధోరణిలో నివేదికలు రూపొందించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కోర్టు ధిక్కారంపై నేడు హైకోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.