breaking news
Aijaz Ahmed
-
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
న్యూఢిల్లీ: పహల్గాంలో గుర్రం స్వారీ సమయంలో నిర్వాహకుడొకరు తమను మతం గురించి అడిగాడంటూ ఓ పర్యాటకురాలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోపై గండేర్బల్ పోలీసులు కూపీ లాగారు. అతడిని గండేర్బల్లోని గోహిపొరాకు చెందిన ఐజాజ్ అహ్మద్ జుంగల్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడితో ఇతడికి సంబంధముందా అనే కోణంలో అతడిని ప్రశి్నస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విడుదల చేసిన నలుగురు అనుమానితుల స్కెచ్లపై యూపీలోని జౌన్పూర్కు చెందిన యుక్తా తివారీ అనే పర్యాటకురాలు స్పందించారు. వారిలో ఇద్దరితో ఘటన రోజున తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే, తాను వారి పేర్లు అడగలేదని చెప్పా రు. ఆమె వెంట ఉన్న స్నేహితులు సైతం వీరిని గుర్తు పట్టారు. అతడు తమను, పేరు, మతం గురించి అడిగాడని, ఎన్నడైనా అజీ్మర్ దర్గాకు గానీ అమర్నాథ్కు గానీ వెళ్లారా అని కూడా ఆరా తీశాడన్నారు. హిందూ ముస్లిం మతాల్లో ఏదంటే ఎక్కువ ఇష్టమని మరొకడు ఆరా తీశాడని యుక్తా తివారీ పోలీసులకు తెలిపారు. ‘ఖురాన్ చదివారా, స్నేహితుల్లో హిందువులెందరు, ముస్లింలెందరు అని కూడా అడిగా డు. ఉర్దూ నాకు రాదని చెప్పగా, ఖురాన్ హిందీలోనూ ఉంటుందన్నాడు. దీంతో నాకు భయమేసింది. ఇంతలోనే అతడి ఫోన్ మోగింది. ఆ వ్యక్తి ప్లాన్ ఏ బ్రేక్ ఫెయిల్. ప్లాన్ బి 35 తుపాకులు పంపాం. వ్యాలీలో గడ్డిలో దాచామని చెప్పా డు. నేను వింటున్నట్లు తెలుసుకుని, వెంటనే మాట మార్చాడు’అని వివరించారు. అలా వారితో చాలా సేపు మాట్లాడామన్నారు. అత డు ఏడేళ్లుగా ఖురాన్ బోధిస్తున్నట్లుగా చెప్పా డన్నారు. అక్కడ తనకు పోలీసులెవరూ కనిపించకపోవడంతో ఈ విషయాలను చెప్పడం కుదరలేదని ఆమె వివరించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ తర్వాత తనకు కనిపించలేదన్నారు. తమ మతం గురించి, 35 తుపాకులను గురించి మాట్లాడినందువల్లే ఆ ఇద్దరూ తనకు, తన స్నేహితులకు బాగా గుర్తుండిపోయారని తివారీ వివరించారు. కూంబింగ్ ముమ్మరం పర్యాటకులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసు విభాగం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అనుమానితుల కోసం కథువా జిల్లాలో శుక్రవారం భారీ స్థాయిలో గాలింపు చేపట్టింది. ఘటనాస్థలి నుంచి ఆపరేషన్ మొదలైందని అధికారులు తెలిపారు. అదేవిధంగా, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో నిషేధిత జమ్మూకశ్మీర్ నేషనల్ ఫ్రంట్(జేకేఎన్ఎఫ్) సంస్థ కార్యకలాపాలు, స్థానికులకు సంబంధాలపై విచారణ మొదలు పెట్టారు. పట్టణలోని గులాం మహ్మద్ గనీ నివాసంలోనూ సోదాలు జరిపారు. ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ సమక్షంలో జరిపిన తనిఖీల్లో జేకేఎన్ఎఫ్కు సంబంధించిన సాహిత్యం లభ్యమైంది. వీటిన్నిటినీ రికార్డు చేశారు.ఆ్రక్టాయ్ పోస్ట్ను మూసేసిన భారత్ జమ్మూ: జమ్మూకశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టార్లో భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఆ్రక్టాయ్ పోస్ట్ను మూసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ పోస్ట్ ద్వారా రెండు దేశాల పౌరుల రాకపోకలకు ఇకపై అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమైన అట్టారీ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ పోస్టును పూర్తిగా మూసివేయడం తెల్సిందే. -
ఉగ్రవాది ఇజాజ్ పట్టివేత
హత్యలు, పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడి గా ఉన్న ఉగ్రవాది మహమ్మద్ ఇజాజ్ అహ్మద్ అలియాస్ అజీజ్ను రాష్ట్ర సీఐడీ పోలీసులు కువైట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ వివరాలను సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ శుక్రవారం వెల్లడించారు. అజంఘోరి స్థాపించిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్(ఐఎంఎంఎం)లో ఇజాజ్ కీలక భూమిక పోషించాడు. అజంఘోరీతో కలిసి విజయవాడలో 1999లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని హత్య చేశాడు. దీంతో ఇజాజ్ను పోలీసులు 2000లో అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన ఇజాజ్ విదేశాలకు పారిపోయాడు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో ఇజాజ్ను కువైట్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. హైదరాబాద్ మొఘల్పురలో కాకతీయ స్వీట్హౌస్తోపాటు లంబా థియేటర్లో బాంబుల ఏర్పాటు, బేగంబజార్లో నగల వ్యాపారి మహావీర్ ప్రసాద్ మోడీ హత్య కేసుల్లో ఇజాజ్ పాత్ర ఉన్నట్లు సీఐడీ విచారణలో తేలింది. -
కువైట్లో ఘోరీ అనుచరుడి అరెస్టు
ఉగ్రవాది అజాం ఘోరీ అనుచరుడు మహమ్మద్ ఇజాజ్ అహ్మద్ను ఇంటర్పోల్ సాయంతో కువైట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. ఇజాజ్ (35) స్వస్థలం నిజామాబాద్ జిల్లా. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2006లో అతను అజ్ఞాతంలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇండియన్ ముస్లిం మొహమ్మది ముజాహిద్దీన్ (ఐఎంఎంఎం)కి నిధుల సేకరణలో భాగంగా విజయవాడలో అతను ఓ వ్యక్తిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐఎస్ఐ ఏజెంట్గా భావిస్తున్న ఘోరీ.. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం ఐఎంఎంఎం స్థాపించాడు. కాగా నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్లో అతను మరణించాడు.