breaking news
auto driver dies
-
అతిగా మద్యం తాగి ఆటోడ్రైవర్ మృతి
అనంతపురం సెంట్రల్: అతిగా మద్యం తాగి ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం గుత్తిరోడ్డులోని ఓ మద్యం దుకాణం దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పిల్లిగుండ్లకాలనీలో నివాసముంటున్న బోయరాజు (35) ఆటోడ్రైవర్గా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన రాజు బుధవారం రాత్రి గుత్తిరోడ్డులో ఓ మద్యం దుకాణంలో ఫుల్లుగా తాగాడు. ఆహారం, మంచి నీళ్లు లేకుండానే ఎక్కువ మోతాదులో మద్యం సేవించడంతో చనిపోయాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. రాజు మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. మొదట హత్యగా భావించినా పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మద్యం సేవించడం వల్లే చనిపోయాడని నిర్ధారించారు. మద్యం షాపులు తొలగించాలని ఆందోళన ఆటో డ్రైవర్ చనిపోవడానికి జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలే కారణమని, వెంటనే వాటిని తొలగించాలని వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. గుత్తిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మద్యం షాపులు తొలగిస్తామని ఎక్సైజ్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ, సీపీఐ నాయకులు లింగమయ్య, అల్లీపీరా, శ్రీరాములు, సీపీఎం నాయకులు ముస్కిన్, మహిళా సమాఖ్య నాయకులు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండలం దొరిగల్లు సమీపంలో సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలం దిగువపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నారాయణస్వామి(32) మరణించినట్లు ఎస్ఐ మగ్బుల్బాషా మంగళవారం తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండలం దిగువపల్లికి చెందిన వెంకటనారాయణరెడ్డి అనే రైతు ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తన వేరుశనగ కాయలను ముదిగుబ్బ మండలం ఎగువపల్లి పరిసర గ్రామాల్లో కొనుగోలు చేసి ఆటోలో స్వగ్రామానికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో దొరిగల్లు వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు తెలిపారు. ఘటనలో ఆటో డ్రైవర్ నారాయణస్వామికి తీవ్ర గాయాలు కాగా, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు వివరించారు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమార్తెలు జాష్ణవి, వైష్ణవి, కుమారుడు చరణ్కుమార్ ఉన్నారు. తండ్రి మృతదేహం వద్ద పిల్లలు విలపించడం చూసి అందరి హృదయాలు బరువెక్కాయి.