వింటేజ్ షో అదిరింది.. | Vintage electrifying show .. | Sakshi
Sakshi News home page

వింటేజ్ షో అదిరింది..

Aug 16 2014 1:07 AM | Updated on Sep 2 2017 11:55 AM

వింటేజ్ షో అదిరింది..

వింటేజ్ షో అదిరింది..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లుంబినీ పార్క్‌లో ఏర్పాటుచేసిన వింటేజ్ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంది. 1962 నుంచి ఇప్పటి 2004 వరకు మార్కెట్లోకి వచ్చిన మొత్తం 30 కార్లు, 60కి పైగా ద్విచక్రవాహనాలు శుక్రవారం ప్రదర్శనలో ఉంచారు.

ఖైరతాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లుంబినీ పార్క్‌లో ఏర్పాటుచేసిన వింటేజ్ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంది. 1962 నుంచి ఇప్పటి 2004 వరకు మార్కెట్లోకి వచ్చిన మొత్తం 30 కార్లు, 60కి పైగా ద్విచక్రవాహనాలు శుక్రవారం ప్రదర్శనలో ఉంచారు. చవర్‌లెట్ కంపెనీ...ఆస్టిన్- మేడిన్ ఇంగ్లాండ్ 1952 నాటి ఆస్టిన్ - మేడిన్ ఇంగ్లాడ్ బైక్... రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన సైకిల్...రాజ్‌దూత్, హెచ్‌డి, బుల్లెట్, వెస్పా స్కూటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలచాయి. ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆరువేల వింటేజ్ వాహనాలు ఉంటే తెలంగాణలోనే రెండువేల వాహనాలు ఉన్నాయన్నారు.
 
1952 నాటి నార్టన్ బైక్ (500సిసి)ను కమిషనర్ ఉత్సాహంగా నడిపారు. ఎంతో కాలం తర్వాత ద్విచక్రవాహనం నడిపే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. వింటేజ్ ప్రదర్శనలో 1952 మోడల్ చవర్‌లెట్ కంపెనీకి చెందిన  స్టైల్ లైన్ డీలక్స్ - 6 సిలిండర్ ఇంజన్, 1936 మోడల్ ఆస్టిన్ -ఇంగ్లాండ్ మోడల్ కారు తండ్రి జ్ఞాపకార్థం తనకు ద క్కిందని మాధవరావు తెలిపారు.

రెండవ ప్రపంచ యుద్దంలో ఉపయోగించిన 1935 నాటి పోల్డబుల్ సైకిల్, 1973నాటి ప్యూజీ కంపెనీ మోటార్ సైకిల్, 1953 ఇంజన్ సైకిల్ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. టీఎస్‌ఐఐసీ వైస్ చైర్మన్ జయేష్ రంజన్‌తో పాటు నగరం నలు మూలల నుంచి విచ్చేసిన సందర్శకులు ఎంతో ఉత్సాహంగా వాహనాల వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement