బోటు ప్రమాదంలో 200 మంది గల్లంతు | Ferry with 200 passengers sinks in Bangladesh | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాదంలో 200 మంది గల్లంతు

Aug 4 2014 1:02 PM | Updated on Apr 3 2019 5:24 PM

బంగ్లాదేశ్ లోని జరిగిన బోటు ప్రమాదంలో 200 మంది అదృశ్యమైయ్యారు.

ఢాకా: బంగ్లాదేశ్ లో జరిగిన బోటు ప్రమాదంలో 200 మంది గల్లంతయ్యారు. సోమవారం ఉదయం పద్మా నదిలో బోటు వెక్కిన అనంతరం పినాక్-6 అనే బోటు ముంపుకు గురవ్వడంతో అందులోని ప్రయాణికులు నీట మునిగిపోయారు. మదరిపూరాస్ నుంచి మున్ షిన్ గంజ్ కు వెళుతున్న వీరు ప్రమాదం బారిన పడ్డారు. దీంతో రక్షణ దళాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

 

ఇదిలా ఉండగా,  వేటకు వెళ్లిన 640 మంది చెన్నై జాలర్లు బంగాళాఖాతంలో అదృశ్యమైయ్యారు. 40 పడవల్లో సముద్రంలోకి వేటకు వెళ్లిన ఆ జాలర్ల ఆచూకీ నిన్నరాత్రి నుంచి కనిపించకుండా పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement