breaking news
Anita Radhakrishnan
-
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్పై కేసు నమోదు అయింది. బీజేపీ ఫిర్యాదు మేరకు టుటికోరిన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమల్ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా?. కమల్ రాజు మిమ్మల్ని కమల్ రాజు హత్తకున్నట్లు చెబుతున్నారని ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ‘డీఎంకే నేతలు అసభ్య వ్యాఖ్యలు చేయటంలో దిగజారిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై క్షమించరని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది డీఎంకే నేత స్థాయి. డీఎంకే నేత కనిమోళి సమక్షంలోనే మోదీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అడ్డుకోక పోగా ఆమె చూస్తూ ఉండిపోయారు. మేము ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళతాం. డీఎంకే నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతాం’అని అన్నామలై ఎక్స్ వేదికగా తెలిపారు. DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl. When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir — K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024 ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని దివంగత తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు తీసుకువచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం తనకు ఎంతో స్పూర్తీ అని పేర్కొన్నారు. ఇక..గత నెల కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్ప్యాడ్ నిర్మాణానికి శుంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికే ఓ పత్రికా ప్రకటనలో చైనా జెండా ముద్రించటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ పత్రికా ప్రకటన చేసింది కూడా మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణ కావాటం గమనార్హం. అప్పుడు కూడా బీజేపీ నేతల చేత తీవ్ర విమర్శలు పాలయ్యారు అనిత రాధాకృష్ణన్. -
ఉద్వాసన
అనిత, స్వామి అవుట్ డీఎంకే అధిష్టానం నిర్ణయం అమ్మ జపం దెబ్బ సాక్షి, చెన్నై : తన పార్టీలో ఉంటూ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులపై డీఎంకే అధినేత కరుణానిధి కన్నెర్ర చేశారు. ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్, మాజీ మంత్రి కరుప్పుస్వామి పాండియన్లకు ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ గురువారం ప్రకటించారు. తూత్తుకుడి జిల్లా రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపును కల్గిన నాయకుడు అనితా రాధాకృష్ణన్, తిరునల్వేలి జిల్లాలో తన కంటూ బలగాన్ని కల్గిన నేత కరుప్పుస్వామి పాండియన్. ఈ ఇద్దరు ఒకప్పుడు అన్నాడీఎంకే నాయకులే. ఆ పార్టీ ప్రభుత్వ పాలనలో మంత్రులుగా కూడా పనిచేశారు. పార్టీలో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చిన ఈ ఇద్దరు డీఎంకే గొడగు నీడన ఆశ్రయం పొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచెందూరు నియోజకవర్గం నుంచి అనితా రాధాకృష్ణన్ విజయ కేతనం ఎగుర వేశారు. ఇక, తిరునల్వేలిలో కరుప్పు స్వామి పాండియన్ ఓటమి చవి చూశారు. డీఎంకే జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు ఇటీవలి సంస్థాగత ఎన్నికలు ఆ పదవి దూరం చేశాయి. కొంత కాలంగా డీఎంకేతో అంటి ముట్టనట్టుగా ఈ ఇద్దరు వ్యవహరిస్తూ వచ్చారు. తిరునల్వేలిలో డీఎంకే మాజీ స్పీకర్ అవుడయప్పన్తో పెరిగిన వైర్యం కరుప్పు స్వామి పాండియన్కు పార్టీలో గడ్డు పరిస్థితులు సృష్టించాయి. ఇక డీఎంకేలో ఇమడ లేమన్న నిర్ణయానికి వచ్చిన ఈ నేతలు మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు తమ తమ ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు అదునైన సమయం కోసం వేచి చూశారు. అమ్మకు అభినందన : అన్నాడీఎంకేలోకి ఎలా వెళ్లాలో ఎదురు చూసిన ఈ నేతలకు ఆ పార్టీ అధినేత్రి జయలిత విడుదల తీర్పు మార్గాన్ని చూపించింది. ఇదే అదనుగా భావించిన అనితా రాధాకృష్ణన్ ఏకంగా నాలుగు అడుగులు ముందుకు వేశారు. అమ్మకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, అమ్మ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయితే, తన పదవికి రాజీనామా చేయడానికి రెడీ అని ప్రకటించారు. తిరుచెందూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని విన్నవించారు. తానేమి తక్కువ తిన్నానా అన్నట్టుగా కరుప్పు స్వామి పాండియన్ మరింతగా రెచ్చి పోయారు. తన ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణ సంచాలు పేల్చుతూ, అమ్మ విడుదల ఆనందాన్ని అందరితో భారీ సంబరాలతో పంచుకున్నారు. ఉద్వాసన : వీరి చర్యలు డీఎంకే అధినేత కరుణానిధికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆ ఇద్దరిపై చర్యకు సిద్ధం అయ్యారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ద్వారా ఆ ఇద్దరికి ఉద్వాసన పలుకుతూ ఆదేశాలు ఇప్పించారు. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ఇద్దర్ని తాత్కాలికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని పదవుల నుంచి వారిని సస్పెండ్ చేసినట్టు, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా వారి పేర్లను తొలగించినట్టుగా వెల్లడించారు. తమను ఎప్పుడెప్పుడు బయటకు పంపిస్తారా..? అన్న ఎదురు చూపుల్లోనూ ఆ ఇద్దరు నేతలు ఉండడం గమనార్హం. ఇక ఆ ఇద్దర్నీ మళ్లీ పార్టీలోకి జయలలిత ఆహ్వానిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. ఎందుకంటే, ఆ ఇద్దరు గతంలో ఏకంగా జయలలితతో ఢీకొట్టి బయటకు రావడమే. ఇది వరకు ఓ మారు అన్నాడీఎంకేలోకి మళ్లీ వెళ్లేందుకు అనిత యత్నించినా, అందుకు ఆస్కారం లభించకపోవడం గమనించాల్సిన విషయం.