'కలర్స్' స్వాతిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకుంది.
ఓ టాలీవుడ్ దర్శకుడినే కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుని అందరికీ షాకిచ్చింది.
ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
చివరగా ఈమె 2023లో 'మంత్ ఆఫ్ మధు' మూవీ చేసింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ నాగోతితో ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ ఇప్పుడు బుధవారం(జూలై 08) ఇతడిని పెళ్లి చేసుకుంది.
స్వాతి 2018లో మలయాళీ అయిన వికాస్ వాసు అనే అంతర్జాతీయ పైలట్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమై ఇండోనేషియాలో స్థిరపడ్డింది. అయితే, దురదృష్టవశాత్తూ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.


