టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోదరుడు నరేంద్ర సింగ్ ధోని రాంచీ నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు.
జార్ఖండ్ : టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోదరుడు నరేంద్ర సింగ్ ధోని రాంచీ నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ తరపున నరేంద్ర సింగ్ బరిలోకి దిగుతున్నాడు. ఈ విషయాన్ని జార్ఖండ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కాశీనాధ్ యాదవ్ నిన్న ధన్బాద్లో వెల్లడించింది.
ఇప్పటికే నరేంద్ర సింద్ ధోనీ సమాజ్ వాదీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 2009లో నరేంద్ర సింగ్ ధోని ...బీజేపీలో చేరి...అనంతరం ఆపార్టీని వీడాడు. పార్టీ కార్యకర్తలను గౌరవించనందునే ఆపార్టీని వీడినట్లు ఆయన తెలిపారు. సమాజ్వాదీ పార్టీలో నేతలతో పాటు కార్యకర్తలకు సమాన గౌరవం లభిస్తుందన్నారు.