-
కాస్ట్ కటింగ్ సెగ : ఆకాశవాణి జాతీయ ఛానెల్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఆలిండియా రేడియో జాతీయ చానల్కు కాస్ట్ కటింగ్ సెగ తాకింది. ఆకాశవాణి జాతీయ ఛానల్ ప్రసారాలు హేతుబద్దీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్) జాతీయ ఛానల్ను మూసివేయాలని ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి నిర్ణయించింది. ఈ మేరకు ప్రసారభారతి తన నిర్ణయాన్నిడిసెంబరు 24న ఎఐఆర్ డైరెక్టరేట్కు తెలిపింది. ఇందుకోసం గత ఏడాది పలుమార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించింది. అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఐదు నగరాలు, అహ్మదాబాద్ హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను రద్దు చేయనుంది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. తోడాపూర్, నాగపూర్ సహా ఇతర నగరాల్లోని సిబ్బందిని వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేయనుంది. జాతీయ చానెల్ ద్వారా భద్రపరిచే కార్యక్రమాల ఆర్కైవ్స్ను, డిజిటలైజేషన్కోసం ఢిల్లీలోని సెంట్రల్ ఆర్కైవ్స్ సెంటర్కు పంపించాలని జనవరి 3, 2019 తేదీన ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. జాతీయ ఛానల్కు సంబంధించిన ట్రాన్స్మీటర్లు బలహీనంగా ఉండటం కూడా మూసివేతకు కారణమని ఏఐఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నాగపూర్లో ఉన్న ఒకే ఒక ట్రాన్స్మీటరు మాత్రమే ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుత డిజిటల్ రేడియో యుగంలో ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. అలాగే పటిష్టమైన శ్రోతల ప్రాతిపదిక లేని ఛానల్లో పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని సీనియర్ నిర్వాహకులు భావించారని ఆయన వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని ఏఐఆర్ కార్యక్రమాలను అవుట్సోర్స్ ద్వారా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఏఐఆర్ వెబ్సైట్ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐఆర్లోని కొన్ని విభాగాలు ఈ నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఛానల్ ప్రసారాలు చాలా ముఖ్యమైన భాగమని, మొత్తంగా దాన్ని మూసివేయడం కంటే ఖర్చులను తగ్గించుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాయి కాగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు జాతీయ ప్రసారాలు ప్రసారమయ్యే నేషనల్ చానల్ 1987లో ప్రారంభమైంది. 31 సంవత్సరాలకుపైగా జాతీయ వార్తలను, కీలక అంశాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన కీలక పాత్ర పోషించింది. -
'ఆట' మరచిన ఆంధ్ర!
ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో రకరకాల పదవుల్లో 11 మంది ఉన్నారు. ఇందులో జాతీయ సెలక్టర్ కూడా ఒకరు. ఇక ఏసీఏ పరిధిలో అద్భుతమైన స్టేడియాలు, అకాడమీలు ఉన్నాయి. శభాష్... ఆంధ్ర క్రికెట్ ‘వెలిగిపోతోంది’.... ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. పదవులు, స్టేడియాల సంగతి సరే... మరి ఆట సంగతేంటి..? ఒక్కరంటే ఒక్కరన్నా జాతీయ జట్టు దరిదాపుల్లో ఉన్నారా..? లక్షల రూపాయలు పోసి అరువు సీనియర్లను తెచ్చుకున్నా రంజీ జట్టు ఆటతీరు నానాటికీ తీసికట్టుగా ఎందుకు తయారవుతోంది. పదవులు, స్టేడియాలతోనే హడావిడి * ఏ మాత్రం పెరగని క్రికెట్ ప్రమాణాలు * జాతీయ జట్టుకు ఆడే ఆంధ్రా క్రికెటరే లేడా..? సాక్షి, విజయవాడ స్పోర్స్ట్ : ‘హిమాచల్ప్రదేశ్లో కూడా మేం మంచి స్టేడియం కట్టాము. మంచి సౌకర్యాలు కల్పించాం. అయితే నాకేమీ సంతోషంగా లేదు. నా రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు భారత్కు ఆడుతుంటేనే నాకు నిజమైన సంతోషం కలుగుతుంది’... ఇటీవల విజయవాడ సమీపంలోని మూలపాడు వద్ద క్రికెట్ స్టేడియాల ప్రారంభోత్సవంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య ఇది. అంటే ఓ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనం ఆటగాళ్లు తయారు కావడం. కానీ ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మాత్రం దీనిని ఇంకా గ్రహించినట్లు లేదు. ప్రతి జిల్లాలో ఓ క్రికెట్ గ్రౌండ్... కొత్తగా టెస్టు హోదా... ఇండోర్ క్రికెట్ ప్రాక్టీస్ వసతి, రెసిడెన్షియల్ అకాడమీ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థారుులో స్టేడియాల అభివృద్ధి జరగలేదని ఏసీఏ చెప్పుకుంటోంది. బీసీసీఐ ఇచ్చిన నిధులతో గత కొన్నేళ్లలో ఏసీఏలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి బాగా జరిగిందనడంలో సందేహం లేదు. ఇక పదవుల సంగతి సరేసరి. ఏకంగా 11 మంది ఏసీఏ నుంచి బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా పెద్ద హోదాలో ఉన్న ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు మార్కెటింగ్, ఐటీ, ఫిక్చర్స్కమిటీల్లో కూడా సభ్యులు. ఇక ఏసీఏకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ సెలక్టర్గా వ్యవహరించారు. తాజాగా ఆయన పదవీకాలం పూర్తయింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇన్ని సౌకర్యాలు, ఇంత అధికారం ఉన్న క్రికెట్ సంఘం నుంచి జాతీయ జట్టుకు, కనీసం ‘ఎ’ జట్టుకు ఆడే ఆటగాళ్లు కూడా కనపడటం లేదు. ఐపీఎల్లోనూ ఏ జట్టులోనూ తుది జట్టులో ఆంధ్ర క్రికెటర్ ఆనవాళ్లే లేవు. ఈ స్థితిని మార్చడానికి మాత్రం ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. ఆటను పట్టించుకోవడం మానేశారు. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల క్రితం వరకూ ఆంధ్ర క్రికెట్లో ఆటగాళ్లు బాగానే ఉండేవారు. ఎప్పుడు సౌత్జోన్ జట్టు ఎంపిక జరిగినా కనీసం ఇద్దరు, ముగ్గురు ఆడేవారు. ‘ఎ’ జట్టు స్థాయికి కూడా ఆడారు. కానీ ఆ తర్వాత క్రమంగా వైభవం పోయింది. అండర్-19లో రికీ భుయ్ తప్ప మరో ఆటగాడు వెలుగులోకి రాలేదు. ’మా దగ్గర కొందరు పెద్దలకు అభద్రతా భావం ఎక్కువ. ఎవరికీ పేరు రాకూడదని, నేను తప్ప ఇంకెవరూ కనిపించకూడదనే ఆలోచనా ధోరణి కారణంగా ఈ స్థితి ఏర్పడింది’ అని ఏసీఏ సభ్యుడు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏసీఏలో పదవులు అనుభవించేవారిలో మెజారిటీ సభ్యులకు రంజీ జట్టులో ఉండే క్రికెటర్లందరి పేర్లు కూడా తెలియవంటే అతిశయోక్తి కాదు. గత ఎనిమిదేళ్లలో ఒక్క సీజన్లో మాత్రమే ఆంధ్ర రంజీ జట్టు ఎలైట్ గ్రూప్కు వెళ్లింది. కానీ ఒక్క ఏడాదిలోనే మళ్లీ ప్లేట్ ‘సి’ గ్రూప్కు పడిపోయింది. ‘కై ఫ్, మజుందార్ లాంటి సీనియర్ క్రికెటర్లను 25 నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చి ఆడించారు. కానీ ప్రయోజనం లేదు. ఫిజియోలు, కోచ్లు అందరూ బయటివారే. మన దగ్గర ఉన్న టాలెంట్ను గుర్తించడం లేదు. వేణుగోపాలరావును ఆడించకపోవడం దీనికి ఉదాహరణ. ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడేవాళ్లంటే మా వాళ్లకు ఇష్టం. తెలుగు రాని వాళ్లు, తెలుగు మాత్రమే తెలిసిన ఆటగాళ్లకు ఏం కమ్యూనికేట్ చేస్తారని కూడా ఆలోచించడం లేదు’ అని మరో సభ్యుడు వాపోయారు. ఏసీఏలో ఎక్కువ మంది సభ్యులకు పదవులు, ఏ అవకాశం దొరికినా మేనేజర్గానో, మరో రూపంలో విదేశీ పర్యటన అవకాశాలు... ఇలా ఏదో ఒక తారుులాలు లభిస్తుండటంతో ఎవరూ సంఘంలో జరిగే విషయాలను ప్రశ్నించడం లేదు. నిజానికి ప్రశ్నించే వాళ్లు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏసీఏలో లోపించిందే అది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత కాలం రంజీ జట్టు ప్లేట్లోనే ఉంటుంది... నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. అరువు ఆటగాళ్లతో సీజన్ను అలా గడిపేయడమే. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం. మనవాళ్లు పనికిరారా..? 2010లో ఎం.ఎస్.కె. ప్రసాద్ ఏసీఏలో క్రికెట్ ఆపరేషన్స డెరైక్టర్గా పదవి చేపట్టారు. గత ఏడాది ఆయనకు బీసీసీఐ సెలక్టర్గా అవకాశం లభించింది. దాంతో ప్రసాద్ స్థానంలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. అయితే మనవాళ్లు ఎవరూ పనికి రారంటూ కింజల్ సూరత్వాలా అనే వ్యక్తిని ముంబై నుంచి పిలిపించి ఈ పదవిలో కూర్చోబెట్టారు. నెలకు రూ. 3 లక్షల జీతం తీసుకుంటున్న ఈయన నిజానికి వృత్తి రీత్యా డాక్టర్. యూనివర్శిటీ స్థాయిలో ఆడాడని చెప్పుకుంటారు కానీ ఒక రాష్ట్ర జట్టు ఆపరేషన్స చూసే స్థాయిలో క్రికెట్ పరిజ్ఞానం లేదు. గతంలో జాతీయ క్రికెట్ అకాడమీలో స్పోర్ట్స సైన్స హెడ్గా పని చేశారు. ఒక వైపు భాషా సమస్యను అధిగమిస్తూ ఈ ఏడాది కాలంలో ఏం పని చేశారో కూడా ఏసీఏలోనే చాలా మందికి తెలియదు. ‘మా వాళ్లకు ఆటగాళ్లే కాదు... పరిపాలనలోనూ అరువు వాళ్లను తెచ్చుకోవడమే ఇష్టం. ఇక్కడ ఎవరికై నా ఆ పదవి ఇస్తే అవసరమైన సమయంలో మళ్లీ ఎమ్మెస్కేను డెరైక్టర్ చేయలేమని వారి భయం. అందుకే వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు సెలక్టర్గా ప్రసాద్ పదవీకాలం పూర్తరుుంది. కాబట్టి సూరత్వాలాను పంపించి, ప్రసాద్ను ఆ స్థానంలో కూర్చోబెడతారు’ అని ఏసీఏలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి చెప్పటం విశేషం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement