ఆ ఘోరం.. మానవ తప్పిదమే | Bangalore-Nanded Train accident Over Human error | Sakshi
Sakshi News home page

ఆ ఘోరం.. మానవ తప్పిదమే

Jan 30 2014 1:10 AM | Updated on Sep 5 2018 9:45 PM

అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలో గత నెల 28న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌రైలులోని బీ1 బోగీలో జరిగిన అగ్ని ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని తేలింది.

 ‘బెంగళూరు-నాందేడ్’ రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదిక
 సాక్షి, బెంగళూరు : అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలో గత నెల 28న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌రైలులోని బీ1 బోగీలో జరిగిన అగ్ని ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని తేలింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన దక్షిణ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ సతీశ్ కుమార్ మిట్టల్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను లక్నోలోని రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు పంపారు. నివేదికలో పేర్కొన్న వివరాలు..
  అపరిచిత ప్రయాణికుడి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం.   
     విద్యుత్ సరఫరా వ్యవస్థలన్నిటికీ రక్షణ సౌలభ్యాలు ఉన్నందున, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
  హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం దగ్ధమైన బోగీలో పేలుడు జరిగిన ఆనవాళ్లు లేవు. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందనడానికి కూడా సరైన ఆధారాలు లేవు.
  బోగీ నుంచి రైల్వే పోలీసులు సేకరించిన వస్తువుల్లో మద్యం క్వార్టర్ బాటిల్, బీడీలు, అగ్గిపెట్టె, దగ్ధమైన ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్‌లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement