మిలిటెంట్ కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు మృతి | 3 soldiers killed in militants' attack in Pakistan Islamabad | Sakshi
Sakshi News home page

మిలిటెంట్ కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు మృతి

Sep 14 2014 4:55 PM | Updated on Aug 28 2018 7:14 PM

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడులతో బీభత్సం సృష్టిస్తున్నారు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడులతో బీభత్సం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆదివారం చేసిన దాడిలో ముగ్గురు ఆ దేశ జవాన్లు మృతిచెందారు. ఉత్తర వజిరిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ జవాన్లపై మిలిటెంట్లు అగ్నిమాపక క్షిపణిలతో దాడి చేసినట్లు పాకిస్తాన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన పలు రాకెట్లు ధ్వంసం కాగా, ముగ్గరు జవాన్లు అసువులు బాసారన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు స్పష్ట చేశారు. జూన్ 15 వ తేదీన కరాచీ ఎయిర్ పోర్ట్ పై మిలిటెంట్లు దాడి చేసిన అనంతరం పాకిస్తాన్ బలగాలు ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ 950 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్ వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement