ఏపీకి 1.93 లక్షల ఇళ్లు మంజూరు | Union govt sanctions 1.93 lakh houses for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి 1.93 లక్షల ఇళ్లు మంజూరు

Nov 18 2015 6:38 PM | Updated on Oct 20 2018 5:26 PM

బలహీన వర్గాలకు గృహనిర్మాణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కే కేంద్ర ప్రభుత్వం 1,93,147 గృహాలు మంజూరు చేసింది.

న్యూఢిల్లీ: బలహీన వర్గాలకు గృహనిర్మాణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కే కేంద్ర ప్రభుత్వం 1,93,147 గృహాలు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.50 లక్షలు కేంద్రం అందిస్తుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

తెలంగాణకు 10,290, గుజరాత్ కు 15,580, రాజస్థాన్ కు 6,255 గృహాలను కేంద్రం కేటాయించింది. 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర పట్టణాబివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement