పుష్కర ‘పాపం’ ప్రభుత్వానిదే | Pushkarni 'sadly' government | Sakshi
Sakshi News home page

పుష్కర ‘పాపం’ ప్రభుత్వానిదే

Jul 15 2015 2:27 AM | Updated on Sep 3 2017 5:29 AM

పుష్కర ‘పాపం’ ప్రభుత్వానిదే

పుష్కర ‘పాపం’ ప్రభుత్వానిదే

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో పెద్ద ఎత్తున భక్తులు మృతిచెందడం తీరని విషాదమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

పెందుర్తి: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో పెద్ద ఎత్తున భక్తులు మృతిచెందడం తీరని విషాదమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ విచారం వ్యక్తం చేశారు. ఈ పాపం ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పుష్కరాల్లో ప్రచారంకోసం పాకులాడిన ప్రభుత్వం భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో  విఫలమైందని తప్పుపట్టారు.

తొలిరోజు లక్షలాది మంది వస్తారని ముందే తెలిసిన ప్రభుత్వం, అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో అలసత్వం వహించారన్నారు. కుంభమేళాను తలపిస్తామని ప్రచారం చేసినవారు తగిన ఏర్పాట్లు చేయాలి కదా అని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement