breaking news
Ashwani Kumar
-
IPL 2025: ముంబై బోణీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు 18వ సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎడంచేతి వాటం యువ పేస్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లో చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టాడు. పంజాబ్కు చెందిన అశ్వని తన ప్రతిభతో ముంబై జట్టుకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. 23 ఏళ్ల అశ్వని 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కోల్కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు ఆద్యంతం దూకుడుగా ఆడింది. కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధనాధన్ ఆటతీరుతో అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. ముంబై గెలుపుతో ప్రస్తుత సీజన్లో మొత్తం 10 జట్లూ పాయింట్ల ఖాతా తెరిచినట్టయింది. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్గా ఘనత వహించిన అశ్వని కుమార్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తడబడుతూనే... కోల్కతాకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్లో నరైన్ (0)ను బౌల్ట్ డకౌట్ చేయగా... రెండో ఓవర్లో డికాక్ (1)ను దీపక్ చహర్ పెవిలియన్కు పంపించాడు. మూడో ఓవర్లో అశ్వని తాను వేసిన తొలి బంతికే కెప్టెన్ రహానేను అవుట్ చేశాడు. అశ్వని వేసిన వైడ్ బంతిని రహానే వేటాడి భారీ షాట్ ఆడగా... డీప్ మిడ్వికెట్ వద్ద తిలక్ వర్మ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోల్కతా 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్కతాను ఆదుకుంటాడని భావించి వెంకటేశ్ అయ్యర్ (3) మళ్లీ నిరాశపరచగా... క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన రఘువంశీ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో 7 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా సగంజట్టు పెవిలియన్ చేరింది. ఈ దశలో ఆరో వికెట్కు 29 పరుగులు జోడించి... క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రింకూ సింగ్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అశ్వని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో కోల్కతా కోలుకోలేకపోయింది. చివరి ఆశాకిరణం రసెల్ (5)ను అశ్వని 13వ ఓవర్లో బౌల్డ్ చేయడంతో కోల్కతా స్కోరు 100 దాటుతుందా లేదా అనుమానం కలిగింది. అయితే రమణ్దీప్ సింగ్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) పుణ్యమాని కోల్కతా స్కోరు వంద దాటింది. 17వ ఓవర్లో చివరి వికెట్గా రమణ్దీప్ వెనుదిరగడంతో కోల్కతా ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ విఫలం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ (12 బంతుల్లో 13; 1 సిక్స్) తొలి వికెట్కు 46 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. రోహిత్ అవుటైనా మరోవైపు రికెల్టన్ తన ధాటిని కొనసాగించడంతో ముంబైకు ఏ దశలోనూ ఇబ్బంది కాలేదు. విల్ జాక్స్ (17 బంతుల్లో 16; 1 సిక్స్)తో రికెల్టన్ రెండో వికెట్కు 45 పరుగులు జోడించాడు. జాక్స్ అవుటయ్యాక వచ్చిన సూర్యకుమార్ (9 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో 13వ ఓవర్లోనే ముంబైను లక్ష్యానికి చేర్చాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డికాక్ (సి) అశ్వని కుమార్ (బి) దీపక్ చహర్ 1; సునీల్ నరైన్ (బి) బౌల్ట్ 0; అజింక్య రహానే (సి) తిలక్ వర్మ (బి) అశ్వని కుమార్ 11; అంగ్క్రిష్ రఘువంశీ (సి) నమన్ ధీర్ (బి) హార్దిక్ పాండ్యా 26; వెంకటేశ్ అయ్యర్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 3; రింకూ సింగ్ (సి) నమన్ ధీర్ (బి) అశ్వని కుమార్ 17; మనీశ్ పాండే (బి) అశ్వని కుమార్ 19; ఆండ్రీ రసెల్ (బి) అశ్వని కుమార్ 5; రమణ్దీప్ సింగ్ (సి) హార్దిక్ పాండ్యా (బి) సాంట్నెర్ 22; హర్షిత్ రాణా (సి) నమన్ ధీర్ (బి) విఘ్నేశ్ 4; స్పెన్సర్ జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–25, 4–41, 5–45, 6–74, 7–80, 8–88, 9–99, 10–116. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–23–1, దీపక్ చహర్ 2–0–19–2, అశ్వని కుమార్ 3–0–24–4, హార్దిక్ పాండ్యా 2–0–10–1, విఘ్నేశ్ పుథుర్ 2–0–21–1, మిచెల్ సాంట్నెర్ 3.2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హర్షిత్ రాణా (బి) రసెల్ 13; రికెల్టన్ (నాటౌట్) 62; విల్ జాక్స్ (సి) రహానే (బి) రసెల్ 16; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 27; ఎక్స్ట్రాలు 3; మొత్తం (12.5 ఓవర్లలో 2 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–46, 2–91. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 2–0–14–0, హర్షిత్ రాణా 2–0–28–0, వరుణ్ చక్రవర్తి 3–0–12–0, రసెల్ 2.5–0–35–2, సునీల్ నరైన్ 3–0–32–0. -
రూపాయి పతనం ఎగుమతులకు ఊతమే కానీ...
న్యూఢిల్లీ: రూపాయి బలహీనపడటమనేది దేశీ ఎగుమతులకు ఊతమిచ్చేదే అయినప్పటికీ వాస్తవ పరిస్థితులు సంక్లిష్టంగా ఉంటాయని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్వని కుమార్ వ్యాఖ్యానించారు. చాలా మటుకు భారతీయ ఎగుమతిదారులు.. ముడివస్తువులు, విడిభాగాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారని ఆయన చెప్పారు. రూపాయి గణనీయంగా పడిపోతే ముడివస్తువుల వ్యయాలు పెరిగిపోయి సదరు ఎగుమతిదారులపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా కరెన్సీ క్షీణత ప్రయోజనాలు పెద్దగా లభించవని వివరించారు. ‘బలహీన రూపాయి ప్రభావమనేది ఎగుమతిదారులందరిపైనా ఒకే తరహాలో ఉండదు. ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ పతనానికి మూలకారణాలను సరిదిద్దడానికి వ్యూహాత్మకమైన, బహుముఖ విధానం అవసరమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు రూపాయి రెండు శాతమే క్షీణించినా, పోటీ దేశాల కరెన్సీలు అంతకన్నా ఎక్కువగా 3–5 శాతం పడిపోతే, గ్లోబల్ మార్కెట్లలో భారత ఎగుమతిదారులు పోటీపడే పరిస్థితి ఉండదని కుమార్ తెలిపారు. రూపాయి పతనం వల్ల ముడి వస్తువుల ధరలు, కరెన్సీ మారకం రేటులో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విదేశీ రుణాల భారం మొదలైనవన్నీ కూడా పెరిగిపోతాయని ఆయన చెప్పారు.ఆర్బీఐ జోక్యం ఎగుమతులకు ప్రతికూలండాలరు బలోపేతం అవుతుండటం వల్ల ఇతర కరెన్సీల్లాగే రూపాయి కూడా పతనమవుతోంది. ఇలాంటప్పుడు రూపాయి మాత్రమే హఠాత్తుగా పతనమైతేనో లేక తీవ్ర ఒడిదుడుకులకు లోనైతేనో తప్ప దాన్ని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే భారతీయ ఎగుమతిదార్లకు ప్రతికూలమవుతుంది. – రఘురామ్ రాజన్, మాజీ గవర్నర్, ఆర్బీఐ రూపాయి అధిక స్థాయిలో ఉందిరూపాయి విలువ ప్రస్తుతం అధిక స్థాయిలో ఉండటంతో అంతర్జాతీయంగా మన ఎగుమతి సంస్థలు పోటీపడటంపై ప్రతికూల ప్రభావం ఉంటోంది. కాబట్టి ఆర్థిక ఫండమెంటల్స్కి తగ్గ స్థాయికి రూపాయిని చేరుకోనివ్వాలి. రూపాయి క్షీణతను కొనసాగనివ్వడం వల్ల ఎగుమతులకు, అలాగే వృద్ధి సాధనకు సహాయకరంగా ఉంటుంది. – దువ్వూరి సుబ్బారావు, మాజీ గవర్నర్, ఆర్బీఐ -
మాజీ గవర్నర్ ఆత్మహత్య
సిమ్లా : సీబీఐ మాజీ డైరెక్టర్, నాగాలాంగ్ మాజీ గవర్నర్ అశ్వనీకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సిమ్లా ఎస్పీ మెహిత్ చావ్లా వెల్లడించారు. అశ్వనీకుమార్ 2006 నుంచి 2008 వరకు హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. అనంతరం 2008 ఆగస్ట్ నుంచి 2010 నవంబర్ వరకు సీబీఐ డైరెక్టర్గా పనిచేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది. -
‘టూరింగ్ టాకీస్’ ముచ్చట్లు
సినిమాకు, ప్రేక్షకుల మధ్య ప్రధాన వారధి టూరింగ్ టాకీస్. ఆదిలో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది, అలరించింది ఈ టూరింగ్ టాకీస్లోనే. ఆ తరువాత కాలానుగుణంగా టూరింగ్ టాకీస్ల చోటే పెద్ద పెద్ద సినిమా మాల్స్ నిలిచా యి. ఇందతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పూర్వం రోజుల్ని గుర్తు తెచ్చేలా టూరింగ్ టాకీస్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. దీన్ని రూపొం దించింది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు, ఇళయ దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో పలు విజ యవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఎస్ఏ చం ద్రశేఖర్ తన 69వ చిత్రంగా ఈ టూరింగ్ టాకీస్ రూపొందించాడు. మరో విశేషం ఏమిటంటే తన చిత్రంలో అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరిసిన ఈ దర్శక, నిర్మాత టూరింగ్టాకీస్లో ప్రధాన పాత్రలో నటించారు. ఇది రెండు కథలతో కూడిన ఒక చిత్రం. అంతేకాదు టూరింగ్ టాకీస్ దర్శకుడిగా తన చివరి చిత్రం అని వెల్లడించేశారు. అభి శరవణ్, అశ్వినీకుమార్, సూనులక్ష్మి, గాయత్రి మొదలగు వారు యువ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కెవి స్టూడియోలో జరిగింది. కాగా రెండు కథలలో ఒక చిత్రం తెరకెక్కించిన ఎస్ఏ చంద్రశేఖర్ ఇదే వేదికపై ఆదివారం జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సభ్యుల బృందానికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా చాలా చిత్రాలు చేశానన్నారు. అయితే ఇప్పటికీ ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తూ పనిచేస్తానన్నారు. అయినా తాను సాధించిందేమీ లేదన్నారు. విజయ్ను హీరోగా చేయమని చాలామంది చుట్టూ తిరిగా తన కొడుకు విజయ్ నటించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు తాను ఎంతైన ఖర్చు పెడుతానని చిత్రం చేయమని చాలామంది దర్శకులను అడిగానన్నారు. అయితే ఎవ్వరూ చేయడానికి ముందుకు రాకపోవడంతో తానే ఎందుకు దర్శక, నిర్మాతగా చేయరాదనే ఆలోచన రావడంతో విజయ్ హీరోగా చిత్రం చేశానని తెలిపా రు. ఆ తరువాత అతను నటుడిగా ఏ స్థాయికి ఎదిగారో తెలిసిందేనని అన్నారు. ఇక టూరింగ్ టాకీస్ గురించి చెప్పాలంటే తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రం చేయాలన్న ఆలోచనకు ప్రతిరూపం ఈ చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా ఇదే తన చివరి చిత్రం అన్నమాట నిజమేనని అయితే ఇంతకుముందు చట్టం ఒరు ఇరుట్టరై చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ అంటూ పలుభాషలలో తెరకెక్కించానని అదే విధంగా ఈ టూరింగ్ టాకీస్ను కూడా పలు భాషలలో రూపొందించనున్నట్లు ఎస్ఏ చంద్రశేఖర్ వెల్లడించారు. -
జెలియాంగ్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నాగాలాండ్ రాజధాని కోహిమాలోని రాజభవన్లో జెలియాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ అశ్వనీ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జెలియాంగ్తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటి వరకు నాగాలాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్న నైపూ రియో సీఎం పదవికి, శాసనసభా స్థానానికి శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన నైపూ రియో 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే జెలియాంగ్కు భారతదేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.