-
అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి
సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటి రూపంలో పేద అక్కచెల్లెమ్మల చేతిలో ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తిని పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామన్నారు. వివిధ దశల్లో 22 లక్షల గృహాలు నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల మేర ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఆర్డీయేలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సోమవారం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను సీఎం జగన్ అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సంతోషంగా స్వీకరిస్తున్నాం.. సీఆర్డీఏలో 50,793 మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలిచ్చాం. ఈ రోజు గృహ నిర్మాణాలను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అత్యధికంగా ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారు. వారి నిర్ణయానికి అనుగుణంగా మన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తోంది. సీఆర్డీఏ ప్రాంతంలో గజం స్థలం కనీసం రూ.15 వేలు ఉంది. ఈ లెక్కన పేద మహిళలకు ఇచ్చిన స్థలం విలువే రూ.7.50 లక్షలు ఉంటుంది. మరో రూ.2.70 లక్షలు వెచ్చించి ఇళ్లను నిర్మిస్తున్నాం. మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటి మీద మరో రూ.లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఈ ఆస్తి విలువ కనీసం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతుంది. అన్ని సదుపాయాలతో.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లేఅవుట్లను అభివృద్ధి చేసి 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు ఇళ్లను నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి లేఅవుట్ వద్దకు అక్కచెల్లెమ్మలను తీసుకుని వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి ఆ ఇంటి స్థలంలో ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేశాం. సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవలింగ్, ప్లాట్ల సరిహద్దు రాళ్లు కూడా పాతాం. దీనికోసం ఇప్పటికే రూ.56 కోట్లు ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్లలో నీటి సరఫరా కోసం రూ.32 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. విద్యుత్ కనెక్షన్ కోసం రూ. 326 కోట్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి మరో రూ.8 కోట్లతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. పేదల ఇళ్లు నిర్మించే కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్మాల్స్, పార్కులు వస్తాయి. మిమ్మల్నందరినీ ఆయా సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో మ్యాపింగ్ చేశారు. కౌంటర్లలో మీ ఇంటికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెడతారు. ఇందుకోసం 25 కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఏ ప్రభుత్వమూ చేయనంతగా గత నాలుగేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని మీ బిడ్డ చేసి చూపించాడు. పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, వివక్షకు తావులేకుండా సేవలు, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు దన్నుగా నిలిచాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్.. ఇలా వైద్య ఆరోగ్య సేవలలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలను తీసుకొస్తున్నాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఆరోగ్య ఆసరాను అమలు చేస్తున్నాం. వైద్య ఆరోగ్యసేవల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణం, సామాజిక వర్గాల సంక్షేమం, ప్రాంతాల సంక్షేమం, డీసెంట్రలైజేషన్, పోర్టులు.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని చేశాం. భావోద్వేగంతో కంటతడి ఇళ్లు నిర్మాణ మంజూరు పత్రాలు అందుకున్న పలువురు మహిళలు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. వాస్తవానికి 2020 డిసెంబర్లోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అయితే ప్రతిపక్షాల కుట్రలతో సీఆర్డీఏలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయ్యాక మూడేళ్ల అనంతరం తమకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందచేయడంతో ఉద్వేగానికి గురయ్యారు. వెంటనే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి ఆశీస్సులు సీఆర్డీఏలో సీఎం జగన్ చేతుల మీదుగా పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మహిళా లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కృష్ణాయపాలెం లేఅవుట్లో భూమి పూజ అనంతరం వెంకటపాలెంలోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్న కొద్ది సేపటికే వర్షం ప్రారంభం అయింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు లబ్దిదారులు సభాప్రాంగణం వెలుపల నిల్చుని సీఎం ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. సుమారు అరగంట పాటు కొనసాగిన సీఎం జగన్ ప్రసంగాన్ని మహిళలు ఆసక్తిగా విన్నారు. ‘‘అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం పెత్తందారులపై పేద వర్గాల విజయానికి తార్కాణం. పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన ద్వారా సామాజిక అమరావతికి పునాది రాయి వేశాం...’ అని సీఎం జగన్ పేర్కొన్నప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జై జగన్ నినాదాలు హోరెత్తాయి. ‘రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించారు. ఇలాంటి పెత్తందారులు, దుర్మార్గమైన మనుషులను, పార్టీలను గతంలో ఎప్పుడైనా మనం చూశామా..?’ అని సీఎం ప్రశ్నించడంతో.. చూడలేదని మహిళలు బిగ్గరగా సమాధానమిచ్చారు. -
అమరావతిలో పేదల ఇళ్ల పండుగ.. బొట్టు పెట్టి ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి, మంగళగిరి: పేదల ఇళ్ల పండుగకు అమరావతి ముస్తాబవుతోంది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద సీఆర్డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వతేదీన పేదల ఇళ్ల నిర్మాణానికి కృష్ణాయపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. వలంటీర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి ఈ కార్యక్రమానికి రావాలని సాదరంగా కోరుతున్నారు. వన మహోత్సవం సందర్భంగా అదే రోజు అమరావతిలో 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల్లో మోడల్ హౌస్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్లో లబ్ధిదారురాలు ఈపూరి జీవరత్నం ఇంటిని మోడల్ హౌస్గా నిర్మించారు. షీర్ వాల్ పద్ధతిలో మూడు రోజుల స్వల్ప వ్యవధిలోనే అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీలైనన్ని ఇళ్లను షీర్ వాల్ పద్ధతిలో నిర్మించి వేగంగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు సులభంగా అర్థం అయ్యేలా మోడల్ హౌస్ను నిర్మించారు. అత్యధికంగా ఆప్షన్–3 ఇళ్లు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ప్రభుత్వం సీఆర్డీఏలో 1,366.48 ఎకరాల్లో 25 లేఅవుట్లలో ఇంటి స్థలాలను పంపిణీ చేసింది. 47,017 మంది లబ్ధిదారుల (ఎన్టీఆర్ జిల్లా 23,821, గుంటూరు జిల్లా 23,196) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు లభించాయి. వీరిలో 45,100 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. 24,200 ఇళ్లను షీర్వాల్ పద్ధతిలో, మిగిలినవి సాధారణ పద్ధతిలో నిర్మించేందుకు 36 లేబర్ ఏజెన్సీలను గుర్తించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా రూ.365.91 కోట్లతో విద్యుత్, నీటి సదుపాయంతో పాటు అప్రోచ్ రోడ్లను వేస్తున్నారు. ఈ లేఅవుట్లలో రూ. 72.06 కోట్లతో మౌలిక వసతులతో పాటు స్కూళ్లు, హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు లాంటి సదుపాయాలను కల్పించనున్నారు. పేదలకు 30 లక్షలకుపైగా ఇళ్లు రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల కోసం 30 లక్షలకు పైగా గృహ నిర్మాణం లక్ష్యంగా నవరత్నాలు పథకం ద్వారా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. 30.65 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఇళ్ల స్థలాల కింద పేదలకు అందించిన స్థలాల మార్కెట్ విలువ రూ.75 వేల కోట్ల మేరకు ఉంటుంది. కేవలం స్థలాలిచ్చి సరిపుచ్చకుండా రెండు దశల్లో 21.25 లక్షల (టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు, సాధారణ ఇళ్లు 18.63 లక్షలు) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకూ అనుమతులు ఇచ్చారు. సీఆర్డీఏలో నిర్మించే ఇళ్లు వీటికి అదనం. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 4.40 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రూ.లక్షల విలువ చేసే స్థలాలను ఉచితంగా సమకూర్చడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయాన్ని అందచేస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక, సబ్సిడీపై స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 24న తొలుత కృష్ణాయపాలెం చేరుకుని ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం పైలాన్ను ఆవిష్కరించి లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. వెంకటాయపాలెం బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శాంక్షన్ లెటర్ అందచేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్రెడ్డి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలితో పాటు సీఎం ప్రసంగ వేదికను శుక్రవారం పరిశీలించారు. నవులూరు లే ఔట్ వద్ద సీఎం 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్, ఎండీ లక్ష్మీ షా తదితరులు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తోబుట్టువులా తోడుగా.. వలంటీర్గా పనిచేస్తున్నా. నా భర్త వ్యవసాయ కూలీ. పెళ్లై 13 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఒక్కసారి దరఖాస్తు చేయగానే ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. కృష్ణాయపాలెం లేఅవుట్లో నాకిచ్చిన స్థలంలో నా ఇంటినే మోడల్ హౌస్గా నిర్మించారు. సీఆర్డీఏలో పూర్తయిన మొదటి ఇల్లు నాదే. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. పిల్లల చదువుకు అమ్మ ఒడి కింద సాయం చేశారు. పొదుపు సంఘంలో ఉన్న నాకు నాలుగు విడతల్లో రూ.10 వేల చొప్పున రుణమాఫీ అందించారు. తోబుట్టువులా సీఎం జగన్ అండగా ఉన్నారు. ప్రభుత్వం మాకు ఇళ్లు ఇస్తుంటే కొందరు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఆ వార్తలు విన్నప్పుడు ఎక్కడ ఇల్లు రాకుండా పోతుందోనని భయంగా ఉంటుంది. – ఈపూరి జీవరత్నం, ఇళ్ల లబ్ధిదారురాలు, కృష్ణాయపాలెం, గుంటూరు జిల్లా -
సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాలలో నిరుపేదలు ఉండరాదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి గ్రామాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల రాజధాని స్వరూపం మారిపోతుందా? అక్కడ డబ్బులు ఉన్న మా రాజుల సోకులకు ఇబ్బంది వస్తుందా? గత ప్రభుత్వ హయాంలో దళితుల అస్సైన్డ్ మెంట్ భూములను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవడంలో ఈ లక్ష్యం కూడా ఉందా? రాజధాని అంశం గత తొమ్మిదేళ్లుగా ఏదో రూపంలో నలుగుతూనే ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం ఈ వ్యవహారాలలో ఒక కీలక మలుపు అని చెప్పాలి. అదే 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా ఉన్నట్లయితే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కావేమో! ఆ తర్వాత విజయవాడ పరిసరాలలో రాజధాని అని ప్రకటించి భారీ స్పెక్యులేషన్ కు అవకాశం ఇచ్చారు. తన పార్టీ వారికి ,తన వారికి మంచి అవకాశం వచ్చేలా చేసి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా లబ్ది చేకూర్చారన్న ఆరోపణను చంద్రబాబు ఎదుర్కున్నారు. రైతులకు ఇష్టం ఉన్నా,లేకున్నా ముప్పై మూడు వేల ఎకరాలను సమీకరించారు. భూములు ఇవ్వని రైతుల పంటలను కూడా దగ్దం చేయించారన్న విమర్శలు ఎదుర్కున్నారు. కొత్త రాజధాని నిర్మాణం పేరిట దేశదేశాలు తిరిగి వందల కోట్లు వ్యయం చేశారు. అసలు ఇన్నివేల ఎకరాలు ఎందుకు? వెయ్యి లేదా రెండువేల ఎకరాలు సేకరించి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పినవారిపై ఆయన హుంకరించేవారు. అసలు ఎపి భవిష్యత్తు అంతా ఆ అమరావతిలోనే ఉందని ప్రచారం చేసేవారు. అందుకోసం ప్రజలు కూడా విరాళాలు ఇవ్వాలని అనేవారు. కేంద్రం లక్షల కోట్ల ఆర్దిక సాయం చేయాలని కోరేవారు. తొలిదశకే లక్షా తొమ్మిది వేల కోట్లు కావాలని కేంద్రానికి ఆయన ఉత్తరం రాశారు. వందల కోట్ల వ్యయం చేసి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం నిర్మించారు. అవి కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో కట్టారు. ఆయన తన పాలన టైమ్ లో సరైన రోడ్డును కూడా నిర్మించలేకపోయారు. ఒక ప్రధాన రోడ్డు వేయడానికి ప్రయత్నించినా, దానిని పూర్తి చేయలేకపోయారు. అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటివారు సైతం అమరావతి రాజధాని ఒక వర్గానికి చెందిన రాజధాని అని విమర్శించేవారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజలంతా అభివృద్ది అంతా ఒక్క గుంటూరు జిల్లా ప్రాంతంలోనేనా అని వాపోయేవారు. కృష్ణా, గుంటూరు జిల్లా లోని ప్రజలు కేవలం ఒక సామాజికవర్గ ప్రయోజనానికే రాజధాని నిర్మాణం చేస్తున్నారని, మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారని భావించేవారు.వీటన్నిటి ఫలితం తెలుగుదేశం ఘోరమైన పరాజయం. ఇంకో సంగతి చెప్పాలి. ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే చంద్రబాబు వర్గం వారు కొందరు ఆయన నడిచిన ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన పరిస్థితి అంతటిని అధ్యయనం చేసి, కొందరు ప్రముఖులతో కలిసి కమిటీలను వేశారు. వారిచ్చిన సిఫారసులను దృష్టిలో ఉంచుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని ప్రతిపాదించారు. కాని దీనిని వ్యతిరేకించిన చంద్రబాబు, టిడిపి నేతలు రకరకాల ఎత్తుగడలతో అది ముందుకువళ్లకుండా చేస్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే ఎపి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలను పొందుతోంది. రాజధానిలో చట్టం ప్రకారం ఐదు శాతం భూములలో పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలి. చట్టంలో అలా ఉన్నా, ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకోలేదు. పైగా దళితుల అస్సైన్డ్ భూములన్నిటీని మోతుబరులు స్వాధీనం చేసుకునేందుకు సహకరించింది. అంటే అక్కడ పేదలు ఉంటే వారి విలాసవంతమైన భవనాలకు విలువ ఉండదని అనుకుని ఉండాలి. నిజమే.పొలాలు ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలి. కాని అదే సమయంలో పేదలకు కూడా అక్కడ అవకాశం ఉండాలి కదా! జగన్ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించగానే మళ్లీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దానిపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తే, ఆ ధర్మాసనం ఆ తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసి నిలుపుదల చేసింది. దాంతో జగన్ ప్రభుత్వం ఏభై నాలుగువేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మించాలని ప్రతిపాదించి చురుకుగా కృషి చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుప్రింకోర్టుకు వెళ్లారు. ఆర్.జోన్ 5 లో పేదలకు స్థలాలు ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం కూడా ఒకే చేసింది. కాకపోతే హైకోర్టు ఇచ్చే అంతిమ తీర్పుకు లోబడి ఉండాలని ఒక మాట అంది. స్థూలంగా అది పేదలకు, ప్రభుత్వానికి విజయంగా భావించవచ్చు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అక్కడ వారికి అవసరమైన సదుపాయలు కూడా కల్పిస్తోంది. అయినా రైతుల పేరుతో కోట్ల రూపాయల వ్యయం చేసి కొందరు కోర్టులకు వెళ్లారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చకుండా ఉంటే ఈ రైతులు కాని, వారి ముసుగులో ఉన్న టిడిపి నేతలు కాని ఈ స్థలాలను అడ్డుకునే యత్నం చేయగలిగేవారా? చిత్రం ఏమిటంటే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్న నినాదంతో ఎన్.టి.రామారావు టిడిపిని స్థాపించారు. కాని ఇప్పుడు పేదవాడికి ఇల్లు నిర్మించడానికి వీలులేదన్నట్లుగా తెలుగుదేశం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి పేదల పక్షాన నిలవవలసిన వామపక్షాలు సైతం చంద్రబాబుకే బాకా ఊదడం దురదృష్టకరం. విజయవాడ కాల్వల వెంట ఉన్న గుడిసెలను తొలగించి, వేరే చోట భూములు ఇవ్వడానికి గతంలో ప్రభుత్వం ప్రయత్నిస్తే వామపక్షాలు అడ్డుకునే యత్నం చేసేవి. పేదలకు అన్యాయం అని వ్యాఖ్యానించేవి. కాని రాజధాని అమరావతిలో వారికి భూములు ఇస్తుంటే ప్రత్యేకించి సిపిఐ హర్షించకపోగా, భూస్వాములకు, టీడీపీకి మద్దతు ఇస్తోంది. దేశంలో ఏ రాజధానిలోనూ పేదల ఇళ్లు, చిన్న కాలనీలు లేవా? అన్నదాని గురించి ఆలోచిస్తే, అమరావతిలో మాత్రమే అలా ఉండరాదని చెబుతున్నట్లుగా ఉంది. ఢిల్లీలో అనేక లొకాలిటీలలో పేదల ఇళ్లు ఉన్నాయి. ముంబైలో ధారవి ఒక పెద్ద ఉదాహరణ. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మొత్తం అన్ని ప్రభుత్వ భవనాలు కలిపి 235 ఎకరాలలో ఉన్నాయి. హైదరాబాద్ లో సచివాలయం చెంతనే పేదలు, దిగువ మధ్య తరగతికి చెందినవారి కాలనీలు ఎన్నో ఉన్నాయి. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! హైదరాబాద్లో ధనిక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన బంజారాహిల్స్, జూబ్లి హిల్స్ వంటి చోట్ల బలహీనవర్గాల కాలనీలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలాంటి అవకాశం ఇవ్వకపోతే, పేదలు ఎక్కడ కాస్త జాగా దొరికితే అక్కడ గుడిసెలు వేసుకుంటున్నారు. దానికన్నా ప్రభుత్వం వారికి కాస్త జాగా స్థలం ఇస్తే సంతోషంగా ఇల్లు కట్టుకుంటారు కదా! ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రి జగన్ అదే పని చేస్తున్నారు. కాని టీడీపీ వారేమో అలా పేదల కాలనీలవల్ల తమ భూముల రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిపోతుందని అంటున్నారు. హైదరాబాద్ లో పేదల కాలనీలవల్ల అలా ధరలు పడిపోయిన దాఖలాలు లేవు. ఆ సంగతిని విస్మరించి అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారి మాటలు నమ్మి తమకు తామే నష్టం చేసుకుంటున్నారు. మరో వైపు జగన్ పట్టుదలతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు వెళుతున్నారు. శరవేగంగా సాగుతున్న ఈ కార్యక్రమం ఒక కొలిక్కి రాబోతోంది. అప్పుడు కులాల అసమౌతుల్యత వస్తుందని అనేవారికి ఇది ఒక గుణపాఠం అవుతుంది. మనుషులంతా ఒక్కటే అన్న సూత్రాన్ని జగన్ అమలు చేయబోతున్నారన్నమాట. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేకొద్దీ కరెంట్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించే ముందు ఎవరైనా తొలుత వీటినే కోరుకుంటారని, అందువల్ల ఈ మూడింటిని తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. నిర్ణీత దశకు రాగానే కరెంట్ కనెక్షన్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిడ్కో ఇళ్లు కాకుండా రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల కోసం ఖర్చు పెట్టాం. గృహ నిర్మాణాలు పూర్తవుతున్నకొద్దీ కనీస సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల లబ్ధిదారులతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిర్మాణం నిర్ణీత దశకు చేరుకోగానే ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్టుగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రత్యామ్నాయ స్థలాలు.. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటైన కాలనీల్లో లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తున్నాం. కొన్ని చోట్ల న్యాయ వివాదాల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటిపై దృష్టి సారించాలి. కోర్టు వివాదాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయిన చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించి ఆ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలి. గృహనిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఔట్ల సందర్శన.. 4 రకాల పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో ఇళ్లు కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణాల కోసం ఇప్పటివరకు రూ. 6,435 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. క్రమం తప్పకుండా లేఔట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దఫాలు లేఔట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని లేఔట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన ల్యాబ్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, ప్రత్యేక కార్యదర్శులు అజయ్జైన్, సాయిప్రసాద్, విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ షా, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రజిని
చిలకలూరిపేట: పేదలందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన 2,272 గృహాలను మంత్రి శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో ఫేజ్–1 కింద నిర్మించిన 4,512 టిడ్కో గృహాల్లో తొలి విడతగా 2,272 గృహాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మిగిలిన గృహాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మరో 1,008 గృహాల పనులు త్వరగా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, దుష్టచతుష్టయం ఓర్వలేక విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, పేదలకు అండగా ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, టిడ్కో ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ జి.ప్రసాదరావు, మెప్మా పీడీ వెంకటనారాయణ, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement