breaking news
animal welfare community
-
స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వు పట్ల జంతు ప్రేమికుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో.. ఆ ఉత్తర్వులో మార్పులు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కుక్కలకు స్టెరిలైజేషన్(పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స) పూర్తి చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని తేల్చిచెప్పింది. రేబిస్ వంటి వ్యాధులు, ఆవేశపూరిత, విపరీత ప్రవర్తన ఉన్న కుక్కలను మాత్రం స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అనంతరం ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వు అత్యంత కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అంగీకరించింది. వీధి కుక్కల బెడద దేశమంతటా ఉన్నట్లు గుర్తుచేసింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాణాలు సైతం కోల్పోతున్నారని, అందుకే దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణకు ఒక జాతీయ విధానం తీసుకొచ్చే విషయం ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారంపై ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కుక్కలన్నింటినీ 8 వారాల్లోగా బంధించి, షెల్టర్లకు తరలించాలంటూ జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను జంతు ప్రేమికులు తప్పుబట్టారు. దాంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ త్రిసభ్య ధర్మాసనానికి ఇప్పగించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టింది. తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అన్ని కుక్కలను బంధించి, షెల్టర్కు తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే.. → వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం నేరం. ఉల్లంఘించినవారికి శిక్ష తప్పదు. → వాటికి ఆహారం అందించడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వీధుల్లో ఇళ్ల ముందు కుక్కలకు అన్నం పెట్టినవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. → వీధి కుక్కలను జంతు ప్రేమికులు దత్తత తీసుకోవచ్చు. వాటిని వారు సరిగ్గా సంరక్షించాలి. మళ్లీ వీధుల్లోకి వదిలేయకూడదు. → ఢిల్లీలో వీధి కుక్కలను కాపాడాలంటే పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి రూ.25,000, ఎన్జీఓలు రూ. 2 లక్షల చొప్పున కోర్టులో డిపాజిట్ చేయాలి. → కుక్కల సమస్యకు సంబంధించిన హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నాం. ఒక జాతీయ పాలసీని రూపొందించే దిశగా విచారణ చేపడతాం. → వీధి కుక్కల కేసులో కేవలం ఢిల్లీని మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేరుస్తున్నాం. → సుప్రీంకోర్టు తాజా తీర్పు పట్ల జంతు ప్రేమికులు హర్షం వ్యక్తంచేశారు. -
కామెడీ పెట్ ఫోటో అవార్డ్స్ 2021 ఫైనలిస్ట్లు
లండన్: ఏడాది కామెడీ పెట్ ఫోటో అవార్డ్స్ 2021కి దాదాపు 40 ఫోటోలు ఫైనల్ రేసులో నిలిచాయి. ఇవన్నీ ఒకదానికొకటి చాలా అత్యంత వినోధభరితంగానూ, ఆశ్చర్యంగానూ ఉన్నాయి. వీటిలో ఫోటోగ్రాఫర్ నైపుణ్యతతోపాటు వాటిలో ఏదో ఆసక్తికర సన్నివేశం దాగి ఉన్నట్లు అనిపిస్తోంది కదూ. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సుమారు 2 వేల ఫోటోల నుంచి దాదాపు 40 చిత్రాలు ఫైనల్కి ఎంపికవ్వడం విశేషం. (చదవండి: అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!) ఈ కామెడీ పెట్ ఫోటో అవార్డులను పాల్ జాయిన్సన్-హిక్స్, టామ్ సుల్లమ్లు రూపొందించారు అంతేకాదు మనుషులతో జంతువులు ఏవిధంగా అనుబంధం పెంచుకుంటాయో అనే దాని గురించి వివరించడమే కాక, జంతు సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవార్డ్సును రూపోందించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ పోటీని యానిమల్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో నిర్వహించడమే కాక జంతు సంరక్ష మద్దతుదారులకు సూమారు 10 వేల పౌండ్లను విరాళంగా ఇస్తోంది ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఫన్నీ పెట్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) -
మెడికోలకు రూ.4 లక్షల జరిమానా
- వీధికుక్కను వేధించిన కేసులో తీర్పు సాక్షి ప్రతినిధి, చెన్నై రోగులకు ప్రాణాలు పోసే వైద్యవృత్తిని అభ్యసిస్తున్న ఇద్దరు మెడికోలు వీధికుక్కపై రాక్షసంగా ప్రవర్తించిన ఫలితంగా రూ.4 లక్షలు జరిమానా చెల్లించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై కున్రత్తూరుకు చెందిన సుదర్శన్, ఆశిష్ అనే ఇద్దరు వైద్య విద్యార్థులు ఒక వీధికుక్కను మూడో అంతస్తుపై నుంచి కిందకు విసిరివేశారు. ఈ వికృతచేష్టను మొబైల్లో చిత్రీకరించి ఆనందించారు. అంతేగాక ఈ దృశ్యాన్ని వాట్సాప్లో పెట్టి పలువురికి తమ ఘనతను చాటుకున్నారు. ఆరు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. జంతుసంక్షేమ సంఘం ప్రతినిధి ఆంథోనీ సదరు మెడికోలను గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు మెడికోలు శ్రీపెరంబుదూరు న్యాయస్థానంలో లొంగిపోయారు. వీరిద్దరినీ మెడికల్ కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. అదృష్టవశాత్తు తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బైటపడిన కుక్కకు జంతుప్రేమికులు భద్ర అని పేరుపెట్టి అత్యున్నత చికిత్స అందజేశారు. కుక్క చికిత్సకు అయిన ఖర్చును, అపరాధం చెల్లించేలా మెడికోలను ఆదేశించాల్సిందిగా మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చెరి రూ.2 లక్షలను జంతు సంరక్షణ కేంద్రానికి చెల్లించాల్సిందిగా కోర్టు నియమించిన విచారణ బృందం మెడికోలను ఆదేశించింది. రూ.4 లక్షలను చెల్లించారు. దీంతో మెడికోల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి అడ్మిషన్ కల్పించాల్సిందిగా వైద్యకళాశాల యాజమాన్యాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది.