-
ఆధారాలు ఇవ్వండి.. లేదా తొలగిస్తాం!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని రాజ్యసభలో ఆరోపణలు చేసిన బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి శుక్రవారం సాయంత్రంలోగా సాక్ష్యాలను చూపాలని, లేకుంటే ఈ అంశంపై చర్చలో ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అన్నారు. సుబ్రమణ్యం స్వామి వద్ద కాంగ్రెస్ నేతలు తప్పు చేశారని ఏవైనా ఆరోపణలు ఉన్నాయా? అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ శుక్రవారం సాయంత్రం 6 గంటలలోగా డాక్యుమెంట్లను సభ ముందు ఉంచాలని ఆదేశించారు. సాయంత్రం 6 గంటల్లోగా చేయకపోతే సుబ్రమణ్యం స్వామి ఆరోపణలన్నీ ఆధారాలు లేనివిగా భావించి రికార్డుల నుంచి తొలగిస్తామని తెలిపారు. -
'అగస్టా'తో ఎలాంటి ఒప్పందం జరగలేదు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీతో హెలికాప్టర్ల కోసం ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే 2015 ఏప్రిల్ లో నరేంద్రమోదీ ప్రభుత్వం 100 నావల్ హెలికాప్టర్ల కొనుగోలు చేయడానికి అనుమతించిందని ప్రతిపక్షం ఆరోపిస్తోందని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అసలు హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా అగస్టాను బిడ్ కోసం ఎలా పిలుస్తుందని.. మేక్ ఇన్ ఇండియా ద్వారా భారత్ లో ఆ హెలికాప్టర్ల తయారీ కోసం ప్రభుత్వం చూస్తోందని తెలిపింది. నావెల్ అవసరాల కోసం కొనుగోలు చేయాలనుకున్న హెలికాప్టర్ల కోసం 2012 ఆగష్టు 4న టెక్నో కమర్షియల్ రిక్వెస్ట్ ప్రపొజల్ (ఆర్ఎఫ్ పీ) ఎనిమిది సంస్థలకు బిడ్ అవకాశన్ని ఇచ్చిందని వివరించింది. అందుకు సమాధానంగా యూరోకాప్టర్స్, అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీలు 2013 మార్చి 4 వాటి ప్రపోజల్స్ ను అందజేశాయంది. 2014 అక్టోబర్ 13న ఆర్ఎఫ్ పీ వాటిని పరిశీలనలోకి తీసుకుందని కేంద్రం తెలిపింది. కాగా ఓ కుంభకోణంలో ఉన్న కంపెనీను మేక్ ఇన్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు భాగస్వామ్యం చేయదలుచకుందో చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కేసులో నిజానిజాలను వెలికితీయడానికి అవసరమైన చర్యలు చేపట్టామని చాపర్ కేసులో దోషులకు శిక్ష విధిస్తామని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. సీబీఐ, ఈడీలు కేసులో అన్ని విషయాలను క్షుణ్ణంగా విచారిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులుగా ఉన్న ముగ్గురు విదేశీయులు కార్లో జెరోసా, రాల్ఫ్, క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ ల అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు వివరించింది. సీబీఐ ఇప్పటివరకు ఈ కేసులో 100 మందిని విచారించిందని కొంతమంది నిందితుల ఆస్తులపై అధికారాలను సీబీఐ 2014లోనే తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. విదేశాల్లో విచారణ కోసం సీబీఐ, ఈడీలు ఇప్పటికే స్విట్జర్లాండ్, మారిషస్, ఇటలీ, బ్రిటన్, సింగపూర్, వర్జీనియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టునీషియా తదితర దేశాలకు లేఖలు పంపినట్లు కేంద్రం వివరించింది. -
హెలికాప్టర్ల అవినీతికి మధ్యవర్తి ఈయనే
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల డీల్లో అవినీతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వెస్ట్ ల్యాండ్తో డీల్ వ్యవహారం అనంతరం భారతీయ మీడియాతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అగస్టా వెస్ట్ ల్యాండ్ మధ్యవర్తికి ఆరు మిలియన్ పౌండ్లను ఇచ్చినట్లు తెలిసింది. 2010-2012 మధ్య కాలంలో హెలికాప్టర్ల కొనుగోలు గురించి ఎటువంటి దుష్ర్ఫచారం లేకుండా చేయడానికి అగస్టా కంపెనీ క్రిష్టియన్ మైఖేల్ అనే వ్యక్తి డబ్బును సమకూర్చింది. మొత్తం 3,546 వేల కోట్ల రూపాయల ఈ డీల్లో 12 అగస్టా వెస్ట్ల్యాండ్ 101 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ఫోర్స్కు అందించేందుకు 2010లో ఒప్పందం జరిగింది. స్కామ్తో సంబంధం ఉన్న మైఖేల్ను పట్టుకోవడానికి ఈడీ ఇంటర్పోల్కు ఫిబ్రవరి 4న లేఖను రాసింది. ప్రస్తుతం మైఖేల్ దుబాయ్లో ఉన్నట్లు కనుగొన్న ఈడీ, సీబీఐలు అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాయి. 2013లో బయటపడిన ఈ స్కామ్లో దేశ కీలక రాజకీయ నేతలతో పాటు మిలటరీ అధికారులు అగస్టా వెస్ట్ ల్యాండ్కి 610మిలియన్ డాలర్లకు బిడ్ దక్కేలా చేసేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్పై కుట్ర, మోసం, అవినీతికి మధ్యవర్తిత్వం నిర్వర్తించడం తదితర చట్టాలపై కేసులు నమోదు చేశారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కాంగ్రెస్కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement