'స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించండి' | Dedicate a day for Swachch Bharat: Goa governor | Sakshi
Sakshi News home page

'స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించండి'

May 15 2015 8:36 PM | Updated on Sep 3 2017 2:06 AM

స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించాలని హాస్పిటాలిటి పరిశ్రమ వర్గాలను గోవా గవర్నర్ మృదులా సిన్హా కోరారు.

పణజి: స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించాలని హాస్పిటాలిటి పరిశ్రమ వర్గాలను గోవా గవర్నర్ మృదులా సిన్హా కోరారు. ప్రతినెల చివరి శనివారం 'క్లీన్ డే'గా పాటించాలని సూచించారు. కనీసం గంట సమయం పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలన్నారు.

గోవా పర్యాటక రాష్ట్రం అయినందున స్వచ్ఛభారత్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటి స్టేక్ హోల్డర్ల సమావేశంలో శుక్రవారం గవర్నర్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement