breaking news
Amir Jangoo
-
జాంగూ డబుల్ ధమాకా.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్
ఆంటిగ్వా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక రెండు ఇన్నింగ్స్ల్లో ఆలౌట్ కాగా.. విండీస్ ఒకే ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి, ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌటైన విండీస్.. రెండో ఇన్నింగ్స్లో 101 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. విండీస్ బౌలర్లు (11-0-5-4), జేడన్ సీల్స్ (10.2-3-14-3), షమార్ జోసఫ్ (5-0-19-2), అల్జరీ జోసఫ్ (5-1-11-1) లంక బ్యాటర్లకు చుక్కులు చూపించారు. వీరి ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. దినేశ్ చండీమల్ (43), సోనల్ దినుష (12 నాటౌట్) మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.అంతకుముందు అమిర్ జాంగూ (233) డబుల్ సెంచరీతో, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (194) భారీ శతకంతో కదంతొక్కడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 626 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాంగూ-ఛేజ్ ఆరో వికెట్కు రికార్డు స్థాయిలో 401 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మిలన్ ప్రియానాథ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అషిత ఫెర్నాండో, సోనల్ దినుష తలో 2 వికెట్లు తీశారు.దీనికి ముందు ధనుంజయ డిసిల్వ (120) సెంచరీతో కదంతొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు చేసింది. దినేశ్ చండీమల్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. దినుష 43 పరుగులతో పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో గ్రీవ్స్ 3, రోచ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్ తలో 2, సీల్స్ ఓ వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్ రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగింది. రెండో టెస్ట్ అంటిగ్వా వేదికగానే జులై 3న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ల కోసం శ్రీలంక వెస్టిండీస్లో పర్యటిస్తుంది. టెస్ట్లకు ముందు 3 మ్యాచ్ల టీ20 సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరిగాయి. వన్డే సిరీస్ను శ్రీలంక (1-0), టీ20 సిరీస్ను వెస్టిండీస్ (2-1) చేజిక్కించుకున్నాయి. -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ స్టార్లు.. టెస్టు హిస్టరీలోనే తొలిసారి
సొంతగడ్డపై శ్రీలంకతో తొలి టెస్టులో వెస్టిండీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. నార్త్ సౌండ్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంకను తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకే ఆలౌట్ చేసింది.లంకను కట్టడి చేసి..లంక బ్యాటర్లలో దినేశ్ చండీమాల్ అర్ధ శతకం (54)తో ఆకట్టుకోగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ శతకం (120) సాధించాడు. మిగిలిన వారిలో కుశాల్ మెండిస్ 43 పరుగులతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్ మూడు, కేమార్ రోచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్ తలా రెండు వికెట్లు తీయగా.. జేడన్ సీల్స్కు ఒక వికెట్ దక్కింది.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (39), బ్రాండన్ కింగ్ (31) వికెట్లు కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన కేవమ్ హాడ్జ్ (16) కూడా నిరాశపరిచాడు.ఆమిర్ డబుల్ సెంచరీవికెట్ కీపర్ బ్యాటర్ జాషువా డా సిల్వా (20) విఫలం కాగా.. జస్టిన్ గ్రీవ్స్ (3) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ ఆమిర్ జాంగూ, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్ను గాడినపెట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆమిర్ 373 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 233 పరుగులు సాధించాడు.రోస్టన్ జస్ట్ మిస్ఇక రోస్టన్ ఛేజ్ 324 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 194 పరుగులు రాబట్టాడు. అయితే, దురదృష్టవశాత్తూ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అల్జారీ జోసెఫ్ 21, షమార్ జోసెఫ్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. ఫలితంగా 160.5 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 626 పరుగుల భారీ స్కోరు సాధించిన వెస్టిండీస్.. తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.401 పరుగుల పార్ట్నర్షిప్ఇదిలా ఉంటే.. శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా ఆమిర్ జాంగూ- రోస్టన్ ఛేజ్ ప్రపంచ రికార్డు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 401 పరుగుల పార్ట్నర్షిప్ సాధించి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు.ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ జోడీ జానీ బెయిర్స్టో- బెన్ స్టోక్స్ పేరు మీద ఉండేది. సౌతాఫ్రికాతో 2016 నాటి టెస్టులో వీరు ఆరో వికెట్కు 399 పరుగులు జోడించారు. ఇప్పుడు బెయిర్స్టో-స్టోక్స్ను ఆమిర్- రోస్టన్ అధిగమించారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. విండీస్ కంటే 303 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: భారత్తో మ్యాచ్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే? -
శ్రీలంక 308 ఆలౌట్.. వెస్టిండీస్ స్కోరెంతంటే?
శ్రీలంకతో తొలి టెస్టులో వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. నార్త్ సౌండ్ వేదికగా శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు.. రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక విండీస్ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా పర్యాటక లంక జట్టు.. 1-0 తేడాతో గెలిచింది. మిగిలిన రెండు మ్యాచ్లు వర్షం వల్ల రద్దైపోయాయి. ఇక టీ20 సిరీస్ను మాత్రం ఆతిథ్య కరేబియన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది.సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 71.5 ఓవర్లలో కేవలం 308 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (168 బంతుల్లో 120; 17 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. టెస్టు క్రికెట్లో అతడికిది 13వ శతకం. మిగిలిన వారిలో దినేశ్ చండీమల్ (67 బంతుల్లో 54; 8 ఫోర్లు), సోనాల్ దినుషా (43; 6 ఫోర్లు) రాణించారు.ఇక విండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రేవ్స్ 3 వికెట్లు పడగొట్టగా ... రోచ్, అల్జారీ జోసెఫ్, షామార్ జోసెఫ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్కు ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (39), బ్రాండన్ కింగ్ (31) మెరుగైన ఆరంభం అందించారు.వన్డౌన్ బ్యాటర్ కేవెమ్ హాడ్జ్ (16) విఫలం కాగా.. ఆమిర్ జాంగో అజేయ అర్ధ శతకం (78)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ జోషువా డిసిల్వా (20), జస్టిన్ గ్రీవ్స్ (3) ఫెయిల్ కాగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 105 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసిన విండీస్.. శ్రీలంక కంటే కేవలం 37 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, మిలాన్ప్రియాంత్ రత్ననాయకే చెరో రెండు.. సోనాల్ దినుషా ఒక వికెట్ దక్కించుకున్నారు.చదవండి: ఐర్లాండ్ చేతిలో ఓటమి.. కెప్టెన్గా నాకు గొప్ప ఆరంభం -
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
నేపాల్తో టీ20 సిరీస్కు వెస్టిండీస్ (WI vs NEP) క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయీ హోప్నకు విశ్రాంతినిచ్చిన విండీస్ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ అకీల్ హొసేన్ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.కాగా షార్జా వేదికగా వెస్టిండీస్ జట్టు నేపాల్తో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుకెప్టెన్ షాయి హోప్ (Shai Hope)తో పాటు పేసర్ అల్జారీ జోసెఫ్, బ్యాటర్ జాన్సన్ చార్లెస్ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్లో అకీల్ హొసేన్ సారథ్యంలో జేసన్ హోల్డర్, ఫాబియాన్ అలెన్, కైల్ మేయర్స్ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్ ఆటగాళ్లు నేపాల్తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్ అకీమ్ ఆగస్టీ, ఆల్రౌండర్ నవీన్ బిడైసీ, స్పిన్నర్ జీషన్ మొతారా, పేసర్ రామోన్ సైమండ్స్, కీపర్ అమీర్ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.నేపాల్తో టీ20 సిరీస్కు వెస్టిండీస్ జట్టుఅకీల్ హొసేన్ (కెప్టెన్), ఫాబియాన్ అలెన్, జువెల్ ఆండ్రూ, అకీమ్ ఆగస్టీ, నవీన్ బిడైసీ, జెడియా బ్లేడ్, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్ హోల్డర్, అమీర్ జాంగూ, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, జీషన్ మొతారా, రామోన్ సైమండ్స్, షమార్ స్ప్రింగర్.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్ తమ జట్టు వివరాలను వెల్లడించింది.టీమిండియాతో టెస్టులకు విండీస్ జట్టు వివరాలురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్ చందర్పాల్, బ్రెండన్ కింగ్, కెవ్లాన్ అండర్సన్, షై హోప్, జాన్ క్యాంప్బెల్, అతనాజ్, ఇమ్లాక్, గ్రీవ్స్, అండర్సన్ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, ఖారీ పైర్, జోమెల్ వారికాన్. చదవండి: ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు! -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడికి చోటు
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్(Pakistan) పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా విండీస్ ఆతిథ్య పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ముల్తాన్ వేదికగా ఈ రెండు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది.ఈ క్రమంలో ఈ సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీర్ జంగూ(Amir Jangoo)కు తొలిసారి విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. జంగూ ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్రంలోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా జంగూ వరల్డ్ రికార్డు సృష్టించాడు.అంతేకాకుండా దేశీవాళీ రెడ్ బాల్ టోర్నీల్లో సైతం అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు గాయం కారణంగా బంగ్లాతో టెస్టు సిరీస్కు దూరమైన స్పిన్నర్ గుడాకేష్ మోతీ తిరిగి ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు.అదేవిధంగా విండీస్ స్పీడ్ స్టార్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరో స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ ఇతర ఒప్పందాల కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేడు. జోసెఫ్ సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ఆడనున్నాడు.వెస్టిండీస్ టెస్టు జట్టు: క్రైగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా, అలిక్ అథానాజ్, కీసీ కార్తీ, జస్టిన్ గ్రీవ్స్, కావెం హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అమీర్ జాంగూ, మైకిల్ లూయిస్, గుడాకేష్ మోటీ, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్చదవండి: రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. 16 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసకర శతకం


