బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు | police, terrorists encounter in jammu and kashmir | Sakshi
Sakshi News home page

బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు

Jan 14 2015 10:09 AM | Updated on Aug 21 2018 5:46 PM

బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు - Sakshi

బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు

తీవ్రవాదులు, పోలీసులకు మధ్య హోరాహోరీ కాల్పులతో జమ్మూ కాశ్మీర్ సోపోర్ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.

జమ్మూ కాశ్మీర్: తీవ్రవాదులు, పోలీసులకు మధ్య హోరాహోరీ కాల్పులతో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సోపోర్లోని ఓ భవంతిలో లష్కరే తోయిబా తీవ్రవాదులు ఆశ్రయం పోందారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని పలు నివాసాలలో తనిఖీలు చేపట్టారు.

ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైయన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. దాంతో ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. అయితే తీవ్రవాదులు ఆశ్రయం పొందిన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement