నాయక్ కుటుంబానికి షర్మిల పరామర్శ | ys sharmila visit hanuma naik family in guvvala gutta tanda | Sakshi
Sakshi News home page

నాయక్ కుటుంబానికి షర్మిల పరామర్శ

Jan 21 2015 5:20 PM | Updated on Sep 2 2017 8:02 PM

నాయక్ కుటుంబానికి షర్మిల పరామర్శ

నాయక్ కుటుంబానికి షర్మిల పరామర్శ

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోని దేవచర్లతండాలో హనుమానాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు.

దేవచర్ల: పరామర్శయాత్రలో భాగంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోని దేవచర్లతండా చేరుకున్నారు.

తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన హనుమానాయక్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. అంతకుముందు రాజన్న తనయ షర్మిలకు ఆత్మీయ స్వాగతం లభించింది. జగనన్న సోదరిని చూసేందుకు అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement